ETV Bharat / bharat

ఉగ్రవాదుల ఏరివేతలో అశుతోష్ 'శౌర్య' ప్రతాపం

ఉగ్రవాదులను ఏరివేయడంలో దిట్ట. ఎదురుగా ఎంతమంది శత్రువులు ఉన్నా భయమనేది ఉండదు. ముష్కరుల దాడుల్లో ఎంతో మందిని సైనికులను కాపాడారు. అతడి ధైర్య సాహసాలకు మెచ్చి కేంద్రం 2 సార్లు ప్రతిష్టాత్మక 'శౌర్య' పతకాలను అందించింది. ఆయనే శనివారం జమ్ముకశ్మీర్​ హంద్వారాలో ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్​ అశుతోష్ శర్మ.

author img

By

Published : May 3, 2020, 2:59 PM IST

Col killed in Handwara was a two-time gallantry awardee for counter-terrorist operations
ఉగ్రవాదుల ఏరివేతలో కల్నల్​ అశుతోష్ 'శౌర్య' ప్రతాపం

జమ్ముకశ్మీర్ హంద్వారాలో శనివారం రాత్రి జరిగిన ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్​ అశుతోష్ శర్మ సాహసమే ఊపిరిగా బతికారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ఆయన చూపిన పరాక్రమం అసామాన్యం. అందుకే ఆయన నిబద్ధతను మెచ్చి శౌర్య, సేన పతకాలను అందజేసింది కేంద్రం.

కల్నల్​ అశుతోష్​ శర్మ 21వ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్​లో విధులు నిర్వహించేవారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ప్రదర్శించిన ధైర్య సాహసాల​కు గాను రెండు సార్లు శౌర్య పతకాన్ని అందుకున్నారు శర్మ. ఉగ్రవాదులు తప్పించుకునేటప్పుడు వారిపై చేతి బాంబులు విసిరి వారిని నిరోధించారు. ఎన్​కౌంటర్​ సమయాల్లో జమ్ముకశ్మీర్​ పోలీస్ సిబ్బందితో పాటు ఎంతో మంది సైనికుల ప్రాణాలను కాపాడారు కల్నల్​.

గత ఐదేళ్లలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయిన కల్నల్​ స్థాయి సైనికాధికారి కల్నల్​ ఒక్కరే. సరిగ్గా ఐదేళ్ల కితం 2015 జనవరిలో కల్నల్​ ఎంఎన్​ రాయ్​ ఎన్​కౌంటర్​లో చనిపోగా.. అదే ఏడాది నవంబర్​లో కల్నల్​ సంతోష్​ మహాధిక్​ వీర మరణం పొందారు.

గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ అశుతోష్ శర్మ చాలా కాలంగా కశ్మీర్ లోయలో సేవలందిస్తున్నారు. కమాండింగ్ అధికారిగా తాను ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గాను రెండు సార్లు 'సేన' పతకాన్ని అందుకున్నారు.

జమ్ముకశ్మీర్ హంద్వారాలో శనివారం రాత్రి జరిగిన ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీర మరణం పొందిన కల్నల్​ అశుతోష్ శర్మ సాహసమే ఊపిరిగా బతికారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ఆయన చూపిన పరాక్రమం అసామాన్యం. అందుకే ఆయన నిబద్ధతను మెచ్చి శౌర్య, సేన పతకాలను అందజేసింది కేంద్రం.

కల్నల్​ అశుతోష్​ శర్మ 21వ రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్​లో విధులు నిర్వహించేవారు. ఉగ్రవాద నిరోధక కార్యకలాపాల్లో ప్రదర్శించిన ధైర్య సాహసాల​కు గాను రెండు సార్లు శౌర్య పతకాన్ని అందుకున్నారు శర్మ. ఉగ్రవాదులు తప్పించుకునేటప్పుడు వారిపై చేతి బాంబులు విసిరి వారిని నిరోధించారు. ఎన్​కౌంటర్​ సమయాల్లో జమ్ముకశ్మీర్​ పోలీస్ సిబ్బందితో పాటు ఎంతో మంది సైనికుల ప్రాణాలను కాపాడారు కల్నల్​.

గత ఐదేళ్లలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్​కౌంటర్​లో చనిపోయిన కల్నల్​ స్థాయి సైనికాధికారి కల్నల్​ ఒక్కరే. సరిగ్గా ఐదేళ్ల కితం 2015 జనవరిలో కల్నల్​ ఎంఎన్​ రాయ్​ ఎన్​కౌంటర్​లో చనిపోగా.. అదే ఏడాది నవంబర్​లో కల్నల్​ సంతోష్​ మహాధిక్​ వీర మరణం పొందారు.

గార్డ్స్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ అశుతోష్ శర్మ చాలా కాలంగా కశ్మీర్ లోయలో సేవలందిస్తున్నారు. కమాండింగ్ అధికారిగా తాను ప్రదర్శించిన ధైర్యసాహసాలకు గాను రెండు సార్లు 'సేన' పతకాన్ని అందుకున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.