ETV Bharat / bharat

'యతి' అడుగుజాడలపై నిపుణుల పరిశీలన

'యతి' అడుగుజాడలుగా చెబుతున్న కాలిముద్రల చిత్రాలను నిపుణులకు పంపించాలని భారత సైన్యం నిర్ణయించింది. హిమాలయ పర్వత శ్రేణుల్లో ఈ భారీ జీవి ఉన్నట్లు రకరకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఏప్రిల్​ 9న నేపాల్​లోని మకాలూ బేస్​ క్యాంపస్​నకు సమీపంలో భారత సైన్యం తీసిన అనుమానస్పద చిత్రాలతో మరోసారి 'యతి' పేరు తెరపైకి వచ్చింది.

author img

By

Published : May 1, 2019, 6:39 AM IST

Updated : May 1, 2019, 9:03 AM IST

'యతి' అడుగులపై పరిశీలనకు సైన్యం నిర్ణయం

'యతి'... ఎన్నో ఏళ్లుగా చాలా మందిని తొలిచేస్తోన్న ప్రశ్న. ఎంతోమంది తాము యతి అడుగుజాడలను చూశామని చెబుతూనే ఉన్నారు. అసలు ఈ యతి ఎవరు? హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉందని ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఈ జీవి కథ కల్పితమా? లేక వాస్తవమా? ఇవన్నీ ప్రశ్నలే. అయితే తాజాగా భారత సైన్యం అనుమానస్పద వింత జీవి కాలిముద్రల చిత్రాలను ట్విట్టర్​లో పంచుకుంది. ఈ చిత్రాలను నిపుణుల పరిశీలనకు పంపాలని నిర్ణయించింది.

ఏప్రిల్​ 9న నేపాల్​లోని మకాలూ బేస్​ క్యాంప్​​​నకు సమీపంలో మన సైన్యానికి కొన్ని అనుమానస్పద పాదముద్రలు 32x15 అంగుళాల పరిమాణంలో కనిపించాయి. పర్వతారోహణ బృందం వీటి ఛాయచిత్రాలు, వీడియోలను తీసినట్లు సైన్యం వెల్లడించింది. ఆ చిత్రాలను ట్విట్టర్​లో విడుదల చేసింది.

  • For the first time, an #IndianArmy Moutaineering Expedition Team has sited Mysterious Footprints of mythical beast 'Yeti' measuring 32x15 inches close to Makalu Base Camp on 09 April 2019. This elusive snowman has only been sighted at Makalu-Barun National Park in the past. pic.twitter.com/AMD4MYIgV7

    — ADG PI - INDIAN ARMY (@adgpi) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంచులో కనిపించిన ఈ ముద్రలు యతివా, లేక మరేదైనా వికృతాకార జీవివా తేలాల్సి ఉంది. గతంలో మకాలూ-బరూన్​ జాతీయ ఉద్యానవనం వద్ద ఇలాంటి అంతుచిక్కని జీవి కనిపించినట్లు భారత సైన్యం ట్విట్టర్​లో వెల్లడించింది.

సగటు మనిషి కన్నా పెద్దగా, ఎత్తుగా ఉండే కోతి లాంటి జీవి.. హిమాలయాలు, సైబీరియా, మధ్య-తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు నేపాలీ జానపద కథలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో మేజర్​ మనోజ్​ జోషి నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందానికి దొరికిన చిత్రాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ ముద్రలు దేనికి చెందినవో తెలుసుకునేందుకు నిపుణుల సాయం తీసుకోనుంది సైన్యం. ఏ రంగంలోని నిపుణులకు వీటిని పంపిస్తున్నారో సైనిక వర్గాలు వెల్లడించలేదు. ఈ పర్వతారోహణ బృందం వచ్చే నెలలో భారత్​కు రానుంది.

ఈ అనుమానస్పద అడుగుజాడలు శతాబ్దాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అలానే దీని వెనుక అనేక కథలు తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి.

'యతి'... ఎన్నో ఏళ్లుగా చాలా మందిని తొలిచేస్తోన్న ప్రశ్న. ఎంతోమంది తాము యతి అడుగుజాడలను చూశామని చెబుతూనే ఉన్నారు. అసలు ఈ యతి ఎవరు? హిమాలయ పర్వత శ్రేణుల్లో ఉందని ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఈ జీవి కథ కల్పితమా? లేక వాస్తవమా? ఇవన్నీ ప్రశ్నలే. అయితే తాజాగా భారత సైన్యం అనుమానస్పద వింత జీవి కాలిముద్రల చిత్రాలను ట్విట్టర్​లో పంచుకుంది. ఈ చిత్రాలను నిపుణుల పరిశీలనకు పంపాలని నిర్ణయించింది.

ఏప్రిల్​ 9న నేపాల్​లోని మకాలూ బేస్​ క్యాంప్​​​నకు సమీపంలో మన సైన్యానికి కొన్ని అనుమానస్పద పాదముద్రలు 32x15 అంగుళాల పరిమాణంలో కనిపించాయి. పర్వతారోహణ బృందం వీటి ఛాయచిత్రాలు, వీడియోలను తీసినట్లు సైన్యం వెల్లడించింది. ఆ చిత్రాలను ట్విట్టర్​లో విడుదల చేసింది.

  • For the first time, an #IndianArmy Moutaineering Expedition Team has sited Mysterious Footprints of mythical beast 'Yeti' measuring 32x15 inches close to Makalu Base Camp on 09 April 2019. This elusive snowman has only been sighted at Makalu-Barun National Park in the past. pic.twitter.com/AMD4MYIgV7

    — ADG PI - INDIAN ARMY (@adgpi) April 29, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మంచులో కనిపించిన ఈ ముద్రలు యతివా, లేక మరేదైనా వికృతాకార జీవివా తేలాల్సి ఉంది. గతంలో మకాలూ-బరూన్​ జాతీయ ఉద్యానవనం వద్ద ఇలాంటి అంతుచిక్కని జీవి కనిపించినట్లు భారత సైన్యం ట్విట్టర్​లో వెల్లడించింది.

సగటు మనిషి కన్నా పెద్దగా, ఎత్తుగా ఉండే కోతి లాంటి జీవి.. హిమాలయాలు, సైబీరియా, మధ్య-తూర్పు ఆసియా ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు నేపాలీ జానపద కథలు చెబుతున్నాయి.

ఈ నేపథ్యంలో మేజర్​ మనోజ్​ జోషి నేతృత్వంలోని 18 మంది సైనికుల బృందానికి దొరికిన చిత్రాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఈ ముద్రలు దేనికి చెందినవో తెలుసుకునేందుకు నిపుణుల సాయం తీసుకోనుంది సైన్యం. ఏ రంగంలోని నిపుణులకు వీటిని పంపిస్తున్నారో సైనిక వర్గాలు వెల్లడించలేదు. ఈ పర్వతారోహణ బృందం వచ్చే నెలలో భారత్​కు రానుంది.

ఈ అనుమానస్పద అడుగుజాడలు శతాబ్దాలుగా కనిపిస్తూనే ఉన్నాయి. అలానే దీని వెనుక అనేక కథలు తరతరాలుగా వినిపిస్తూనే ఉన్నాయి.

Rajouri (J-K), Apr 30 (ANI): An anti- drug rally was organised in Jammu and Kashmir's Rajouri. It was organized by J-K Excise Dept in collaboration with Anti Drug Action Committee. The rally witnessed the active participation of school students and youth. The main aim of the rally was to create awareness about the harmful effect of drug in-take.

Last Updated : May 1, 2019, 9:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.