ETV Bharat / bharat

బిహార్​ బరి: తొలి దశ పోలింగ్ లైవ్ అప్​డేట్స్

author img

By

Published : Oct 28, 2020, 6:46 AM IST

Updated : Oct 28, 2020, 7:00 PM IST

Bihar assembly polls
బిహార్​ అసెంబ్లీ ఎన్నికలు

18:11 October 28

51 శాతం పైనే నమోదు..

బిహార్​ ఎన్నికల సమరంలో తొలిదఫా పోలింగ్​ పూర్తయింది. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్​ జరిగింది. 243 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 52.24 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓటింగ్​లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. తొలిదశలో దాదాపు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

15:10 October 28

46 శాతంపైనే..

బిహార్​లో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.29శాతం పోలింగ్​ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

13:56 October 28

'50 స్థానాలు ఎన్​డీఏకే'

బిహార్​ మాజీ ముఖ్యమంత్రి జితన్​ రామ్​ మంజి.. గయాలోని ఓ పోలింగ్​ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 71స్థానాల్లో ఎన్​డీఏ 50సీట్లల్లో సునాయాసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

13:37 October 28

33శాతం

బిహార్​లో మధ్యాహ్నం 1 గంట వరకు 33.10శాతం పోలింగ్​ నమోదైంది. ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

11:57 October 28

11:30 గంటల వరకు 18.48 శాతం ఓటింగ్​

బిహార్​ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులుతీరారు ప్రజలు. ఉదయం 11:30 గంటల వరకు 18.48 శాతం ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా చూసుకుంటే లఖిసరాయ్​లో అత్యధికంగా 26.28 శాతం ఓటింగ్​ నమోదైంది. ఆ తర్వాత నవాడాలో 23.87 శాతంగా ఉంది. పాట్నాలో 5.96 శాతం, భగల్పుర్​లో 6.84 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఈసీ తెలిపింది. 

11:09 October 28

ఓటింగ్​ను బహిష్కరించిన గ్రామస్థులు

  • Bihar: Voters of Balgudar village in Lakhisarai district boycott elections, booth number 115 wears a deserted look.

    "Villagers are not voting as they're protesting against the construction of a museum on a playground," says Booth No. 115 Presiding Officer Mohammad Ikramul Haq pic.twitter.com/QpDaejRzZV

    — ANI (@ANI) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిహార్​ లఖిసరాయ్​లోని బల్గుదార్​లో ఓటింగ్​ను బహిష్కరించారు గ్రామస్థులు. దాంతో గ్రామంలోని​ 115వ పోలింగ్​ బూత్​ ఓటర్లు లేక వెలవెల బోయింది. మైదానంలో మ్యూజియం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసనగా ఓటింగ్​ను బహిష్కరించారని పోలింగ్​ కేంద్రం ఎన్నికల పర్యవేక్షణ అధికారి మహమ్మద్​ ఇక్రాముల్​ హక్​ తెలిపారు.

09:24 October 28

తొమ్మిది గంటల వరకు 5.2 శాతం ఓటింగ్​

బిహార్​ తొలి దశ ఎన్నికల్లో 71 నియోజకవర్గాల్లోని పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 5.2 శాతం మేర ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 

08:12 October 28

ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​

బిహర్​ తొలి దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. లఖిసరాయ్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​. అంతకు ముందు బరాహియాలోని ఆలయంలో పూజలు నిర్వహించారు. 'ఎన్నికలు.. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుని భాగస్వాములు కావాలి' అని పేర్కొన్నారు.

08:03 October 28

'కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. ఓటింగ్​లో పాల్గొనండి'

బిహార్​ తొలి విడత ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్​-19 జాగ్రత్తలు పాటిస్తూ.. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.  రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్​ తప్పనిసరిగా ధరించాలన్నారు. 

