ETV Bharat / bharat

'మోదీజీ... నాకు మంత్రి పదవి వద్దు'

నూతన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగలేనని ప్రధానికి అరుణ్​ జైట్లీ  లేఖ రాశారు. అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు లేఖలో పేర్కొన్నారు ఆర్థిక మంత్రి.

author img

By

Published : May 29, 2019, 1:59 PM IST

Updated : May 29, 2019, 5:11 PM IST

'మోదీజీ... నాకు మంత్రి పదవి వద్దు'
'అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం'

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నూతన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగలేనని అందులో పేర్కొన్నారు. అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

ఆరోగ్యం, చికిత్సపై దృష్టి పెట్టడం కోసం నూతన భాజపా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండలేనని మోదీకి తెలియజేశారు జైట్లీ.

arun-jaitley-writes-to-pm-about-his-decision
జైట్లీ లేఖ

"నా కోసం, నా ఆరోగ్యం, చికిత్స కోసం కొంత సమయం ఇవ్వాలని నేను మిమ్మల్ని(మోదీ) కోరుతున్నా. అందువల్ల నూతన ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నా."
--- అరుణ్​ జైట్లీ, ఆర్థిక మంత్రి.

కొంతకాలంగా జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఇప్పటికే పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చారు.

ఇదీ చూడండి: నరేంద్రుడి పాలనకు ఎన్​ఆర్​ఐలు ఫిదా

'అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం'

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్​ జైట్లీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. నూతన ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగలేనని అందులో పేర్కొన్నారు. అనారోగ్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేశారు.

ఆరోగ్యం, చికిత్సపై దృష్టి పెట్టడం కోసం నూతన భాజపా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండలేనని మోదీకి తెలియజేశారు జైట్లీ.

arun-jaitley-writes-to-pm-about-his-decision
జైట్లీ లేఖ

"నా కోసం, నా ఆరోగ్యం, చికిత్స కోసం కొంత సమయం ఇవ్వాలని నేను మిమ్మల్ని(మోదీ) కోరుతున్నా. అందువల్ల నూతన ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు స్వీకరించకూడదని నిర్ణయించుకున్నా."
--- అరుణ్​ జైట్లీ, ఆర్థిక మంత్రి.

కొంతకాలంగా జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్స కోసం ఇప్పటికే పలుమార్లు విదేశాలకు వెళ్లి వచ్చారు.

ఇదీ చూడండి: నరేంద్రుడి పాలనకు ఎన్​ఆర్​ఐలు ఫిదా

Intro:Body:Conclusion:
Last Updated : May 29, 2019, 5:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.