ETV Bharat / bharat

చైనా వ్యాఖ్యలపై మరోసారి మండిపడ్డ భారత్​

author img

By

Published : Jun 18, 2020, 3:26 PM IST

గాల్వన్​ లోయ తమదేనంటూ చైనా చేస్తోన్న వ్యాఖ్యలపై భారత్​ మరోసారి మండిపడింది. ఈ వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని భారత విదేశాంగ ప్రతినిధి అనురాగ్​ శ్రీవాస్తవ తెలిపారు.

China's claim over Galwan Valley 'exaggerated, untenable': MEA
చైనా వ్యాఖ్యలపై మండిపడ్డ భారత్​

తూర్పు లద్దాక్​‌లోని గాల్వన్‌ లోయపై తమకే సార్వభౌమాధికారం ఉందంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్‌ మరోసారి తీవ్రంగా మండిపడింది. చైనా వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

చైనా ప్రకటన అంగీకారయోగ్యం కాదన్న అనురాగ్​.. ఈ నెల 6న జరిగిన సైనికాధికారుల సమావేశంలో కుదిరిన అవగాహనకు ఇది విరుద్ధంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. పరిస్థితిని బాధ్యతాయుత పద్ధతిలో పరిష్కరించుకోవాలని భారత్‌, చైనా అంగీకరించాలని ఆయన చెప్పారు. జూన్‌ 6 న కుదిరిన ఒప్పందాన్ని ఇరు దేశాలు మనస్ఫూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు.

తూర్పు లద్దాక్​‌లోని గాల్వన్‌ లోయపై తమకే సార్వభౌమాధికారం ఉందంటూ చైనా చేసిన వ్యాఖ్యలపై భారత్‌ మరోసారి తీవ్రంగా మండిపడింది. చైనా వ్యాఖ్యలు అతిశయోక్తిగా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.

చైనా ప్రకటన అంగీకారయోగ్యం కాదన్న అనురాగ్​.. ఈ నెల 6న జరిగిన సైనికాధికారుల సమావేశంలో కుదిరిన అవగాహనకు ఇది విరుద్ధంగా ఉందని ఓ ప్రకటనలో తెలిపారు. పరిస్థితిని బాధ్యతాయుత పద్ధతిలో పరిష్కరించుకోవాలని భారత్‌, చైనా అంగీకరించాలని ఆయన చెప్పారు. జూన్‌ 6 న కుదిరిన ఒప్పందాన్ని ఇరు దేశాలు మనస్ఫూర్తిగా పాటించాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: 'గాల్వన్​ ఘటనతో దేశ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.