ETV Bharat / bharat

పోలీసుల కాల్పుల్లో ఇద్దరు నేరస్థులు హతం

author img

By

Published : Jul 3, 2020, 6:16 AM IST

Updated : Jul 3, 2020, 10:25 AM IST

8-police-person-death-in-kanpur
దుండగుల దాడి.. 8 మంది పోలీసులు మృతి

10:15 July 03

ఇద్దరు నిందితులు హతం..

పోలీసుల కూంబింగ్​ ఆపరేషన్​లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

09:05 July 03

పౌరుడికి గాయాలు..

కాన్పుర్​ ఘటనలో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు ఏడీజీ ప్రశాంత్​ కుమార్​. పోలీసుల ఆయుధాలు కొన్ని కనిపించట్లేదని తెలుస్తోంది. నిందితులను పట్టుకొని.. న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్​ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​ బృందాలు నిందితులను పట్టుకునేందుకు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.   

07:36 July 03

ఘటనా స్థలానికి ఫోరెన్సిక్​ బృందం..

చీకటిగా ఉండటం వల్ల.. దాన్ని అదనుగా చేసుకొని నిందితులు తప్పించుకోగలిగారని తెలిపారు డీజీపీ. ఐజీ, ఏడీజీ, ఏడీజీ(శాంతి భద్రతలు) నేతృత్వంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు. కాన్పుర్​ నుంచి ఫోరెన్సిక్ బృందం, లఖ్​నవూ నుంచి నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ​ 

07:31 July 03

వికాస్​పై కేసు నమోదు..

రౌడీ షీటర్​ వికాస్​ దూబేపై సెక్షన్​ 307 కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు యూపీ డీజీపీ. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు.. జేసీబీలు అడ్డుగా పెట్టారని, ఆ సమయంలోనే పైనుంచి నేరస్థులు కాల్పులు జరిపారని వెల్లడించారు. 

07:24 July 03

కూంబింగ్​ ఆపరేషన్​..

కాన్పుర్​లో 8 మంది పోలీసులను బలిగొన్న నిందితులను పట్టుకునేందుకు కూంబింగ్​ ఆపరేషన్​ చేపట్టినట్లు తెలిపారు కాన్పుర్​ జోన్​ ఏడీజీ జేఎన్​ సింగ్​. ఘటనలో నలుగురు పోలీసు సిబ్బంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. పరిసర ప్రాంత పోలీసు బృందాలూ ఆపరేషన్​లో భాగం కానున్నాయని స్పష్టం చేశారు. 

07:21 July 03

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో దారుణం జరిగింది. రౌడీషీటర్​ వికాస్​ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో... దుండగుడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులవ్వగా, మరో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్​ ఇన్​స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన వారిలో ఎస్​ఓ బీతూర్ సహా ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.

"రౌడీషీటర్ వికాస్​ దూబేను పట్టుకునేందుకు చౌబేపుర్​ పోలీసుస్టేషన్ పరిధిలోని విక్రూ గ్రామానికి పోలీసులు వెళ్లారు. అయితే దుండగులు తాము తలదాచుకున్న ఇంటిపై నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో 8 మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు."

- పోలీసులు

వికాస్​ దూబేపై 60 వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని... వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు

06:36 July 03

యోగి విచారం..

కాన్పుర్​ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. 

06:08 July 03

దుండగుల దాడి.. 8 మంది పోలీసులు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో దారుణం జరిగింది. వికాస్​ దూబే అనే రౌడీ షీటర్​ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో.. అతని అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఓ, ఎస్​ఓ సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు. మరో నలుగురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

10:15 July 03

ఇద్దరు నిందితులు హతం..

పోలీసుల కూంబింగ్​ ఆపరేషన్​లో ఇద్దరు దుండగులు హతమయ్యారు. మరో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి. ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇతర నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 

09:05 July 03

పౌరుడికి గాయాలు..

