ETV Bharat / bharat

శ్రీనగర్ హైవేపై భారీ బాంబు నిర్వీర్యం - bomb found on baramulla highway

శ్రీనగర్ బారాముల్లా హైవే పై భారీ పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసింది భారత ఆర్మీ. అదే సమయంలో కాల్పుల విరమరణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరోసారి పూంచ్​ జిల్లాలో అప్రకటిత కాల్పులకు తెగబడింది పాక్​సైన్యం.

Army diffuses IED on Srinagar-Baramulla National Highway
హైవేపై భారీ బాంబు స్వాధీనం!
author img

By

Published : Aug 4, 2020, 11:01 AM IST

Updated : Aug 4, 2020, 11:06 AM IST

శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారి-29ఆర్ఆర్ పై భారీ పేలుడు పదార్థాన్ని గుర్తించింది భారత సైనిక దళం. అనంతరం బాంబు వినాశక దళం ఆ పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసింది.

army-diffuses-ied-on-srinagar-baramulla-national-highway
హైవేపై భారీ బాంబు స్వాధీనం!

పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న కాసేపటికే.. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. పూంచ్​ జిల్లా, కృష్ణ ఘాటి సెక్టార్ లో ఫిరంగులు, తుపాకులతో అప్రకటిత కాల్పులకు తెగబడింది.

army-diffuses-ied-on-srinagar-baramulla-national-highway
బాంబును ధ్వంసం చేసిన బాంబ్ స్క్వాడ్

గత నెల రోజులుగా నియంత్రణ రేఖ వెంటననున్న గ్రామాలే లక్ష్యంగా రోజుకు ఒకటి, రెండు సార్లు కాల్పులు జరుపుతోంది పాక్. ఆగస్ట్ 1న జమ్ము కశ్మీర్ రాజౌరి జిల్లాలో పాక్ ఆకస్మిక కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత జవాను రోహిన్ కుమార్ మృతిచెందాడు. అదే జిల్లాలో జులై 10న మరో జవాను కన్ను మూశాడు. జులై 18న పూంచ్​ జిల్లాలో పాక్ వక్రబుద్ధికి ముగ్గురు అమాయక పౌరులు బలయ్యారు.

ఇదీ చదవండి: ముంబయిని ముంచెత్తిన వాన.. నీటమునిగిన నగరం

శ్రీనగర్-బారాముల్లా జాతీయ రహదారి-29ఆర్ఆర్ పై భారీ పేలుడు పదార్థాన్ని గుర్తించింది భారత సైనిక దళం. అనంతరం బాంబు వినాశక దళం ఆ పేలుడు పదార్థాన్ని నిర్వీర్యం చేసింది.

army-diffuses-ied-on-srinagar-baramulla-national-highway
హైవేపై భారీ బాంబు స్వాధీనం!

పేలుడు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్న కాసేపటికే.. మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది పాకిస్థాన్. పూంచ్​ జిల్లా, కృష్ణ ఘాటి సెక్టార్ లో ఫిరంగులు, తుపాకులతో అప్రకటిత కాల్పులకు తెగబడింది.

army-diffuses-ied-on-srinagar-baramulla-national-highway
బాంబును ధ్వంసం చేసిన బాంబ్ స్క్వాడ్

గత నెల రోజులుగా నియంత్రణ రేఖ వెంటననున్న గ్రామాలే లక్ష్యంగా రోజుకు ఒకటి, రెండు సార్లు కాల్పులు జరుపుతోంది పాక్. ఆగస్ట్ 1న జమ్ము కశ్మీర్ రాజౌరి జిల్లాలో పాక్ ఆకస్మిక కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన భారత జవాను రోహిన్ కుమార్ మృతిచెందాడు. అదే జిల్లాలో జులై 10న మరో జవాను కన్ను మూశాడు. జులై 18న పూంచ్​ జిల్లాలో పాక్ వక్రబుద్ధికి ముగ్గురు అమాయక పౌరులు బలయ్యారు.

ఇదీ చదవండి: ముంబయిని ముంచెత్తిన వాన.. నీటమునిగిన నగరం

Last Updated : Aug 4, 2020, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.