ETV Bharat / bharat

'ఫార్ములా 23'తో భాజపా 'బంగాల్​ మిషన్​-200'

author img

By

Published : Nov 25, 2020, 5:23 PM IST

బంగాల్​లో అధికారం... ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ప్రధాన లక్ష్యం. కొన్నాళ్లుగా ఆ రాష్ట్రంపైనే పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తోంది కమలదళం. 'దీదీ'ని గద్దెదించి.. బంగాల్​లో భాజపా జెండా రెపరెపలాడించటమే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డుతోంది. 'మిషన్​-200' నినాదంతో, 'ఫార్ములా-23' వ్యూహంతో ముందుకు సాగుతోంది.

bjps-mission-200
బంగాల్​ దంగల్: 'మిషన్​-200' లక్ష్యంతో బరిలోకి భాజపా

'మిషన్ 200'.. 294 స్థానాలున్న బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా నినాదం. అధికారం చేజిక్కించుకోవటమే కాదు.. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలదళం. అధికార టీఎంసీని చిత్తు చేసేందుకు అన్ని అవకాశాలను లెక్కేసుకుంటోంది. మిషన్​-200ను విజయవంతం చేసేందుకుగానూ ఫార్ములా-23ని తీసుకొచ్చింది.

బిహార్​ ఫలితాన్ని బంగాల్​లోనూ పునరావృతం చేయాలని భావిస్తోంది భాజపా. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున అమిత్​ షా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మమతా బెనర్జీ ఓటమే ప్రధాన అజెండాగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఏంటీ 'ఫార్ములా-23' ?

2014 సార్వత్రిక ఎన్నికల నుంచి భాజపా తమ రాజకీయ విధానాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఎన్నికల అంశంలో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి సారించిన భాజపా చాణక్యుడు అమిత్ షా.. దేశవ్యాప్తంగా బూత్​ స్థాయిలో పార్టీని బలోపేతం చేయటంపై శ్రద్ధ పెట్టారు. 'మేరా బూత్​.. సబ్​సే మజ్బూత్' నినాదం తీసుకొచ్చారు.

దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి.. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్నారు. బంగాల్​లోనూ ఇదే విధానం అనుసరించారు. బెంగాలీల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లటంలో విజయం సాధించారు. అందులో భాగంగానే 23 సూత్రాల ప్రణాళికను తీసుకొచ్చారు. బూత్​ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో నేరుగా మమేకవడం, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం... ఈ 'ఫార్ములా 23'లో ప్రధానాంశాలు.

ఇదీ చూడండి: మిషన్​ బంగాల్: 23 అస్త్రాలతో భాజపా పక్కా ప్లాన్

మరింత బలోపేతం..

భాజపా 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. ఇలాంటి విధానాలతో పార్టీని మరింత బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలోనే 2019లో మరిన్ని ఓట్లు సాధించగలిగింది. ఈ పద్ధతులతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల సంఖ్యాబలం పెంచుకుంది. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుని.. నమో యాప్​ ద్వారా వారందరినీ యాక్టివ్​గా ఉంచగలిగింది. కేంద్ర ప్రభుత్వం విజయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగింది.

బూత్​ స్థాయిల్లోనూ.. ఏ,బీ,సీ,డీలుగా విభజించి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లింది. డీ కేటగిరిలో మరింత శ్రమించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పార్టీ వర్కర్ల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని.. అందుకు అనుగుణంగా ప్రణాళికల్లో మార్పులు-చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగింది.

కార్యక్రమాల భరోసా..

అలాగే.. ప్రతి బూత్​లో ఇద్దరు నేతలకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పి ప్రజలకు ప్రధాని 'మన్​ కీ బాత్​' వినిపించటం సహా.. వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంది. స్మార్ట్​ఫోన్ల ద్వారా ప్రతి బూత్​ సమాచారం సేకరణ, ఓటర్ల నమోదు చేపట్టింది. వీరందరినీ పార్టీ విధేయులుగా మార్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించింది. వీటి నిర్వహణకు.. ఆర్​ఎస్​ఎస్​ వలంటీర్లను వినియోగించుకుంది. పార్టీ కార్యకర్తలను వీరితో సమన్వయం చేసుకునేలా చూస్తూ... భాజపా దేశంలోనే బలమైన శక్తిగా అవతరించింది.

