ETV Bharat / bharat

ఆ చిన్నారి కోసం రైల్వే శాఖ 'ఆపరేషన్​ ఒంటె పాలు' - mother requested came milk

ఆటిజం సమస్యతో భాదపడుతున్న తన మూడున్నరేళ్ల కుమారుడి కోసం ఒంటె పాలు తెప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరింది ముంబయికి చెందిన మహిళ. స్పందించిన రైల్వే శాఖ లాక్​డౌన్​ సమయంలోనూ 20 లీటర్ల ఒంటె పాలను రాజస్థాన్​ను ముంబయికి చేరవేసి మానవతా దృక్పథాన్ని చాటుకుంది.

camel milk provided to autistic child living in Mumbai
ఒంటె పాలు కావాలని మోదీని కోరిన మహిళ
author img

By

Published : Apr 12, 2020, 9:00 PM IST

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఉన్నప్పటికీ ఓ తల్లి ఆవేదనను అర్థం చేసుకుని, సాయం అందించింది రైల్వే శాఖ. రాజస్థాన్​ నుంచి రైలులో ముంబయికి 20 లీటర్ల ఒంటెపాలను చేరవేసింది.

ఆటిజంతో బాధపడుతున్న తన మూడున్నరేళ్ల కుమారుడికి ఒంటెపాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్​లో కోరింది ముంబయికి చెందిన నేహా కుమారి. పిల్లాడికి ఆవు, గేదె, మేక పాలు తాగితే సమస్య అని.. లాక్​డౌన్ ఉంటుందని తెలియక సరిపడా ఒంటె పాలు నిల్వ చేసుకోలేదని పేర్కొంది. రాజస్థాన్​లోని సాద్రి నుంచి ఒంటె పాలు, లేదా పాలపొడి తెప్పించే ఏర్పాటు చేయాలని ప్రాధేయపడింది.

ఐపీఎస్ అధికారి చొరవతో..

నేహా ట్వీట్​ను చూసి సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్​ బోథ్రా చలించిపోయారు. ఆమెకు సాయం అందించేందుకు ప్రయత్నించారు. ఒంటె పాల ఉత్పత్తిని భారత్​లో మొదటిసారి ప్రారంభించిన అద్విక్ ఫుడ్స్​ను సంప్రదించారు. పాల పొడిని పంపేందుకు సంస్థ అంగీకరించింది. కానీ రాజస్థాన్​ నుంచి ముంబయికి చేరవేయడమే సమస్యగా మారింది.

నేహా ట్వీట్​ రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయంపై చర్చించి లుధియానా నుంచి ముంబయిలోని బాంద్రాకు సరకులు సరఫరా చేసే రైలులో పాలను పార్సిల్​ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాజస్థాన్​లోని ఫల్నా స్టేషన్​లో రైలును ఆపి పాలు ముంబయికి తరలించారు. అత్యవసరంలో ఉన్నవారికి వీలైన సాయం చేసేందకు ఆలోచించబోమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

20లీటర్ల ఒంటెపాలు ముంబయిలోని మహిళకు రైల్వే శాఖ చేరవేసినట్లు బోథ్రా ట్విట్టర్​లో తెలిపారు.

ఇదీ చూడండి: దోస్త్​ను సూట్​కేస్​లో కుక్కి ఫ్లాట్​లోకి గప్​చుప్​గా...

దేశవ్యాప్తంగా లాక్​డౌన్ ఉన్నప్పటికీ ఓ తల్లి ఆవేదనను అర్థం చేసుకుని, సాయం అందించింది రైల్వే శాఖ. రాజస్థాన్​ నుంచి రైలులో ముంబయికి 20 లీటర్ల ఒంటెపాలను చేరవేసింది.

ఆటిజంతో బాధపడుతున్న తన మూడున్నరేళ్ల కుమారుడికి ఒంటెపాలు అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ట్విట్టర్​లో కోరింది ముంబయికి చెందిన నేహా కుమారి. పిల్లాడికి ఆవు, గేదె, మేక పాలు తాగితే సమస్య అని.. లాక్​డౌన్ ఉంటుందని తెలియక సరిపడా ఒంటె పాలు నిల్వ చేసుకోలేదని పేర్కొంది. రాజస్థాన్​లోని సాద్రి నుంచి ఒంటె పాలు, లేదా పాలపొడి తెప్పించే ఏర్పాటు చేయాలని ప్రాధేయపడింది.

ఐపీఎస్ అధికారి చొరవతో..

నేహా ట్వీట్​ను చూసి సీనియర్ ఐపీఎస్ అధికారి అరుణ్​ బోథ్రా చలించిపోయారు. ఆమెకు సాయం అందించేందుకు ప్రయత్నించారు. ఒంటె పాల ఉత్పత్తిని భారత్​లో మొదటిసారి ప్రారంభించిన అద్విక్ ఫుడ్స్​ను సంప్రదించారు. పాల పొడిని పంపేందుకు సంస్థ అంగీకరించింది. కానీ రాజస్థాన్​ నుంచి ముంబయికి చేరవేయడమే సమస్యగా మారింది.

నేహా ట్వీట్​ రైల్వే అధికారుల దృష్టికి వచ్చింది. ఈ విషయంపై చర్చించి లుధియానా నుంచి ముంబయిలోని బాంద్రాకు సరకులు సరఫరా చేసే రైలులో పాలను పార్సిల్​ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రత్యేకంగా రాజస్థాన్​లోని ఫల్నా స్టేషన్​లో రైలును ఆపి పాలు ముంబయికి తరలించారు. అత్యవసరంలో ఉన్నవారికి వీలైన సాయం చేసేందకు ఆలోచించబోమని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.

20లీటర్ల ఒంటెపాలు ముంబయిలోని మహిళకు రైల్వే శాఖ చేరవేసినట్లు బోథ్రా ట్విట్టర్​లో తెలిపారు.

ఇదీ చూడండి: దోస్త్​ను సూట్​కేస్​లో కుక్కి ఫ్లాట్​లోకి గప్​చుప్​గా...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.