ETV Bharat / bharat

ఓటర్లకు భాజపా బంపర్​ ఆఫర్​... రూ.2కే కిలో పిండి - రూ.2కు కిలో పిండి-భాజపా దిల్లీ ఎన్నికల మేనిఫెస్టో

దేశ రాజధాని దిల్లీ శాసనసభకు ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భాజపా తమ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. దిల్లీని ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా తయారు చేయడమే లక్ష్యమన్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. అయితే భాజపా మేనిఫెస్టో లక్ష్యంగా విమర్శలు చేశారు దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ప్రస్తుతం ఉచితంగా కల్పిస్తున్న సౌకర్యాలను భాజపా గెలిస్తే రద్దు చేస్తారని మేనిఫెస్టో చెబుతోందన్నారు.

bjp manifesto
రూ.2కు కిలో పిండి-భాజపా దిల్లీ ఎన్నికల మేనిఫెస్టో
author img

By

Published : Jan 31, 2020, 4:13 PM IST

Updated : Feb 28, 2020, 4:16 PM IST

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే రూ. 2కు కిలో పిండి అందిస్తామని హామీ ఇచ్చింది భాజపా. ప్రతి ఇంటికీ శుద్ధ తాగునీరు సరఫరా చేస్తామని వాగ్దానం చేసింది. ఈనెల 8న జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసింది కమలదళం. నగర భవిష్యత్తును మారుస్తామని ఉద్ఘాటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. దిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

సహచర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్, భాజపా దిల్లీ విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారీతో కలిసి ఆయన దిల్లీలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. దేశ రాజధానిలో అభివృద్ధి అనే బుల్లెట్ ట్రైన్​ను నడిపిస్తామన్నారు గడ్కరీ.

నితిన్ గడ్కరీ

"దిల్లీ భవిష్యత్తుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. 11 లక్షల ప్రజల సంక్షేమం కోసం.. ఏఏ సమస్యలున్నాయో వాటన్నింటి కోసం, దిల్లీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని కమిటీ ఈ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది. భారత ప్రభుత్వ రైల్వే ఇంజిన్ బలమైనది. దిల్లీలో కూడా భాజపా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి బుల్లెట్​ రైలులా దూసుకెళుతుంది. అభివృద్ధి బుల్లెట్ రైలు వేగంగా వెళ్లడానికి మేనిఫెస్టో ప్రణాళిక పత్రం."

-నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి

భాజపా వస్తే పథకాల రద్దు

భాజపా ఎన్నికల ప్రణాళికపై విరుచుకుపడింది అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ. ప్రస్తుతం ఉచితంగా కల్పిస్తున్న సౌకర్యాలను భాజపా గెలిస్తే రద్దు చేస్తారని.. ఎన్నికల ప్రణాళికతో నిర్ధరణ అయిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.

"మీరు భాజపాకు ఓటేస్తే మీకు ఉచితంగా కల్పిస్తున్న ఉచిత విద్యుత్, రుసుము రహిత మంచినీరు, టికెట్ లేని ప్రయాణం రద్దు అవుతాయని భాజపా మేనిఫెస్టోలోని అంశాలు నిర్ధరిస్తున్నాయి. ఆలోచించి ఓటు వేయండి."

-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

భాజపా మేనిఫెస్టో 'సంకల్ప్ పాత్ర' కాదని వ్యర్థ పాత్ర అని విమర్శించారు ఆమ్​ ఆద్మీ నేత సంజయ్ సింగ్. దిల్లీ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఆరోగ్య పథకాలను భాజపా గెలిస్తే తొలగిస్తారని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 'పైసా వసూల్​'పై యోగి సర్కార్​కు సుప్రీం తాఖీదులు

