ETV Bharat / bharat

హత్యా నేరాల్లో యూపీ, బిహార్ టాప్​

author img

By

Published : Oct 4, 2020, 4:45 AM IST

దేశంలోని మెట్రో నగరాల్లో నేరాలు పెరిగినట్లు జాతీయ నేర నమోదు విభాగం(ఎన్​సీఆర్​బీ)వెల్లడించింది. 2018తో పోలిస్తే 2019లో నేరాల్లో 7.3శాతం వృద్ధి నమోదైనట్లు తెలిపింది. మొత్తం కేసుల్లో అధిక శాతం చోరీ కేసులు, కిడ్నాప్​ కేసులు ఉన్నట్లు నివేదిక స్పష్టం చేసింది. హత్యానేరాల్లో ఉత్తర్​ప్రదేశ్​,బిహార్​లు ముందువరుసలో ఉన్నట్లు నివేదిక తేల్చింది.

19 Indian cities see surge in crime rate: NCRB
హత్యా నేరాల్లో యూపీ, బిహార్ టాప్​

జాతీయ నేర నమోదు విభాగం (ఎన్​సీఆర్​బీ)తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2019లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో నేరాలు 7.3శాతం పెరిగాయి. ఈ నగరాల్లో 2018లో మొత్తం నేరాల సంఖ్య 8,02,267 కాగా 2019లో ఆ సంఖ్య 8,60,960కి పెరిగింది. వీటిలో 6,04,897కేసులు భారత శిక్షాస్మృతి చట్టం కింద నమోదు కాగా.. 2,56,063కేసులు ప్రత్యేక,స్థానిక చట్టాల కింద నమోదయ్యాయి.

అధిక నేరాలు నమోదైన నగరాలు

1. దిల్లీ -3,11,092కేసులు

2. చెన్నై -71,949కేసులు

3. అహ్మదాబాద్ -53,538కేసులు

4. బెంగళూరు -41,854కేసులు

5. కోయంబత్తూర్​ -15,821కేసులు

ఐపీసీ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో 51 శాతం దొంగతనానికి సంబంధించినవి కాగా.. 9.5 శాతం రాష్ డ్రైవింగ్ కేసులు.

దేశవ్యాప్తంగా హత్యా నేరాల్లో మాత్రం ఉత్తర్ ప్రదేశ్​, బిహార్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.

హత్యా నేరాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు..

1. ఉత్తర్​ ప్రదేశ్ -3,806కేసులు

2. బిహార్ -3,138కేసులు

3. మహారాష్ట్ర -2,142కేసులు

4. మధ్యప్రదేశ్ -1,795కేసులు

5. ఝార్ఖండ్ -1,626కేసులు

జాతీయ నేర నమోదు విభాగం (ఎన్​సీఆర్​బీ)తాజాగా విడుదల చేసిన నివేదిక ప్రకారం 2018తో పోలిస్తే 2019లో దేశంలోని 19 మెట్రో నగరాల్లో నేరాలు 7.3శాతం పెరిగాయి. ఈ నగరాల్లో 2018లో మొత్తం నేరాల సంఖ్య 8,02,267 కాగా 2019లో ఆ సంఖ్య 8,60,960కి పెరిగింది. వీటిలో 6,04,897కేసులు భారత శిక్షాస్మృతి చట్టం కింద నమోదు కాగా.. 2,56,063కేసులు ప్రత్యేక,స్థానిక చట్టాల కింద నమోదయ్యాయి.

అధిక నేరాలు నమోదైన నగరాలు

1. దిల్లీ -3,11,092కేసులు

2. చెన్నై -71,949కేసులు

3. అహ్మదాబాద్ -53,538కేసులు

4. బెంగళూరు -41,854కేసులు

5. కోయంబత్తూర్​ -15,821కేసులు

ఐపీసీ సెక్షన్ కింద నమోదైన కేసుల్లో 51 శాతం దొంగతనానికి సంబంధించినవి కాగా.. 9.5 శాతం రాష్ డ్రైవింగ్ కేసులు.

దేశవ్యాప్తంగా హత్యా నేరాల్లో మాత్రం ఉత్తర్ ప్రదేశ్​, బిహార్ రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి.

హత్యా నేరాలు అధికంగా ఉన్న రాష్ట్రాలు..

1. ఉత్తర్​ ప్రదేశ్ -3,806కేసులు

2. బిహార్ -3,138కేసులు

3. మహారాష్ట్ర -2,142కేసులు

4. మధ్యప్రదేశ్ -1,795కేసులు

5. ఝార్ఖండ్ -1,626కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.