మరోవైపు పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమాచారం సేకరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించి.. వారిని ప్రసన్నం చేసుకున్నారు. అదే సమయంలో సామాజిక వర్గాల సమీకరణలను అధ్యయనం చేసి.. అభ్యర్థుల ఎంపికలలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికీ అదనంగా.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మంత్రులు సైతం ట్విటర్​లో యాక్టివ్​గా ఉంటున్నారు.

బంగాల్​లో ఈ తరహా విధానాలు సత్ఫలితాలు ఇస్తాయని బలంగా విశ్వసిస్తున్నారు కమలనాథులు.

బంగాల్​ కార్యాచరణ..

ప్రస్తుత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బంగాల్​ కోసం ప్రత్యేక విధానాలు రూపొందించారు. అయితే హోం మంత్రి అమిత్ షా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జనవరి నుంచి ఎన్నికలు ముగిసేవరకు నెలలో 8 రోజులు అక్కడే మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. బంగాల్​ ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ లక్ష్య సాధనలో ఏమేరకు సఫలమవుతారో వేచి చూడాలి.

ఇదీ చూడండి: ప్రతినెలా బంగాల్​కు వెళ్లనున్న అమిత్​షా, నడ్డా

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!

ఇదీ చూడండి: బిహార్‌ విజయోత్సాహం- భాజపా తర్వాతి టార్గెట్​ బంగాల్​!

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​: తృణమూల్​ కాంగ్రెస్​తో ఓవైసీ పొత్తు!

'మిషన్ 200'.. 294 స్థానాలున్న బంగాల్​ అసెంబ్లీ ఎన్నికల కోసం భాజపా నినాదం. అధికారం చేజిక్కించుకోవటమే కాదు.. రాష్ట్రంలో బలమైన శక్తిగా అవతరించటమే లక్ష్యంగా పావులు కదుపుతోంది కమలదళం. అధికార టీఎంసీని చిత్తు చేసేందుకు అన్ని అవకాశాలను లెక్కేసుకుంటోంది. మిషన్​-200ను విజయవంతం చేసేందుకుగానూ ఫార్ములా-23ని తీసుకొచ్చింది.

బిహార్​ ఫలితాన్ని బంగాల్​లోనూ పునరావృతం చేయాలని భావిస్తోంది భాజపా. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున అమిత్​ షా.. అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. మమతా బెనర్జీ ఓటమే ప్రధాన అజెండాగా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

ఏంటీ 'ఫార్ములా-23' ?

2014 సార్వత్రిక ఎన్నికల నుంచి భాజపా తమ రాజకీయ విధానాలను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఎన్నికల అంశంలో కొత్త ఒరవడులకు శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయి పరిస్థితులపై దృష్టి సారించిన భాజపా చాణక్యుడు అమిత్ షా.. దేశవ్యాప్తంగా బూత్​ స్థాయిలో పార్టీని బలోపేతం చేయటంపై శ్రద్ధ పెట్టారు. 'మేరా బూత్​.. సబ్​సే మజ్బూత్' నినాదం తీసుకొచ్చారు.

దేశవ్యాప్తంగా ఉన్న పార్టీ శ్రేణులను సమాయత్తం చేసి.. క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలు తెప్పించుకున్నారు. బంగాల్​లోనూ ఇదే విధానం అనుసరించారు. బెంగాలీల్లోకి పార్టీని బలంగా తీసుకెళ్లటంలో విజయం సాధించారు. అందులో భాగంగానే 23 సూత్రాల ప్రణాళికను తీసుకొచ్చారు. బూత్​ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం, ప్రజలతో నేరుగా మమేకవడం, కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం... ఈ 'ఫార్ములా 23'లో ప్రధానాంశాలు.