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే రూ. 2కు కిలో పిండి అందిస్తామని హామీ ఇచ్చింది భాజపా. ప్రతి ఇంటికీ శుద్ధ తాగునీరు సరఫరా చేస్తామని వాగ్దానం చేసింది. ఈనెల 8న జరగనున్న శాసనసభ ఎన్నికల కోసం ఈ మేరకు మేనిఫెస్టో విడుదల చేసింది కమలదళం. నగర భవిష్యత్తును మారుస్తామని ఉద్ఘాటించారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. దిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

సహచర మంత్రులు ప్రకాశ్ జావడేకర్, హర్షవర్ధన్, భాజపా దిల్లీ విభాగం అధ్యక్షుడు మనోజ్ తివారీతో కలిసి ఆయన దిల్లీలో ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. దేశ రాజధానిలో అభివృద్ధి అనే బుల్లెట్ ట్రైన్​ను నడిపిస్తామన్నారు గడ్కరీ.

నితిన్ గడ్కరీ

"దిల్లీ భవిష్యత్తుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం. 11 లక్షల ప్రజల సంక్షేమం కోసం.. ఏఏ సమస్యలున్నాయో వాటన్నింటి కోసం, దిల్లీని అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దే దిశగా కేంద్రమంత్రి హర్షవర్ధన్ నేతృత్వంలోని కమిటీ ఈ ఎన్నికల ప్రణాళిక రూపొందించింది. భారత ప్రభుత్వ రైల్వే ఇంజిన్ బలమైనది. దిల్లీలో కూడా భాజపా ప్రభుత్వం ఉంటే అభివృద్ధి బుల్లెట్​ రైలులా దూసుకెళుతుంది. అభివృద్ధి బుల్లెట్ రైలు వేగంగా వెళ్లడానికి మేనిఫెస్టో ప్రణాళిక పత్రం."

-నితిన్ గడ్కరీ, కేంద్రమంత్రి

భాజపా వస్తే పథకాల రద్దు

భాజపా ఎన్నికల ప్రణాళికపై విరుచుకుపడింది అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ. ప్రస్తుతం ఉచితంగా కల్పిస్తున్న సౌకర్యాలను భాజపా గెలిస్తే రద్దు చేస్తారని.. ఎన్నికల ప్రణాళికతో నిర్ధరణ అయిందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు చేశారు.

"మీరు భాజపాకు ఓటేస్తే మీకు ఉచితంగా కల్పిస్తున్న ఉచిత విద్యుత్, రుసుము రహిత మంచినీరు, టికెట్ లేని ప్రయాణం రద్దు అవుతాయని భాజపా మేనిఫెస్టోలోని అంశాలు నిర్ధరిస్తున్నాయి. ఆలోచించి ఓటు వేయండి."

-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

భాజపా మేనిఫెస్టో 'సంకల్ప్ పాత్ర' కాదని వ్యర్థ పాత్ర అని విమర్శించారు ఆమ్​ ఆద్మీ నేత సంజయ్ సింగ్. దిల్లీ ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఆరోగ్య పథకాలను భాజపా గెలిస్తే తొలగిస్తారని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: 'పైసా వసూల్​'పై యోగి సర్కార్​కు సుప్రీం తాఖీదులు

AP Video Delivery Log - 0600 GMT News
Friday, 31 January, 2020
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0559: US IA Mock Caucus AP Clients Only 4252128
A look at the ins and outs of the Iowa caucuses
AP-APTN-0556: South Korea Virus Evacuees 4 AP Clients Only 4252127
SKorean virus evacuees taken into quarantine
AP-APTN-0535: US Senate Impeachment Reaction AP Clients Only 4252126
Trump impeachment trial looks likely to end soon
AP-APTN-0530: China Virus Planes No access mainland China 4252125
China to send planes to evacuate Chinese overseas
AP-APTN-0504: Australia Wildfire No access Australia 4252124
Wildfire threatens Australian capital
AP-APTN-0405: US Impeach Closing AP Clients Only 4252122
Senate wraps up questions for impeachment trial
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Feb 28, 2020, 4:16 PM IST

For All Latest Updates

TAGGED:

bjp
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.