ETV Bharat / bharat

'బాలికలకు సెల్​ఫోన్ అందుబాటు తక్కువే' - mobile access to girls in india

జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా విడుదలైన ఓ సర్వేలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. 42 శాతం మంది బాలికలకు మాత్రమే రోజుకు గంట సేపు సెల్​ఫోన్ ఉపయోగించేందుకు తల్లితండ్రులు అనుమతిస్తున్నారు. ఇంట్లో కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు బాలికల కన్నా మగవారే ముందుగా వినియోగిస్తున్నారు. బాలికలు అయినందునే సెల్‌ఫోన్లు ఇవ్వడం లేదని సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు కూడా అంగీకరించారు.

mobile access to girls
బాలికలకు సెల్​ఫోన్ అందుబాటు తక్కువే
author img

By

Published : Jan 24, 2021, 5:15 AM IST

బాలికలకు సెల్​ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే తల్లిదండ్రుల్లో కాస్త భయం. ఇవి అంత సురక్షితమైనవి కావని, వారి దృష్టిని మళ్లిస్తాయన్న అభిప్రాయం నెలకొంది. యుక్తవయసులోకి వచ్చిన బాలికలల్లో కేవలం 42 శాతం మందికి మాత్రమే రోజులో కేవలం ఒక గంట సేపు సెల్​ను చూడడానికి తల్లిదండ్రులు అంగీకరిస్తున్నట్టు సర్వేలో తేలింది.

దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ కెటలైజింగ్ ఛేంజ్(సీ 3) అనే స్వచ్ఛంద సంస్థ ... డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో దేశవ్యాప్తంగా ఈ సర్వే చేసింది. 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాలకు చెందిన 4,100 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. బాలికలతో పాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులను కలిసింది. యుక్తవయసుకు వచ్చిన బాలికలకు సెల్ ఫోన్ సౌకర్యం కలగడం కష్టంగా మారినట్టు ఈ పరిశీలనలో తేలింది.

  • కర్ణాటకలో బాలికలకు సెల్​ఫోన్ సౌకర్యం లభ్యత గరిష్టంగా ఉంది. ఇక్కడ 65 శాతం మందికి అందుబాటులో ఉంది.
  • హరియాణాలో బాలురకు సెల్‌ఫోన్ ఇస్తున్నా బాలికల విషయానికి వస్తే వెనకడుగు వేస్తున్నారు.
  • తెలంగాణలో బాలురు-బాలికల తేడా చాలా స్వల్పంగా ఉంది. ఈ తేడా ఇక్కడ కేవలం 12 శాతమే.
  • బాలికలు అయినందునే సెల్‌ఫోన్లు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు కూడా అంగీకరించారు.
  • ఇంట్లో కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు ఉన్నా ప్రథమ వినియోగదారులు మగవారే.
  • బాలికలకు ఫోన్ కొనిచ్చే స్తోమత లేదని 81 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు .
  • సెల్‌ఫోన్ వినియోగంలోనూ బాలికలు వెనుకబడి ఉన్నారు. కాల్స్ రిసీవ్ చేసుకోవడం గురించి కేవలం 32 శాతం మందికే తెలుసు. కాలిక్యులేటర్, టార్చి, తదితర సౌకర్యాల గురించి 26 శాతం మందికే తెలుసు.
  • ఆన్​లైన్ యాప్​ల గురించి 15 శాతం మందికే అవగాహన ఉంది.
  • తమ పిల్లలకు కంప్యూటర్ల గురించి ఏమీ తెలియదని 16 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు.

ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అపరాజిత గొగొయ్ ఈ నివేదికను విడుదల చేశారు.

బాలికలకు సెల్​ఫోన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలంటే తల్లిదండ్రుల్లో కాస్త భయం. ఇవి అంత సురక్షితమైనవి కావని, వారి దృష్టిని మళ్లిస్తాయన్న అభిప్రాయం నెలకొంది. యుక్తవయసులోకి వచ్చిన బాలికలల్లో కేవలం 42 శాతం మందికి మాత్రమే రోజులో కేవలం ఒక గంట సేపు సెల్​ను చూడడానికి తల్లిదండ్రులు అంగీకరిస్తున్నట్టు సర్వేలో తేలింది.

దిల్లీకి చెందిన సెంటర్ ఫర్ కెటలైజింగ్ ఛేంజ్(సీ 3) అనే స్వచ్ఛంద సంస్థ ... డిజిటల్ ఎంపవర్‌మెంట్ ఫౌండేషన్ సహకారంతో దేశవ్యాప్తంగా ఈ సర్వే చేసింది. 10 రాష్ట్రాల్లోని 29 జిల్లాలకు చెందిన 4,100 మంది నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఈ రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. బాలికలతో పాటు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వివిధ సామాజిక సంస్థల ప్రతినిధులను కలిసింది. యుక్తవయసుకు వచ్చిన బాలికలకు సెల్ ఫోన్ సౌకర్యం కలగడం కష్టంగా మారినట్టు ఈ పరిశీలనలో తేలింది.

  • కర్ణాటకలో బాలికలకు సెల్​ఫోన్ సౌకర్యం లభ్యత గరిష్టంగా ఉంది. ఇక్కడ 65 శాతం మందికి అందుబాటులో ఉంది.
  • హరియాణాలో బాలురకు సెల్‌ఫోన్ ఇస్తున్నా బాలికల విషయానికి వస్తే వెనకడుగు వేస్తున్నారు.
  • తెలంగాణలో బాలురు-బాలికల తేడా చాలా స్వల్పంగా ఉంది. ఈ తేడా ఇక్కడ కేవలం 12 శాతమే.
  • బాలికలు అయినందునే సెల్‌ఫోన్లు ఇవ్వడం లేదని ఉపాధ్యాయులు కూడా అంగీకరించారు.
  • ఇంట్లో కంప్యూటర్లు, ఇతర సౌకర్యాలు ఉన్నా ప్రథమ వినియోగదారులు మగవారే.
  • బాలికలకు ఫోన్ కొనిచ్చే స్తోమత లేదని 81 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు .
  • సెల్‌ఫోన్ వినియోగంలోనూ బాలికలు వెనుకబడి ఉన్నారు. కాల్స్ రిసీవ్ చేసుకోవడం గురించి కేవలం 32 శాతం మందికే తెలుసు. కాలిక్యులేటర్, టార్చి, తదితర సౌకర్యాల గురించి 26 శాతం మందికే తెలుసు.
  • ఆన్​లైన్ యాప్​ల గురించి 15 శాతం మందికే అవగాహన ఉంది.
  • తమ పిల్లలకు కంప్యూటర్ల గురించి ఏమీ తెలియదని 16 శాతం మంది తల్లిదండ్రులు తెలిపారు.

ఆదివారం జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అపరాజిత గొగొయ్ ఈ నివేదికను విడుదల చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.