ETV Bharat / bharat

కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్​.. భారత జవాను మృతి

author img

By

Published : Jun 14, 2020, 10:00 AM IST

Updated : Jun 14, 2020, 10:33 AM IST

ceasefire
నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు

10:26 June 14

పాక్​ దుశ్చర్య..

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది పాకిస్థాన్​. జమ్ముకశ్మీర్​లోని పూంఛ్​ ​ జిల్లా షాపుర్​-కెన్రీ​ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపాయి దాయాది బలగాలు. ఈ ఘటనలో ఓ భారత జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

"శనివారం రాత్రి షాపుర్​-కెన్రీ సెక్టార్​లో కాల్పులు, దాడులకు పాల్పడింది పాక్​.  వారికి దీటైన సమాధానం ఇచ్చాయి భారత బలగాలు. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించిన క్రమంలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు."  

- సైనికాధికారులు  

ఈ నెలలో పూంఛ్​​, రాజౌరీ జిల్లాల్లోని సైనిక పోస్టులు, గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్​ దళాలు చేసిన కాల్పులు, మోర్టార్ల దాడుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జూన్​ 4న రాజౌరి జిల్లాలోని సుందర్​బనీ సెక్టార్​, జూన్​ 10న అదే జిల్లాలో జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.   

09:55 June 14

మరోసారి పాక్​ దుశ్చర్య.. భారత జవాను మృతి

పాక్ వరుసగా..​ దుశ్చర్యలకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్​ పూంఛ్​లోని నియంత్రణ రేఖ వద్ద పాక్​ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించాయి. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. 

10:26 June 14

పాక్​ దుశ్చర్య..

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదే పదే ఉల్లంఘిస్తూ తన వక్రబుద్ధిని చాటుకుంటోంది పాకిస్థాన్​. జమ్ముకశ్మీర్​లోని పూంఛ్​ ​ జిల్లా షాపుర్​-కెన్రీ​ సెక్టార్​ వద్ద నియంత్రణ రేఖ వెంబడి కాల్పులు జరిపాయి దాయాది బలగాలు. ఈ ఘటనలో ఓ భారత జవాను మృతి చెందాడు. మరో ఇద్దరు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు.

"శనివారం రాత్రి షాపుర్​-కెన్రీ సెక్టార్​లో కాల్పులు, దాడులకు పాల్పడింది పాక్​.  వారికి దీటైన సమాధానం ఇచ్చాయి భారత బలగాలు. ఈ ఘటనలో ముగ్గురు భారత జవాన్లు గాయపడ్డారు. ఆస్పత్రికి తరలించిన క్రమంలో చికిత్స పొందుతూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు."  

- సైనికాధికారులు  

ఈ నెలలో పూంఛ్​​, రాజౌరీ జిల్లాల్లోని సైనిక పోస్టులు, గ్రామాలే లక్ష్యంగా పాకిస్థాన్​ దళాలు చేసిన కాల్పులు, మోర్టార్ల దాడుల్లో ఇప్పటి వరకు ముగ్గురు భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జూన్​ 4న రాజౌరి జిల్లాలోని సుందర్​బనీ సెక్టార్​, జూన్​ 10న అదే జిల్లాలో జరిపిన దాడుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు.   

09:55 June 14

మరోసారి పాక్​ దుశ్చర్య.. భారత జవాను మృతి

పాక్ వరుసగా..​ దుశ్చర్యలకు పాల్పడుతోంది. జమ్ముకశ్మీర్​ పూంఛ్​లోని నియంత్రణ రేఖ వద్ద పాక్​ దళాలు మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించాయి. ఈ ఘటనలో ఓ భారత జవాను ప్రాణాలు కోల్పోయాడు. 

Last Updated : Jun 14, 2020, 10:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.