ETV Bharat / bharat

'జాతీయ జనాభా పట్టిక-2020 ప్రమాదకారి'

author img

By

Published : Dec 26, 2019, 1:59 PM IST

భాజపా ప్రభుత్వం ఆమోదించిన జాతీయ జనాభా పట్టిక చాలా ప్రమాదకారి అని కాంగ్రెస్​ సీనియర్​ నేత చిదంబరం ఆరోపించారు. భాజపా కుటిల ఎజెండాతో ఈ నిర్ణయం తీసుకుందని, ఎన్​పీఆర్​-2010తో పోలిస్తే ఇది చాలా భిన్నమైనదని వ్యాఖ్యానించారు.

CHIDAMBARAM-NPR
CHIDAMBARAM-NPR

జాతీయ జనాభా పట్టిక ప్రమాదకారి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం ఆరోపించారు. 2010లో తీసుకొచ్చిన ఎన్​పీఆర్​కు దీనికి పోలికే లేదన్నారు. ఎన్​పీఆర్​ను వివాదాస్పద జాతీయ పౌర పట్టికకు అనుసంధానం చేయొద్దని కోరారు.

CHIDAMBARAM-NPR
ట్వీట్

"భాజపా ప్రభుత్వం కుటిల ఎజెండాతో ఉంది. అందుకే కేబినెట్​ ఆమోదించిన ఎన్​పీఆర్​.. 2010తో పోలిస్తే విషయం, ఉద్దేశ్యం పరంగా చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా ప్రమాదకారి.

ఒకవేళ భాజపా ఉద్దేశం మంచిదే అయితే.. ఎన్​పీఆర్​-2010 స్వరూపం, ఉద్దేశానికి బేషరతుగా మద్దతివ్వాలి. వివాదాస్పద ఎన్​ఆర్​సీ​తో అనుసంధానం చేసే ఆలోచన ఉండకూడదు."

- పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

'సరిగా వినండి..'

కాంగ్రెస్​ హయాంలో 2010లో ప్రవేశపెట్టిన ఎన్​పీఆర్​కు సంబంధించి భాజపా వీడియో విడుదల చేయటంపై చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. అందులోని మాటలను సరిగా వినాలని సూచించారు. ఎన్​పీఆర్​-2010లో స్థానికులని మాత్రమే ప్రస్తావించామని.. పౌరసత్వం, మత ప్రాతిపదికలను చేర్చలేదని స్పష్టం చేశారు. ఎన్​ఆర్​సీ​ ప్రస్తావనే రాలేదని, 2011 జనాభా గణన కోసమే తీసుకొచ్చినట్లు తెలిపారు.

భారతమాతకు అబద్ధమాడారు: రాహుల్​

భారత్​లో నిర్బంధ కేంద్రాలు లేవని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతమాతతో ఆర్​ఎస్​ఎస్​ ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. అసోంలో నిర్మితమవుతోన్న ఓ నిర్బంధ కేంద్రానికి సంబంధించిన వీడియోను రాహుల్ ట్విట్టర్​లో పంచుకున్నారు.

ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారంటూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, అర్బన్​ నక్సల్స్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇటీవల ప్రధాని ఆరోపించారు.

జాతీయ జనాభా పట్టిక ప్రమాదకారి అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్​ సీనియర్​ నేత పి.చిదంబరం ఆరోపించారు. 2010లో తీసుకొచ్చిన ఎన్​పీఆర్​కు దీనికి పోలికే లేదన్నారు. ఎన్​పీఆర్​ను వివాదాస్పద జాతీయ పౌర పట్టికకు అనుసంధానం చేయొద్దని కోరారు.

CHIDAMBARAM-NPR
ట్వీట్

"భాజపా ప్రభుత్వం కుటిల ఎజెండాతో ఉంది. అందుకే కేబినెట్​ ఆమోదించిన ఎన్​పీఆర్​.. 2010తో పోలిస్తే విషయం, ఉద్దేశ్యం పరంగా చాలా భిన్నంగా ఉంది. ఇది చాలా ప్రమాదకారి.

ఒకవేళ భాజపా ఉద్దేశం మంచిదే అయితే.. ఎన్​పీఆర్​-2010 స్వరూపం, ఉద్దేశానికి బేషరతుగా మద్దతివ్వాలి. వివాదాస్పద ఎన్​ఆర్​సీ​తో అనుసంధానం చేసే ఆలోచన ఉండకూడదు."

- పి.చిదంబరం, కేంద్ర మాజీ మంత్రి

'సరిగా వినండి..'

కాంగ్రెస్​ హయాంలో 2010లో ప్రవేశపెట్టిన ఎన్​పీఆర్​కు సంబంధించి భాజపా వీడియో విడుదల చేయటంపై చిదంబరం సంతోషం వ్యక్తం చేశారు. అందులోని మాటలను సరిగా వినాలని సూచించారు. ఎన్​పీఆర్​-2010లో స్థానికులని మాత్రమే ప్రస్తావించామని.. పౌరసత్వం, మత ప్రాతిపదికలను చేర్చలేదని స్పష్టం చేశారు. ఎన్​ఆర్​సీ​ ప్రస్తావనే రాలేదని, 2011 జనాభా గణన కోసమే తీసుకొచ్చినట్లు తెలిపారు.

భారతమాతకు అబద్ధమాడారు: రాహుల్​

భారత్​లో నిర్బంధ కేంద్రాలు లేవని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. భారతమాతతో ఆర్​ఎస్​ఎస్​ ప్రధానమంత్రి అబద్ధాలు చెబుతున్నారని విరుచుకుపడ్డారు. అసోంలో నిర్మితమవుతోన్న ఓ నిర్బంధ కేంద్రానికి సంబంధించిన వీడియోను రాహుల్ ట్విట్టర్​లో పంచుకున్నారు.

ముస్లింలను నిర్బంధ కేంద్రాలకు తరలిస్తారంటూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, అర్బన్​ నక్సల్స్​ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఇటీవల ప్రధాని ఆరోపించారు.

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.
********************
Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.