ETV Bharat / bharat

యుక్త వయస్సులోనే మత్తుకు బానిసలుగా..! - 75% youths consume alcohol before turning 21, claims survey

చిన్న వయసులోనే మత్తుకు బానిసలవుతున్నారు యువత. మద్యం సేవించాలంటే చట్టపరంగా 21 సంవత్సరాల వయసు ఉండాలి.. కానీ దేశంలో సుమారు 75 శాతం మంది కనీస వయసు రాకముందే మద్యం సేవిస్తున్నట్లు ఓ నివేదిక తేల్చింది. 47 శాతం మంది సిగరెట్స్​, 20 శాతం మంది మత్తు పదార్థాలు, 30 శాతం మంది హుక్కా తాగుతున్నట్లు తేలింది.

యుక్త వయస్సులోనే మత్తుకు బానిసలుగా..!
author img

By

Published : Sep 28, 2019, 7:31 AM IST

Updated : Oct 2, 2019, 7:31 AM IST

ప్రస్తుత రోజుల్లో యువత చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిసలవుతున్నారు. అలాంటి వారు ఏ వయస్సు నుంచి మత్తు పదార్థాలను అలవాటు చేసుకుంటారు అనే అంశంపై దక్షణ ముంబయిలోని సెయింట్​ జేవియర్స్​ కళాశాలకు చెందిన చరిత్ర విభాగ విద్యార్థులు సర్వే చేపట్టారు.

ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. చట్టపరంగా కనీస వయసు 21 రాకముందే మత్తుకు బానిసలవుతున్నట్లు తేలింది. ముంబయి, పుణె, దిల్లీ, కోల్​కతా, రాజస్థాన్​ వంటి ప్రముఖ నగరాల్లో 16 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల 1000 మంది యువతపై సర్వే నిర్వహించారు. ఇందులో సుమారు 75 శాతం మంది 21 ఏళ్లలోపే మద్యం తాగుతున్నట్లు తెలిసింది.

మన దేశంలోని ప్రముఖ నగరాల్లోనే కాకుండా చెక్​ రిపబ్లిక్​ రాజధాని ప్రాగ్​, హంగేరీ, మధ్య ఐరోపా దేశాలలోని యువతపై సర్వే చేశారు.

"ప్రస్తుత రోజుల్లో యువత పలు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వారు మత్తు పదార్థాలకు బానిసలవ్వటానికి జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవటమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం."

-ప్రొఫెసర్​ డా.అవ్కాశ్​ జాదవ్, చరిత్ర విభాగాధిపతి.

నివేదిక ప్రకారం..

సర్వే నివేదిక ప్రకారం 21 సంవత్సరాల వయసు లోపే మద్యం స్వీకరించేవారు 75 శాతం, సిగరెట్లు అలవాటు ఉన్న వారు 47 శాతం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారు 20 శాతం, హుక్కాను స్వీకరించేవారు 30 శాతంగా ఉన్నట్లు తేలింది. 16 నుంచి 18 మధ్య వయస్సు కలిగిన యుక్త వయసు యువత ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు నివేదిక పేర్కొంది.

అయోమయంలో 83 శాతం..

మత్తు పదార్థాలకు బానిసలైన సుమారు 17 శాతం మంది వివిధ మార్గాల ద్వారా వ్యసనాల నుంచి బయటపడినట్లు తెలిపింది నివేదిక. మిగతా 83 శాతం మంది మత్తు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారని పేర్కొంది.

కమిషనర్​కు..

ఈ సర్వే పూర్తి నివేదికను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) సూపరింటెండెంట్​ భూమేష్‌ అగర్వాల్​కు సమర్పించారు.

ఇదీ చూడండి:భూటాన్​లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి

ప్రస్తుత రోజుల్లో యువత చెడు వ్యసనాలకు ఎక్కువగా బానిసలవుతున్నారు. అలాంటి వారు ఏ వయస్సు నుంచి మత్తు పదార్థాలను అలవాటు చేసుకుంటారు అనే అంశంపై దక్షణ ముంబయిలోని సెయింట్​ జేవియర్స్​ కళాశాలకు చెందిన చరిత్ర విభాగ విద్యార్థులు సర్వే చేపట్టారు.

