ETV Bharat / bharat

'పౌర' ఎఫెక్ట్: ఈశాన్య భారతంలో ఆందోళనలు ఉద్ధృతం

author img

By

Published : Dec 11, 2019, 6:32 PM IST

Updated : Dec 11, 2019, 11:35 PM IST

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఏ రాజకీయ సంస్థా పిలుపునివ్వనప్పటికీ స్వచ్ఛందంగా నిరసనకు దిగారు ఆందోళనకారులు. అసోంలోని గువహటి సహా ప్రధాన పట్టణాల్లో తీవ్ర నిరసనలు చెలరేగాయి. కశ్మీర్​లో 20 కంపెనీల పారామిలిటరీ బలగాలను ఉపసంహరించి ఈశాన్య రాష్ట్రాలకు తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి మరో 30 కంపెనీలు ఈశాన్యానికి బయలుదేరాయి.

citi
'పౌర' ఎఫెక్ట్: ఈశాన్య భారతంలో ఆందోళనలు ఉద్ధృతం
'పౌర' ఎఫెక్ట్: ఈశాన్య భారతంలో ఆందోళనలు ఉద్ధృతం

పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య భారతంలో రగడ కొనసాగుతోంది. అసోం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. సుమారు పదివేల మంది నిరసనకారులు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలోని గువహటిలో ఆందోళనలు చేపట్టారు. రాజ్యసభలో పౌరసత్వ బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వివాదాస్పద బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం రాజధాని దిస్​పుర్​​లో ఓ బస్సుకు నిరసనకారులు నిప్పంటించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

ఏ రాజకీయ పార్టీ, విద్యార్థి సంస్థ బంద్​కు పిలుపునివ్వనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగించారు. అసోం సచివాలయానికి వెళ్లే రహదారిని నిర్బంధించారు. గువహటి, దిబ్రూగఢ్​, జోర్హాట్​లలోని వందలమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగులు, బానర్లను చించేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​ గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

విమానాశ్రయంలో సోనోవాల్ ఘోరావ్

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​కూ నిరసన సెగ తగిలింది. గువహటి గోపినాథ్ బార్డోలోయి విమానాశ్రయంలో ఆందోళనకారులు అడ్డుకున్నారు.

దిబ్రూగఢ్​లో..

దిబ్రూగఢ్​లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ తూటాలను కాల్చారు పోలీసులు. శాంతి భద్రతల నియంత్రణ కోసం మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జిల్లా అధికార యంత్రాంగం.

జోర్హాట్, గోలాఘాట్​, తిన్​సుకియా, శివసాగర్​, బోన్​గాయి గావ్​, నాగావ్​లలో మెరుపు ఆందోళనకు దిగారు ప్రజలు. దిస్పుర్​లో బస్సును తగలబెట్టారు.

50 కంపెనీల బలగాలు..

ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు కశ్మీర్​కు తరలించిన పారామిలిటరీ దళాలను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 5వేలమంది పారా మిలిటరీ సిబ్బంది ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఇందుకోసం 20 కంపెనీ దళాలను కశ్మీర్​ నుంచి ఉపసంహరించారు. ఇతర ప్రాంతాల నుంచి మరో 30 కంపెనీలను తరలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి

'పౌర' ఎఫెక్ట్: ఈశాన్య భారతంలో ఆందోళనలు ఉద్ధృతం

పౌరసత్వ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈశాన్య భారతంలో రగడ కొనసాగుతోంది. అసోం, త్రిపుర సహా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. సుమారు పదివేల మంది నిరసనకారులు పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసోంలోని గువహటిలో ఆందోళనలు చేపట్టారు. రాజ్యసభలో పౌరసత్వ బిల్లుపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో వివాదాస్పద బిల్లుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం రాజధాని దిస్​పుర్​​లో ఓ బస్సుకు నిరసనకారులు నిప్పంటించారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు.

ఏ రాజకీయ పార్టీ, విద్యార్థి సంస్థ బంద్​కు పిలుపునివ్వనప్పటికీ ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలు కొనసాగించారు. అసోం సచివాలయానికి వెళ్లే రహదారిని నిర్బంధించారు. గువహటి, దిబ్రూగఢ్​, జోర్హాట్​లలోని వందలమంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ప్రభుత్వ పథకాలకు సంబంధించిన హోర్డింగులు, బానర్లను చించేశారు. బిల్లుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​ గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.

విమానాశ్రయంలో సోనోవాల్ ఘోరావ్

అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్​కూ నిరసన సెగ తగిలింది. గువహటి గోపినాథ్ బార్డోలోయి విమానాశ్రయంలో ఆందోళనకారులు అడ్డుకున్నారు.

దిబ్రూగఢ్​లో..

దిబ్రూగఢ్​లో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు రబ్బర్ తూటాలను కాల్చారు పోలీసులు. శాంతి భద్రతల నియంత్రణ కోసం మద్యం అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది జిల్లా అధికార యంత్రాంగం.

జోర్హాట్, గోలాఘాట్​, తిన్​సుకియా, శివసాగర్​, బోన్​గాయి గావ్​, నాగావ్​లలో మెరుపు ఆందోళనకు దిగారు ప్రజలు. దిస్పుర్​లో బస్సును తగలబెట్టారు.

50 కంపెనీల బలగాలు..

ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిణామాలను ఎదుర్కొనేందుకు కశ్మీర్​కు తరలించిన పారామిలిటరీ దళాలను ప్రస్తుతం ఈశాన్య రాష్ట్రాలకు తరలిస్తున్నారు. 5వేలమంది పారా మిలిటరీ సిబ్బంది ఈశాన్య రాష్ట్రాలకు చేరుకుంటున్నారు. ఇందుకోసం 20 కంపెనీ దళాలను కశ్మీర్​ నుంచి ఉపసంహరించారు. ఇతర ప్రాంతాల నుంచి మరో 30 కంపెనీలను తరలిస్తున్నారు.

ఇదీ చూడండి: ఆ రాష్ట్రానికి వెళ్లాలంటే ఇక అనుమతి తప్పనిసరి

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
1200
LONDON_ Fashion Sustainability 3: Celebrities and royals can change the conversation on sustainability.
1500
LONDON_ M. Knight Shyamalan and Rupert Grint discuss scary series 'The Servant.'
LOS ANGELES_ America Ferrera and Danai Gurira help the Screen Actors Guild announced its award nominees.
2200
NEW YORK_ Jamie Lynn Sigler talks new film 'Mob Town.'
2300
LOS ANGELES_ Reese Witherspoon, Kerry Washington and Ronan Farrow honored at The Hollywood Reporter's annual Women in Entertainment gala.
CELEBRITY EXTRA
LOS ANGELES_ 'Truth Be Told' star Octavia Spencer is a true crime TV 'die hard.'
LONDON_ The stars of 'Doctor Who' reveal the best fan costumes they've ever seen.
BROADCAST VIDEO ALREADY AVAILBALE
NEW YORK_ On '6 Underground' red carpet, Ryan Reynolds on relating to the plight of woman in 'Peloton' TV spot.
HONG KONG_ 'Les Mis' performance soothes, breaks Hong Kong hearts.
N/A_ National Film Registry announces diverse class of 2019.
LOS ANGELES_Nicole Kidman says second Globe nod for acting in 'Big Little Lies' is particularly sweet because she's nominated alongside co-star Meryl Streep.
LOS ANGELES_ Charlize Theron says she's baffled by Globes' failure to acknowledge female directors.
LOS ANGELES_ Actor turned producer William Levy: 'Instead of being the actor that looks for opportunities, I want to create opportunities'.
Last Updated : Dec 11, 2019, 11:35 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.