ETV Bharat / bharat

బాలికపై హత్యాచారం- అడ్డొచ్చిన ఇద్దరు హత్య - ఛత్తీస్​గఢ్​ బ్రేకింగ్ న్యూస్​

ఛత్తీస్​గఢ్​లో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మైనర్​పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగులు.. అనంతరం ఆమెను హత్య చేశారు. అడ్డొచ్చిన ఆమె ఇద్దరు కుటుంబ సభ్యులనూ చంపేశారు.

Chhattisgarh: Six held for raping, killing minor and her two kin
16ఏళ్ల బాలికపై సామూహిక హత్యాచారం.. అడ్డొచ్చిన ఇద్దర్నీ..
author img

By

Published : Feb 4, 2021, 2:26 PM IST

ఛత్తీస్​గఢ్​లోని కోర్బాలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్డొచ్చిన ఆమె తండ్రి(55), అతడితో పాటే ఉన్న మనవరాలు(04)నూ పొట్టనపెట్టుకున్నారు ఆ దుండగులు. జనవరి 29న జరిగిన ఈ కేసులో.. ఆరుగురు నిందితులను అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ జరిగింది..

కోర్బా జిల్లా లెమ్రూ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత నెల 29న బాధితురాలు, ఆమె తండ్రి, అతడి మనవరాలు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో సంత్రం మఝ్వర్​ అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితుల(సంత్రం మఝ్వర్​(45), అబ్దుల్​ జబ్బార్​(29), అనిల్​ కుమార్​ సార్థి(20), పర్దేశీ రామ్​ పణికా(35), ఆనంద్​ రామ్​ పణికా(25), ఉమాశంకర్​ యాదవ్​(21))ను అరెస్ట్​ చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

బాలిక తండ్రి.. సంత్రం మంఝ్వర్​ వద్ద గతేడాది జులై నుంచి పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. గత శుక్రవారం(జనవరి 29న) మంఝ్వర్​.. తన మోటార్​సైకిల్​పై బాలిక, తండ్రి, మనవరాలిని వదిలేందుకు బయల్దేరాడు. ఇంతలో మద్యం సేవించేందుకు దారిలో ఆగాడు మంఝ్వర్​. అక్కడ అతడికి మరో ఇద్దరు నిందితులు జత కలిశారు. ఈ ముగ్గురూ కలిసి బాధితులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. మరో ముగ్గురితో కలిసి మైనర్​పై అత్యాచారం చేశారు. అడ్డొచ్చిన తండ్రి, చిన్నారిపై కూడా రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో తండ్రి, మనవరాలు అక్కడిక్కడే మరణించారు. తీవ్ర గాయాలైన ఆ బాలిక.. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.

నిందితులపై భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్​-302(హత్య), 376(2)జీ(సామూహిక అత్యాచారం), ఎస్టీ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!

ఛత్తీస్​గఢ్​లోని కోర్బాలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్డొచ్చిన ఆమె తండ్రి(55), అతడితో పాటే ఉన్న మనవరాలు(04)నూ పొట్టనపెట్టుకున్నారు ఆ దుండగులు. జనవరి 29న జరిగిన ఈ కేసులో.. ఆరుగురు నిందితులను అరెస్ట్​ చేశారు పోలీసులు.

ఇదీ జరిగింది..

కోర్బా జిల్లా లెమ్రూ పోలీస్​ స్టేషన్​ పరిధిలో గత నెల 29న బాధితురాలు, ఆమె తండ్రి, అతడి మనవరాలు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా తిరిగి రాలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు.. స్థానిక పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనుమానంతో సంత్రం మఝ్వర్​ అనే వ్యక్తిని పట్టుకుని విచారించగా.. అసలు విషయం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం ఆరుగురు నిందితుల(సంత్రం మఝ్వర్​(45), అబ్దుల్​ జబ్బార్​(29), అనిల్​ కుమార్​ సార్థి(20), పర్దేశీ రామ్​ పణికా(35), ఆనంద్​ రామ్​ పణికా(25), ఉమాశంకర్​ యాదవ్​(21))ను అరెస్ట్​ చేసినట్టు స్థానిక పోలీసులు తెలిపారు.

బాలిక తండ్రి.. సంత్రం మంఝ్వర్​ వద్ద గతేడాది జులై నుంచి పశువుల కాపరిగా పని చేస్తున్నాడు. గత శుక్రవారం(జనవరి 29న) మంఝ్వర్​.. తన మోటార్​సైకిల్​పై బాలిక, తండ్రి, మనవరాలిని వదిలేందుకు బయల్దేరాడు. ఇంతలో మద్యం సేవించేందుకు దారిలో ఆగాడు మంఝ్వర్​. అక్కడ అతడికి మరో ఇద్దరు నిందితులు జత కలిశారు. ఈ ముగ్గురూ కలిసి బాధితులను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి.. మరో ముగ్గురితో కలిసి మైనర్​పై అత్యాచారం చేశారు. అడ్డొచ్చిన తండ్రి, చిన్నారిపై కూడా రాళ్లు, కర్రలతో దాడిచేశారు. ఈ ఘటనలో తండ్రి, మనవరాలు అక్కడిక్కడే మరణించారు. తీవ్ర గాయాలైన ఆ బాలిక.. నాలుగు రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.

నిందితులపై భారతీయ శిక్షా స్మృతి(ఐపీసీ) సెక్షన్​-302(హత్య), 376(2)జీ(సామూహిక అత్యాచారం), ఎస్టీ యాక్ట్, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: అక్కడ పెళ్లి జరగాలంటే ఆధార్ ఉండాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.