07:32 October 28

ఐఈడీ కలకలం

ఎన్నికల వేళ ఔరంగాబాద్​లోని ధిబ్రా ప్రాంతంలో ఐఈడీ బాంబు కలకలం సృష్టించింది. ఆ బాంబును సీఆర్​పీఎప్​ నిర్వీర్యం చేసింది.

07:01 October 28

పోలింగ్​ ప్రారంభం...

బిహార్​లో తొలి విడత పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 71 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు అధికారులు.

పోలింగ్​ కేంద్రాల వద్దకు ప్రజలు చేరుకుంటున్నారు. మాస్కులు ధరించిన వారికే అనుమతినిస్తున్నారు.

06:52 October 28

ఈవీఎం, వీవీప్యాట్ల సన్నద్ధతలో అధికారులు

బిహార్​లో తొలి విడత ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయా కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముంగెర్​, లాఖిసరాయ్​, గయా సహా అన్ని పోలింగ్​ కేంద్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

06:25 October 28

మరికొద్ది సేపట్లో తొలి విడత పోలింగ్​

బిహార్​ ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్​ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్​ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం.  కరోనా సంక్షోభంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం వల్ల బిహార్​వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. 2.14కోట్ల మంది ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్​ కేంద్రాల శానిటైజేషన్​ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.

18:11 October 28

51 శాతం పైనే నమోదు..

బిహార్​ ఎన్నికల సమరంలో తొలిదఫా పోలింగ్​ పూర్తయింది. మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్​ జరిగింది. 243 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు 52.24 శాతం మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ప్రజలు ఓటింగ్​లో పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రత కల్పించారు. తొలిదశలో దాదాపు 1,066 మంది అభ్యర్థులు పోటీపడ్డారు.

15:10 October 28

46 శాతంపైనే..

బిహార్​లో మధ్యాహ్నం 3 గంటల వరకు 46.29శాతం పోలింగ్​ నమోదైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

13:56 October 28

'50 స్థానాలు ఎన్​డీఏకే'

బిహార్​ మాజీ ముఖ్యమంత్రి జితన్​ రామ్​ మంజి.. గయాలోని ఓ పోలింగ్​ కేంద్రం వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 71స్థానాల్లో ఎన్​డీఏ 50సీట్లల్లో సునాయాసంగా గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

13:37 October 28

33శాతం

బిహార్​లో మధ్యాహ్నం 1 గంట వరకు 33.10శాతం పోలింగ్​ నమోదైంది. ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్​ ప్రశాంతంగా సాగుతోంది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

11:57 October 28

11:30 గంటల వరకు 18.48 శాతం ఓటింగ్​

బిహార్​ అసెంబ్లీ తొలి విడత ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్​ కేంద్రాల వద్ద బారులుతీరారు ప్రజలు. ఉదయం 11:30 గంటల వరకు 18.48 శాతం ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాల వారిగా చూసుకుంటే లఖిసరాయ్​లో అత్యధికంగా 26.28 శాతం ఓటింగ్​ నమోదైంది. ఆ తర్వాత నవాడాలో 23.87 శాతంగా ఉంది. పాట్నాలో 5.96 శాతం, భగల్పుర్​లో 6.84 శాతం ఓటింగ్​ నమోదైనట్లు ఈసీ తెలిపింది. 

11:09 October 28

ఓటింగ్​ను బహిష్కరించిన గ్రామస్థులు

  • Bihar: Voters of Balgudar village in Lakhisarai district boycott elections, booth number 115 wears a deserted look.

    "Villagers are not voting as they're protesting against the construction of a museum on a playground," says Booth No. 115 Presiding Officer Mohammad Ikramul Haq pic.twitter.com/QpDaejRzZV

    — ANI (@ANI) October 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బిహార్​ లఖిసరాయ్​లోని బల్గుదార్​లో ఓటింగ్​ను బహిష్కరించారు గ్రామస్థులు. దాంతో గ్రామంలోని​ 115వ పోలింగ్​ బూత్​ ఓటర్లు లేక వెలవెల బోయింది. మైదానంలో మ్యూజియం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ.. నిరసనగా ఓటింగ్​ను బహిష్కరించారని పోలింగ్​ కేంద్రం ఎన్నికల పర్యవేక్షణ అధికారి మహమ్మద్​ ఇక్రాముల్​ హక్​ తెలిపారు.

