ETV Bharat / bharat

చక్కెర కర్మాగారాల అమ్మకంపై సీబీఐ దర్యాప్తు

ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన 21 చక్కెర కర్మాగారాల అమ్మకం కేసులో ఎఫ్​ఐఆర్ నమోదు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ. బీఎస్పీ అధినేత్రి మాయవతి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చక్కెర కర్మాగారాల అమ్మకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది

author img

By

Published : Apr 26, 2019, 9:19 PM IST

చక్కెర కర్మాగారాల అమ్మకంపై సీబీఐ దర్యాప్తు

బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చక్కెర కర్మాగారాల అమ్మకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2011లో 21 కర్మాగారాలను మార్కెట్ ధర కన్నా తక్కువ రేట్లకు అమ్మడంతో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 1179 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.

లఖ్‌నవూ పోలీసులు విచారణ చేస్తున్న ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 12న సిఫారసు చేసింది.

ఏ అధికారి, రాజకీయనేత పేరును ఎఫ్​ఐఆర్​లో చేర్చలేదు సీబీఐ. ప్రభుత్వ కర్మాగారాలను స్వాధీనం చేసుకునేందుకు తప్పుడు పత్రాలను సమర్పించిన ఏడుగురు ప్రైవేటు సంస్థ వ్యక్తులపై కేసు నమోదు చేసింది.

అప్పటి మాయావతి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్న 10, మూత పడిన 7 మిల్లుల్ని మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందన్న అభియోగాలపై సీబీఐ విచారించనుంది.

ఇదీ చూడండి: సీజేఐపై ఆరోపణల కేసులో అంతర్గత విచారణ

బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ చక్కెర కర్మాగారాల అమ్మకంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2011లో 21 కర్మాగారాలను మార్కెట్ ధర కన్నా తక్కువ రేట్లకు అమ్మడంతో రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 1179 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అధికారులు చెబుతున్నారు.

లఖ్‌నవూ పోలీసులు విచారణ చేస్తున్న ఈ అంశంపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వం గతేడాది ఏప్రిల్ 12న సిఫారసు చేసింది.

ఏ అధికారి, రాజకీయనేత పేరును ఎఫ్​ఐఆర్​లో చేర్చలేదు సీబీఐ. ప్రభుత్వ కర్మాగారాలను స్వాధీనం చేసుకునేందుకు తప్పుడు పత్రాలను సమర్పించిన ఏడుగురు ప్రైవేటు సంస్థ వ్యక్తులపై కేసు నమోదు చేసింది.

అప్పటి మాయావతి ప్రభుత్వం సక్రమంగా పనిచేస్తున్న 10, మూత పడిన 7 మిల్లుల్ని మార్కెట్ ధర కంటే తక్కువకే ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టిందన్న అభియోగాలపై సీబీఐ విచారించనుంది.

ఇదీ చూడండి: సీజేఐపై ఆరోపణల కేసులో అంతర్గత విచారణ

Asansol (West Bengal), Apr 26 (ANI): Amidst the Lok Sabha elections, while addressing a public rally in West Bengal's (WB) Asansol, WB Chief Minister Mamata Banerjee slammed Prime Minister Narendra Modi and said, "PM Narendra Modi didn't come to Bengal earlier but during elections, he needs votes from Bengal. We will give him rasgulla from Bengal. We will make sweets from soil and put pebbles in it similarly like cashew nuts, almonds and raisins are used in laddu that will break teeth."

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.