ETV Bharat / bharat

కరోనా పంజా: మరో ఎమ్మెల్యేకు వైరస్

author img

By

Published : Jun 17, 2020, 4:49 PM IST

దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయతాండవం కొనసాగుతూనే ఉంది. తాజాగా అధికార పార్టీ ఎమ్మెల్యే అతిశీ సింగ్​కు వైరస్​ సోకినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

AAP MLA aatishi found corona positive
ఆప్​ ఎమ్మెల్యే అతిశీ సింగ్​కు కరోనా

దిల్లీలో వైరస్​ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) శాసనసభ సభ్యురాలు అతిశీ సింగ్​కు కొవిడ్​-19 సోకినట్లు నిర్ధరణ అయింది. మంగళవారం ఆమె నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. నేడు ఫలితాలను వెల్లడించారు.

ప్రస్తుతం అతిశీ.. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వైరస్​ బారినపడిన ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆకాంక్షించారు.

'కరోనాపై పోరాటంలో అతిశీ కీలకపాత్ర పోషించారు. ఆమె త్వరగా కోలుకొని.. తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని ఆశిస్తున్నా.'

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

ఇటీవల దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​ కూడా కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా.. ఆయనకు కరోనా నెగటివ్​గా తేలింది. మరోసారి ఆయన నమూనాలు సేకరించారు వైద్యులు.

ఇదీ చదవండి: గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం

దిల్లీలో వైరస్​ బారినపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా అధికార ఆమ్​ ఆద్మీ పార్టీ(ఆప్​) శాసనసభ సభ్యురాలు అతిశీ సింగ్​కు కొవిడ్​-19 సోకినట్లు నిర్ధరణ అయింది. మంగళవారం ఆమె నుంచి నమూనాలు సేకరించిన వైద్యులు.. నేడు ఫలితాలను వెల్లడించారు.

ప్రస్తుతం అతిశీ.. కల్కాజీ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

వైరస్​ బారినపడిన ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ఆకాంక్షించారు.

'కరోనాపై పోరాటంలో అతిశీ కీలకపాత్ర పోషించారు. ఆమె త్వరగా కోలుకొని.. తిరిగి ప్రజాసేవలో పాల్గొంటారని ఆశిస్తున్నా.'

- అరవింద్​ కేజ్రీవాల్​, దిల్లీ ముఖ్యమంత్రి

ఇటీవల దిల్లీ ఆరోగ్యమంత్రి సత్యేంద్ర జైన్​ కూడా కరోనా అనుమానిత లక్షణాలతో ఆసుపత్రిలో చేరగా.. ఆయనకు కరోనా నెగటివ్​గా తేలింది. మరోసారి ఆయన నమూనాలు సేకరించారు వైద్యులు.

ఇదీ చదవండి: గురువారం మాస్క్ డే- కరోనాపై అవగాహనే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.