కాన్పుర్​ ఘటనలో ఓ పౌరుడు కూడా గాయపడ్డాడని తెలిపారు ఏడీజీ ప్రశాంత్​ కుమార్​. పోలీసుల ఆయుధాలు కొన్ని కనిపించట్లేదని తెలుస్తోంది. నిందితులను పట్టుకొని.. న్యాయస్థానం ముందు ప్రవేశపెడుతామని స్పష్టం చేశారు. ఆయన సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్​ బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. స్పెషల్​ టాస్క్​ ఫోర్స్​ బృందాలు నిందితులను పట్టుకునేందుకు.. గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.   

07:36 July 03

ఘటనా స్థలానికి ఫోరెన్సిక్​ బృందం..

చీకటిగా ఉండటం వల్ల.. దాన్ని అదనుగా చేసుకొని నిందితులు తప్పించుకోగలిగారని తెలిపారు డీజీపీ. ఐజీ, ఏడీజీ, ఏడీజీ(శాంతి భద్రతలు) నేతృత్వంలో గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు స్పష్టం చేశారు. కాన్పుర్​ నుంచి ఫోరెన్సిక్ బృందం, లఖ్​నవూ నుంచి నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు. ​ 

07:31 July 03

వికాస్​పై కేసు నమోదు..

రౌడీ షీటర్​ వికాస్​ దూబేపై సెక్షన్​ 307 కింద కేసు నమోదుచేసినట్లు తెలిపారు యూపీ డీజీపీ. అతనిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర చర్యలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. పోలీసు వాహనాలను అడ్డుకునేందుకు.. జేసీబీలు అడ్డుగా పెట్టారని, ఆ సమయంలోనే పైనుంచి నేరస్థులు కాల్పులు జరిపారని వెల్లడించారు. 

07:24 July 03

కూంబింగ్​ ఆపరేషన్​..

కాన్పుర్​లో 8 మంది పోలీసులను బలిగొన్న నిందితులను పట్టుకునేందుకు కూంబింగ్​ ఆపరేషన్​ చేపట్టినట్లు తెలిపారు కాన్పుర్​ జోన్​ ఏడీజీ జేఎన్​ సింగ్​. ఘటనలో నలుగురు పోలీసు సిబ్బంది గాయాలపాలయ్యారని పేర్కొన్నారు. పరిసర ప్రాంత పోలీసు బృందాలూ ఆపరేషన్​లో భాగం కానున్నాయని స్పష్టం చేశారు. 

07:21 July 03

ఉత్తర్​ప్రదేశ్ కాన్పుర్​లో దారుణం జరిగింది. రౌడీషీటర్​ వికాస్​ దూబేను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో... దుండగుడి అనుచరులు పోలీసులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అమరులవ్వగా, మరో నలుగురు పోలీసు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మృతుల్లో డీఎస్పీ దేవేంద్ర మిశ్రా, ముగ్గురు సబ్​ ఇన్​స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన వారిలో ఎస్​ఓ బీతూర్ సహా ఏడుగురు పోలీసు సిబ్బంది ఉన్నారు.

"రౌడీషీటర్ వికాస్​ దూబేను పట్టుకునేందుకు చౌబేపుర్​ పోలీసుస్టేషన్ పరిధిలోని విక్రూ గ్రామానికి పోలీసులు వెళ్లారు. అయితే దుండగులు తాము తలదాచుకున్న ఇంటిపై నుంచి కాల్పులకు తెగబడ్డారు. ఈ దారుణ ఘటనలో 8 మంది పోలీసులు అమరులయ్యారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు."

- పోలీసులు

వికాస్​ దూబేపై 60 వరకు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని... వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు పోలీసులు తెలిపారు.

మృతుల కుటుంబాలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు

06:36 July 03

యోగి విచారం..

కాన్పుర్​ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై ఆరా తీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. 

06:08 July 03

దుండగుల దాడి.. 8 మంది పోలీసులు మృతి

ఉత్తర్​ప్రదేశ్​ కాన్పుర్​లో దారుణం జరిగింది. వికాస్​ దూబే అనే రౌడీ షీటర్​ను పట్టుకునేందుకు చేపట్టిన ఆపరేషన్​లో.. అతని అనుచరులు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సీఓ, ఎస్​ఓ సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు అమరులయ్యారు. మృతుల్లో డిప్యూటీ ఎస్పీ కూడా ఉన్నారు. మరో నలుగురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Last Updated : Jul 3, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.