ఇదీ చూడండి: మిషన్​ బంగాల్: 23 అస్త్రాలతో భాజపా పక్కా ప్లాన్

మరింత బలోపేతం..

భాజపా 2014 ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా.. ఇలాంటి విధానాలతో పార్టీని మరింత బలోపేతం చేసింది. ఈ నేపథ్యంలోనే 2019లో మరిన్ని ఓట్లు సాధించగలిగింది. ఈ పద్ధతులతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల సంఖ్యాబలం పెంచుకుంది. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుని.. నమో యాప్​ ద్వారా వారందరినీ యాక్టివ్​గా ఉంచగలిగింది. కేంద్ర ప్రభుత్వం విజయాలను ప్రజల వద్దకు తీసుకెళ్లగలిగింది.

బూత్​ స్థాయిల్లోనూ.. ఏ,బీ,సీ,డీలుగా విభజించి ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లింది. డీ కేటగిరిలో మరింత శ్రమించేలా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది. పార్టీ వర్కర్ల నుంచి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుని.. అందుకు అనుగుణంగా ప్రణాళికల్లో మార్పులు-చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగింది.

కార్యక్రమాల భరోసా..

అలాగే.. ప్రతి బూత్​లో ఇద్దరు నేతలకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పజెప్పి ప్రజలకు ప్రధాని 'మన్​ కీ బాత్​' వినిపించటం సహా.. వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకుంది. స్మార్ట్​ఫోన్ల ద్వారా ప్రతి బూత్​ సమాచారం సేకరణ, ఓటర్ల నమోదు చేపట్టింది. వీరందరినీ పార్టీ విధేయులుగా మార్చేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహించింది. వీటి నిర్వహణకు.. ఆర్​ఎస్​ఎస్​ వలంటీర్లను వినియోగించుకుంది. పార్టీ కార్యకర్తలను వీరితో సమన్వయం చేసుకునేలా చూస్తూ... భాజపా దేశంలోనే బలమైన శక్తిగా అవతరించింది.

మరోవైపు పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ఎప్పటికప్పుడు ప్రజల సమాచారం సేకరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించి.. వారిని ప్రసన్నం చేసుకున్నారు. అదే సమయంలో సామాజిక వర్గాల సమీకరణలను అధ్యయనం చేసి.. అభ్యర్థుల ఎంపికలలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. వీటన్నింటికీ అదనంగా.. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో హోరెత్తిస్తున్నారు. మంత్రులు సైతం ట్విటర్​లో యాక్టివ్​గా ఉంటున్నారు.

బంగాల్​లో ఈ తరహా విధానాలు సత్ఫలితాలు ఇస్తాయని బలంగా విశ్వసిస్తున్నారు కమలనాథులు.

బంగాల్​ కార్యాచరణ..

ప్రస్తుత భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బంగాల్​ కోసం ప్రత్యేక విధానాలు రూపొందించారు. అయితే హోం మంత్రి అమిత్ షా అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. జనవరి నుంచి ఎన్నికలు ముగిసేవరకు నెలలో 8 రోజులు అక్కడే మకాం వేయాలని నిర్ణయించుకున్నారు. బంగాల్​ ఎన్నికలను ఆయన అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ లక్ష్య సాధనలో ఏమేరకు సఫలమవుతారో వేచి చూడాలి.

ఇదీ చూడండి: ప్రతినెలా బంగాల్​కు వెళ్లనున్న అమిత్​షా, నడ్డా

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​: దీదీ సేనలో అసమ్మతి జ్వాల!

ఇదీ చూడండి: బిహార్‌ విజయోత్సాహం- భాజపా తర్వాతి టార్గెట్​ బంగాల్​!

ఇదీ చూడండి: బంగాల్​ దంగల్​: తృణమూల్​ కాంగ్రెస్​తో ఓవైసీ పొత్తు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.