బంగాల్ మంత్రివర్గంలో ఓ మంత్రికి కరోనా పాజిటివ్గా తేలింది. ఫలితంగా ఆ రాష్ట్ర కేబినెట్లో కొవిడ్-19 కలకలం చెలరేగింది. ఇదే విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. కరోనా పరీక్షా ఫలితాల్లో పాజిటివ్ వచ్చిన వెంటనే ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లారని పేర్కొన్నారు.
వైరస్ లక్షణాలతో బాధపడుతున్న మంత్రి సహా ఆయన కుటుంబ సభ్యుల నమూనాలు పరీక్షించారు. అయితే మంత్రితో పాటు ఆయనతో సన్నిహితంగా ఉన్న మరొకరికి వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధరించారు.
బంగాల్లో గురువారం అత్యధికంగా 344 కేసులు నమోదు కావడం వల్ల రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,536కు చేరింది. ఇప్పటివరకు 223మంది మృతి చెందారు.
116 మంది పోలీసులకు వైరస్
మహారాష్ట్రలో మరో 116మంది పోలీసులకు వైరస్ సోకిందని, మరో ముగ్గురు వైరస్తో చనిపోయారని పోలీసు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు మొత్తం 2,211 మంది పోలీసులు మహమ్మారి బారిన పడగా... 25మంది చనిపోయారని ఆ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: 'సరిహద్దు వివాదంలో కేంద్రం నిబద్ధత చాటుకోవాలి'