09:24 October 28

తొమ్మిది గంటల వరకు 5.2 శాతం ఓటింగ్​

బిహార్​ తొలి దశ ఎన్నికల్లో 71 నియోజకవర్గాల్లోని పోలింగ్​ కేంద్రాల్లో ఓటింగ్​ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్లు ఇప్పుడిప్పుడే పోలింగ్​ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం తొమ్మిది గంటల వరకు 5.2 శాతం మేర ఓటింగ్​ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. 

08:12 October 28

ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​

బిహర్​ తొలి దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. లఖిసరాయ్​లోని పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్​ సింగ్​. అంతకు ముందు బరాహియాలోని ఆలయంలో పూజలు నిర్వహించారు. 'ఎన్నికలు.. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ.. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకుని భాగస్వాములు కావాలి' అని పేర్కొన్నారు.

08:03 October 28

'కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. ఓటింగ్​లో పాల్గొనండి'

బిహార్​ తొలి విడత ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్య పండుగలో పాల్గొనాలని కోరారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. కొవిడ్​-19 జాగ్రత్తలు పాటిస్తూ.. పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.  రెండు గజాల భౌతిక దూరం పాటిస్తూ.. మాస్క్​ తప్పనిసరిగా ధరించాలన్నారు. 

07:32 October 28

ఐఈడీ కలకలం

ఎన్నికల వేళ ఔరంగాబాద్​లోని ధిబ్రా ప్రాంతంలో ఐఈడీ బాంబు కలకలం సృష్టించింది. ఆ బాంబును సీఆర్​పీఎప్​ నిర్వీర్యం చేసింది.

07:01 October 28

పోలింగ్​ ప్రారంభం...

బిహార్​లో తొలి విడత పోలింగ్​ ప్రారంభమైంది. మొత్తం 71 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు చేపట్టారు అధికారులు.

పోలింగ్​ కేంద్రాల వద్దకు ప్రజలు చేరుకుంటున్నారు. మాస్కులు ధరించిన వారికే అనుమతినిస్తున్నారు.

06:52 October 28

ఈవీఎం, వీవీప్యాట్ల సన్నద్ధతలో అధికారులు

బిహార్​లో తొలి విడత ఎన్నికలు కాసేపట్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఆయా కేంద్రాల్లో ఈవీఎంలు, వీవీప్యాట్లను సిద్ధం చేస్తున్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. ముంగెర్​, లాఖిసరాయ్​, గయా సహా అన్ని పోలింగ్​ కేంద్రాల్లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. 

06:25 October 28

మరికొద్ది సేపట్లో తొలి విడత పోలింగ్​

బిహార్​ ఎన్నికల సమరంలో తొలి దశ పోలింగ్​ కాసేపట్లో ప్రారంభం కానుంది. పోలింగ్​ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది ఎన్నికల సంఘం.  కరోనా సంక్షోభంలో జరుగుతున్న తొలి ఎన్నిక ఇదే కావడం వల్ల బిహార్​వైపు దేశ ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.

మొదటి దశలో భాగంగా 71 స్థానాలకు ఓటింగ్​ జరగనుంది. 2.14కోట్ల మంది ఓటర్లు 1,066 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తం చేయనున్నారు.

కరోనా నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత చర్యలు చేపట్టింది. పోలింగ్​ కేంద్రాల శానిటైజేషన్​ నుంచి ఎన్నికల సిబ్బందికి పీపీఈ కిట్ల పంపిణీ వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంది. మాస్కు ధరించడం తప్పనిసరి చేసింది.

Last Updated : Oct 28, 2020, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.