ఇటీవల జరిగిన కోజికోడ్ విమాన ప్రమాద ఘటనలో సహాయక చర్యలు చేపట్టిన 26 మంది వలంటీర్లకు కరోనా పాజిటివ్గా తేలింది. వీరిలో స్థానిక జిల్లా కలెక్టర్, ఎస్పీ సహా ఇతర అధికారులు కూడా ఉన్నారు.
ఆగస్టు 7న కేరళలోని కోజికోడ్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడంలో కీలక పాత్ర పోషించారు.
ఈ ఘటనలో జిల్లా కలెక్టర్ కె. గోపాలకృష్ణన్, ఎస్పీ అబ్దుల్ కరీమ్ సహా మొత్తం 21 మంది సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొనగా.. వారందరికీ కొవిడ్ పాజిటివ్గా నిర్ధరణ అయింది. వీరందరినీ వైద్య పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: కేంద్ర జల్ శక్తి మంత్రికి కరోనా పాజిటివ్