ETV Bharat / bharat

సరిహద్దుల్లో గస్తీ ముమ్మరం- రాజ్​నాథ్​ సమీక్ష

రక్షణమంత్రి రాజ్​నాథ్​సింగ్​తో భేటీ అయ్యారు సైనికాధిపతి నరవాణె. సరిహద్దు ఘర్షణల అనంతరం రెండు రోజులపాటు లద్దాఖ్​లో పర్యటించిన నరవాణె క్షేత్రస్థాయి పరిస్థితులపై రాజ్​నాథ్​కు వివరించారని తెలుస్తోంది. అటు సరిహద్దులో బలగాల సంఖ్యను క్రమంగా పెంచుతోంది సైన్యం. యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తోంది వాయుసేన.

author img

By

Published : Jun 26, 2020, 4:28 PM IST

naravane
సరిహద్దు రక్షణపై రాజ్​నాథ్​తో నరవాణె భేటీ

సైనికాధిపతి నరవాణె రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో భేటీ అయ్యారు. లద్దాఖ్​ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. రెండు రోజులపాటు తూర్పు లద్దాఖ్​, వాస్తవాధీన రేఖ సమీపంలోని ప్రాంతాల్లో పర్యటించారు సైనికాధ్యక్షుడు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, సైనిక సన్నద్ధత, సరిహద్దు వెంట భారత బలాన్ని పెంచే అంశాలపై రాజ్​నాథ్​కు నివేదించినట్లు తెలుస్తోంది.

లేహ్​లో యుద్ధ విమానాలు..

జూన్ 15,16 తేదిల్లో జరిగిన సరిహద్దు ఘర్షణల అనంతరం వాస్తవాధీన రేఖ వెంట అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారత్. క్రమంగా బలగాల సంఖ్యను పెంచుతోంది.

  • #WATCH Ladakh: Indian Air Force aircraft carrying out sorties in Leh. The air activity has gone up in the region after the stand-off with China on the Line of Actual Control (LAC) there. pic.twitter.com/6L0Bqn3hTY

    — ANI (@ANI) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత వాయుసేన విమానాలు ఇప్పటికే లేహ్ ప్రాంతానికి చేరాయి. గగనతలంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహిస్తున్నాయి.

నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలు..

పొరుగుదేశం నేపాల్.. కొద్దిరోజులుగా సరిహద్దులో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్​- నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలను తరలించింది సైన్యం. ఉత్తరాఖండ్ పితోర్​గఢ్ జిల్లా దర్చులా నుంచి కాలాపానీ వరకు సశస్త్ర సీమాబల్​కు చెందిన జవాన్లను మోహరించింది. నేపాల్​తో సరిహద్దును మూసేసింది.

భారత భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని విడుదల చేయడం.. దర్చులాకు సమీపంలో రహదారి నిర్మాణం, భారత భూభాగమైన మాల్పాలో హెలీప్యాడ్ ఏర్పాటు వంటి చర్యలతో భారత్​- నేపాల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: శనివారం నుంచి దిల్లీలో సెరోలాజికల్ సర్వే

సైనికాధిపతి నరవాణె రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​తో భేటీ అయ్యారు. లద్దాఖ్​ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై వివరించారు. రెండు రోజులపాటు తూర్పు లద్దాఖ్​, వాస్తవాధీన రేఖ సమీపంలోని ప్రాంతాల్లో పర్యటించారు సైనికాధ్యక్షుడు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులు, సైనిక సన్నద్ధత, సరిహద్దు వెంట భారత బలాన్ని పెంచే అంశాలపై రాజ్​నాథ్​కు నివేదించినట్లు తెలుస్తోంది.

లేహ్​లో యుద్ధ విమానాలు..

జూన్ 15,16 తేదిల్లో జరిగిన సరిహద్దు ఘర్షణల అనంతరం వాస్తవాధీన రేఖ వెంట అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది భారత్. క్రమంగా బలగాల సంఖ్యను పెంచుతోంది.

  • #WATCH Ladakh: Indian Air Force aircraft carrying out sorties in Leh. The air activity has gone up in the region after the stand-off with China on the Line of Actual Control (LAC) there. pic.twitter.com/6L0Bqn3hTY

    — ANI (@ANI) June 26, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

భారత వాయుసేన విమానాలు ఇప్పటికే లేహ్ ప్రాంతానికి చేరాయి. గగనతలంలో చక్కర్లు కొడుతూ గస్తీ నిర్వహిస్తున్నాయి.

నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలు..

పొరుగుదేశం నేపాల్.. కొద్దిరోజులుగా సరిహద్దులో భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్​- నేపాల్ సరిహద్దుకు అదనపు బలగాలను తరలించింది సైన్యం. ఉత్తరాఖండ్ పితోర్​గఢ్ జిల్లా దర్చులా నుంచి కాలాపానీ వరకు సశస్త్ర సీమాబల్​కు చెందిన జవాన్లను మోహరించింది. నేపాల్​తో సరిహద్దును మూసేసింది.

భారత భూభాగాలను తమవిగా చూపుతూ కొత్త చిత్రపటాన్ని విడుదల చేయడం.. దర్చులాకు సమీపంలో రహదారి నిర్మాణం, భారత భూభాగమైన మాల్పాలో హెలీప్యాడ్ ఏర్పాటు వంటి చర్యలతో భారత్​- నేపాల్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: శనివారం నుంచి దిల్లీలో సెరోలాజికల్ సర్వే

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.