విదేశాల నుంచి పసిడిని అక్రమంగా తరలించేందుకు భిన్న మార్గాలను ఎంచుకుంటున్నారు స్మగ్లర్లు. విమానాశ్రయాల్లో అధికారుల కళ్లు కప్పేందుకు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. దిల్లీలోని ఐజీఐ విమానాశ్రయంలో శుక్రవారం ఇలాంటి ఘటనే జరిగింది.
ఖతార్ రాజధాని దోహా నుంచి భారత్కు వచ్చాడు ఓ వ్యక్తి. లోదుస్తుల్లో ఏకంగా 840 గ్రాముల బంగారాన్ని దాచాడు. అధికారులకు చిక్కననుకున్నాడు. అప్రమత్తంగా ఉన్న కస్టమ్స్ శాఖ అధికారులు అతడిపై అనుమానం వచ్చి తనిఖీలు నిర్వహించారు. అండర్వేర్లో రూ.29 లక్షలు విలువ చేసే బంగారాన్ని గుర్తించి విస్తుపోయారు. వెంటనే ఆ ప్రయాణికుడ్ని అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చూడండి: చారిత్రక కట్టడాల నడుమ మోదీ-జిన్పింగ్ స్నేహగీతిక