ETV Bharat / bharat

'అప్పుడు నాయనమ్మ- ఇప్పుడు మనుమడు'

author img

By

Published : Apr 2, 2019, 10:55 AM IST

ప్రతిపక్షాలు ఐదు దశాబ్దాల్లో చేయలేనిది భాజపా ఐదేళ్లలో చేసిచూపించిందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్​ షా పునరుద్ఘాటించారు. న్యాయ్​ పేరిట రాహుల్​ ప్రకటించిన హామీతో పేదలకు ఒరిగేదేం ఉండదని ఈనాడు ముఖాముఖిలో చెప్పారు.

'అప్పుడు నాయనమ్మ- ఇప్పుడు మనుమడు'

రైతులను భాజపా విస్మరించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను భాజపా అధ్యక్షుడు అమిత్​ షా తిప్పికొట్టారు. భాజపా పథకాల వల్ల 15కోట్ల రైతులు లబ్ధిపొందుతున్నారని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే రాహుల్​ రెండో స్థానం చూసుకున్నారని ఈనాడు ముఖాముఖిలో విమర్శించారు షా.

15 కోట్ల రైతులకు లబ్ధి...

భాజపా రైతుల రుణాలు మాఫీ చేయదన్న ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం రూ. 1.2 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టేవాళ్లు. మేము ఆ మొత్తాన్ని రూ. 2 లక్షల కోట్లకు పెంచాం. చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. దీనివల్ల 15 కోట్లమంది రైతులు లబ్ధిపొందుతారు.

వారు చేయలేనిది మేము చేశాం...

జవహర్​లాల్​ నెహ్రూ గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ, సోనియాగాంధీ అదే నినాదంతో గెలిచినవారే. వీరెవరూ పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు. కనీస ఆదాయ పథకమంటూ ఇప్పుడు రాహుల్​ అదే పనిచేస్తున్నారు. కానీ మేము పేదరిక నిర్మూలనకు ఎన్నో చర్యలు చేపట్టాం. ఐదు దశాబ్దాల్లో వారు పరిష్కరించనిది మేము ఐదేళ్లలో చేసి చూపించాం.

అప్పుడు ఇందిర.. ఇప్పుడు రాహుల్​

ఓటమి భయంతోనే ఇందిరాగాంధీ దక్షిణాదిలో పోటీ చేశారు. ఇప్పుడు రాహుల్​కూ అదే భయం పట్టుకుంది. అమేఠీలో పోటీ సురక్షితం కాదని కాంగ్రెస్​ అధ్యక్షుడికి తెలుసు. అందుకే వాయనాడ్​ నుంచి పోటీచేస్తున్నారు. మాకు అలాంటి భయాలు లేవు. అందుకే మేము రెండు స్థానాల్లో పోటీ వంటి నిర్ణయాలు తీసుకోలేదు.

ఇంత గౌరవమిచ్చే ప్రధాని ఉన్నారా?

కేవలం ఎస్సీ, ఎస్టీ ఎంపీలకే టికెట్లు ఇవ్వలేదనడం సరికాదు. అన్ని కులాల వారిని మార్చాం. ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరిగేదే. స్వతంత్ర భారతదేశంలోనే తొలిసారి ఓ ప్రధానమంత్రి పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి గౌరవించారు. ఎస్సీలకు ఇంత గౌరవమిచ్చిన ప్రధాని ఎవరున్నారు? అంబేడ్కర్​ పేరు మీద నాణేలు విడదల చేయడం సహా రాజ్యాంగ నిర్మాణ దినోత్సవాలను మేము జరుపుతున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే అధికంగా లబ్ధి పొందారు.

ఇదీ చూడండి :భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'

రైతులను భాజపా విస్మరించిందన్న ప్రతిపక్షాల ఆరోపణలను భాజపా అధ్యక్షుడు అమిత్​ షా తిప్పికొట్టారు. భాజపా పథకాల వల్ల 15కోట్ల రైతులు లబ్ధిపొందుతున్నారని స్పష్టం చేశారు. ఓటమి భయంతోనే రాహుల్​ రెండో స్థానం చూసుకున్నారని ఈనాడు ముఖాముఖిలో విమర్శించారు షా.

15 కోట్ల రైతులకు లబ్ధి...

భాజపా రైతుల రుణాలు మాఫీ చేయదన్న ప్రతిపక్షాల ఆరోపణలు అవాస్తవం. వారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల కోసం రూ. 1.2 లక్షల కోట్ల బడ్జెట్​ పెట్టేవాళ్లు. మేము ఆ మొత్తాన్ని రూ. 2 లక్షల కోట్లకు పెంచాం. చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవడానికి రూ. 6 వేల చొప్పున పెట్టుబడి రాయితీ ఇస్తున్నాం. దీనివల్ల 15 కోట్లమంది రైతులు లబ్ధిపొందుతారు.

వారు చేయలేనిది మేము చేశాం...

జవహర్​లాల్​ నెహ్రూ గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ, రాజీవ్​గాంధీ, సోనియాగాంధీ అదే నినాదంతో గెలిచినవారే. వీరెవరూ పేదరికాన్ని నిర్మూలించలేకపోయారు. కనీస ఆదాయ పథకమంటూ ఇప్పుడు రాహుల్​ అదే పనిచేస్తున్నారు. కానీ మేము పేదరిక నిర్మూలనకు ఎన్నో చర్యలు చేపట్టాం. ఐదు దశాబ్దాల్లో వారు పరిష్కరించనిది మేము ఐదేళ్లలో చేసి చూపించాం.

అప్పుడు ఇందిర.. ఇప్పుడు రాహుల్​

ఓటమి భయంతోనే ఇందిరాగాంధీ దక్షిణాదిలో పోటీ చేశారు. ఇప్పుడు రాహుల్​కూ అదే భయం పట్టుకుంది. అమేఠీలో పోటీ సురక్షితం కాదని కాంగ్రెస్​ అధ్యక్షుడికి తెలుసు. అందుకే వాయనాడ్​ నుంచి పోటీచేస్తున్నారు. మాకు అలాంటి భయాలు లేవు. అందుకే మేము రెండు స్థానాల్లో పోటీ వంటి నిర్ణయాలు తీసుకోలేదు.

ఇంత గౌరవమిచ్చే ప్రధాని ఉన్నారా?

కేవలం ఎస్సీ, ఎస్టీ ఎంపీలకే టికెట్లు ఇవ్వలేదనడం సరికాదు. అన్ని కులాల వారిని మార్చాం. ఇది ప్రతి ఎన్నికల్లోనూ జరిగేదే. స్వతంత్ర భారతదేశంలోనే తొలిసారి ఓ ప్రధానమంత్రి పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి గౌరవించారు. ఎస్సీలకు ఇంత గౌరవమిచ్చిన ప్రధాని ఎవరున్నారు? అంబేడ్కర్​ పేరు మీద నాణేలు విడదల చేయడం సహా రాజ్యాంగ నిర్మాణ దినోత్సవాలను మేము జరుపుతున్నాం. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే అధికంగా లబ్ధి పొందారు.

ఇదీ చూడండి :భారత్​ భేరి: 'యావద్దేశం మోదీ మంత్రం'

AP Video Delivery Log - 0400 GMT News
Tuesday, 2 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0238: Internet Brexit Verhofstadt AP Clients Only 4203926
EU official: Hard Brexit 'nearly inevitable'
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.