ETV Bharat / bharat

లద్దాఖ్ సరిహదుల్లోకి మరో 2వేల అదనపు బలగాలు! - india china border news

తూర్పు లద్దాఖ్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే భద్రత కట్టుదిట్టం చేసిన భారత్ అదనంగా మరో 2000 మంది ఐటీబీపీ బలగాలను పంపనుంది. సైనో-ఇండియా సరిహద్దులో నిఘా పెంచే క్రమంలో అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు హోంశాఖ వెల్లడించింది.

ITBP troops
లద్దాఖ్ సరిహదుల్లోకి మరో 2వేల అదనపు బలగాలు!
author img

By

Published : Jun 21, 2020, 5:29 AM IST

చైనా దాష్టీకంతో ఉద్రిక్తతలు తలెత్తిన లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది భారత్. ఇప్పటికే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరించగా..మరో 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను సరిహద్దుల్లోకి పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు తెలిపాయి. చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గస్తీని పెంచేందుకే అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు.

లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ప్రాంతాల్లో ఐటీబీపీలోని 20 అదనపు కంపెనీలకు చెందిన బలగాలు (2000 మంది)ని మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల మేర ఉన్న ఎల్ఏసీ వెంబడి ఇప్పటికే.. గస్తీ కాస్తున్నాయి ఐటీబీపీ దళాలు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కారకోరమ్ పాస్ నుంచి జచెప్ లా వరకు 180 సరిహద్దు పోస్టుల వద్ద ఐటీబీపీ బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి: 'గల్వాన్​ లోయ భారత్​దే.. చరిత్రే సాక్ష్యం'

చైనా దాష్టీకంతో ఉద్రిక్తతలు తలెత్తిన లద్దాఖ్‌లోని సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది భారత్. ఇప్పటికే యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోహరించగా..మరో 2000 మంది ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ) బలగాలను సరిహద్దుల్లోకి పంపనున్నట్లు కేంద్రం హోంశాఖ అధికారవర్గాలు తెలిపాయి. చైనాతో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గస్తీని పెంచేందుకే అదనపు బలగాలను మోహరిస్తున్నట్లు పేర్కొన్నారు.

లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి వివిధ ప్రాంతాల్లో ఐటీబీపీలోని 20 అదనపు కంపెనీలకు చెందిన బలగాలు (2000 మంది)ని మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇరు దేశాల మధ్య 3,488 కిలోమీటర్ల మేర ఉన్న ఎల్ఏసీ వెంబడి ఇప్పటికే.. గస్తీ కాస్తున్నాయి ఐటీబీపీ దళాలు. లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మీదుగా కారకోరమ్ పాస్ నుంచి జచెప్ లా వరకు 180 సరిహద్దు పోస్టుల వద్ద ఐటీబీపీ బలగాలను మోహరించారు.

ఇదీ చూడండి: 'గల్వాన్​ లోయ భారత్​దే.. చరిత్రే సాక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.