ETV Bharat / bharat

కరోనా ఎఫెక్ట్: చైనాకు బయల్దేరిన మరో విమానం

చైనాలోని వుహాన్​కు నేడు మరో విమానం బయల్దేరింది. కరోనా విజృంభణ నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన మిగిలిన భారతీయులను స్వదేశానికి తెచ్చేందుకు చైనాకు వెళ్లింది.

author img

By

Published : Feb 1, 2020, 2:20 PM IST

Updated : Feb 28, 2020, 6:47 PM IST

carona
కరోనా ఎఫెక్ట్: చైనాకు బయల్దేరిన మరో విమానం

చైనాలోని వుహాన్​కు నేడు మరో విమానం బయల్దేరింది. కరోనా బాధిత దేశమైన చైనాలోని మిగిలిన భారతీయులను స్వదేశానికి తెచ్చే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా విమానం చైనాకు రెండో దఫా వెళ్లింది. ఈ విమానంలో రామ్​మనోహర్​ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యుల బృందం సహా పారామెడికల్​ సిబ్బంది, విమాన ఇంజినీర్లు ఉన్నారు.

"కరోనా బాధిత ప్రాంతమైన చైనాలోని వుహాన్​లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మరో విమానం చైనాకు బయల్దేరింది. ఇందులో తొలి దఫాలో వెళ్లిన వైద్య బృందం, మరో విమాన సిబ్బంది బృందం ఉంది. రెండో దఫా వెళ్లిన విమానానికీ కెప్టెన్ అమితాబ్​ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు."

-ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి

వుహాన్​లో సుమారు 6వందలమంది భారతీయులు ఉండగా వీరిలో 342మందిని తొలివిడతలో ఎయిర్ ఇండియా జంబో బి747 విమానం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చారు. దిల్లీకి సమీపంలోని మానేసర్​లో సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. తొలివిడతలో స్వదేశానికి చేరిన వారిలో 211మంది విద్యార్థులు కాగా మరో 110 మంది వృత్తి నిపుణులు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు సమాచారం.

ఎయిర్ ఇండియా ఇంతకు ముందు కూడా లిబియా, ఇరాక్​, యెమెన్, కువైట్​, నేపాల్ వంటి దేశాల నుంచి ఇలాంటి రెస్క్యూ విమానాలను నడిపింది.

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై నాటక ప్రదర్శన

చైనాలోని వుహాన్​కు నేడు మరో విమానం బయల్దేరింది. కరోనా బాధిత దేశమైన చైనాలోని మిగిలిన భారతీయులను స్వదేశానికి తెచ్చే ఉద్దేశ్యంతో ఎయిర్ ఇండియా విమానం చైనాకు రెండో దఫా వెళ్లింది. ఈ విమానంలో రామ్​మనోహర్​ లోహియా ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యుల బృందం సహా పారామెడికల్​ సిబ్బంది, విమాన ఇంజినీర్లు ఉన్నారు.

"కరోనా బాధిత ప్రాంతమైన చైనాలోని వుహాన్​లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఉద్దేశ్యంతో మరో విమానం చైనాకు బయల్దేరింది. ఇందులో తొలి దఫాలో వెళ్లిన వైద్య బృందం, మరో విమాన సిబ్బంది బృందం ఉంది. రెండో దఫా వెళ్లిన విమానానికీ కెప్టెన్ అమితాబ్​ సింగ్ నేతృత్వం వహిస్తున్నారు."

-ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి

వుహాన్​లో సుమారు 6వందలమంది భారతీయులు ఉండగా వీరిలో 342మందిని తొలివిడతలో ఎయిర్ ఇండియా జంబో బి747 విమానం ద్వారా స్వదేశానికి తీసుకువచ్చారు. దిల్లీకి సమీపంలోని మానేసర్​లో సైన్యం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాల్లో వైద్యసేవలు అందిస్తున్నారు. తొలివిడతలో స్వదేశానికి చేరిన వారిలో 211మంది విద్యార్థులు కాగా మరో 110 మంది వృత్తి నిపుణులు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు సమాచారం.

ఎయిర్ ఇండియా ఇంతకు ముందు కూడా లిబియా, ఇరాక్​, యెమెన్, కువైట్​, నేపాల్ వంటి దేశాల నుంచి ఇలాంటి రెస్క్యూ విమానాలను నడిపింది.

ఇదీ చూడండి: కరోనా వైరస్​పై నాటక ప్రదర్శన

Intro:Body:Conclusion:
Last Updated : Feb 28, 2020, 6:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.