ఈ సర్వేలో విస్తుపోయే నిజాలు వెల్లడయ్యాయి. చట్టపరంగా కనీస వయసు 21 రాకముందే మత్తుకు బానిసలవుతున్నట్లు తేలింది. ముంబయి, పుణె, దిల్లీ, కోల్​కతా, రాజస్థాన్​ వంటి ప్రముఖ నగరాల్లో 16 నుంచి 21 సంవత్సరాల మధ్య వయస్సు గల 1000 మంది యువతపై సర్వే నిర్వహించారు. ఇందులో సుమారు 75 శాతం మంది 21 ఏళ్లలోపే మద్యం తాగుతున్నట్లు తెలిసింది.

మన దేశంలోని ప్రముఖ నగరాల్లోనే కాకుండా చెక్​ రిపబ్లిక్​ రాజధాని ప్రాగ్​, హంగేరీ, మధ్య ఐరోపా దేశాలలోని యువతపై సర్వే చేశారు.

"ప్రస్తుత రోజుల్లో యువత పలు వ్యసనాలకు బానిసలవుతున్నారు. వారు మత్తు పదార్థాలకు బానిసలవ్వటానికి జన్యుపరమైన కారణాలు ఏమైనా ఉన్నాయా, మరే ఇతర కారణాలు ఉన్నాయా అని తెలుసుకోవటమే ఈ సర్వే ముఖ్య ఉద్దేశం."

-ప్రొఫెసర్​ డా.అవ్కాశ్​ జాదవ్, చరిత్ర విభాగాధిపతి.

నివేదిక ప్రకారం..

సర్వే నివేదిక ప్రకారం 21 సంవత్సరాల వయసు లోపే మద్యం స్వీకరించేవారు 75 శాతం, సిగరెట్లు అలవాటు ఉన్న వారు 47 శాతం, మత్తు పదార్థాలకు బానిసలవుతున్న వారు 20 శాతం, హుక్కాను స్వీకరించేవారు 30 శాతంగా ఉన్నట్లు తేలింది. 16 నుంచి 18 మధ్య వయస్సు కలిగిన యుక్త వయసు యువత ఇతర మత్తు పదార్థాలకు బానిసలవుతున్నట్లు నివేదిక పేర్కొంది.

అయోమయంలో 83 శాతం..

మత్తు పదార్థాలకు బానిసలైన సుమారు 17 శాతం మంది వివిధ మార్గాల ద్వారా వ్యసనాల నుంచి బయటపడినట్లు తెలిపింది నివేదిక. మిగతా 83 శాతం మంది మత్తు నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారని పేర్కొంది.

కమిషనర్​కు..

ఈ సర్వే పూర్తి నివేదికను అసిస్టెంట్ పోలీస్ కమిషనర్, మాదక ద్రవ్యాల నిరోధక విభాగం (ఎన్‌సీబీ) సూపరింటెండెంట్​ భూమేష్‌ అగర్వాల్​కు సమర్పించారు.

ఇదీ చూడండి:భూటాన్​లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి

AP Video Delivery Log - 1200 GMT News
Friday, 27 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1144: Russia Peskov AP Clients Only 4232073
Russia on publication of phone call transcripts
AP-APTN-1136: Indonesia Earthquake AP Clients Only 4232071
Death toll in Indonesia earthquake reaches 23
AP-APTN-1129: Italy Climate Protest AP Clients Only 4232070
Thousands of students march for climate action
AP-APTN-1116: France Chirac Tributes AP Clients Only 4232068
Tributes paid to former French President Chirac
AP-APTN-1107: Belgium Barnier AP Clients Only 4232066
Barnier and Frost arrive for Brexit talks
AP-APTN-1105: UK Brexit Cummings AP Clients Only 4232063
Advisor won't say if Johnson will obey Benn act
AP-APTN-1104: China MOFA Briefing AP Clients Only 4232044
DAILY MOFA BRIEFING
AP-APTN-1101: Egypt el Sissi No Access Egypt 4232062
'Lies:' el Sissi reacts to corruption claims
AP-APTN-1035: Austria Election AP Clients Only 4232059
OVP leader Kurz urges people to vote in election
AP-APTN-1031: Italy Stabbed Officer No Access Italy 4232058
Candlelit march in memory of killed officer
AP-APTN-1003: France Chirac Mourning AP Clients Only 4232055
France remembers former President Chirac
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Oct 2, 2019, 7:31 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.