ETV Bharat / bharat

కశ్మీర్​లో ఎన్​కౌంటర్..​ ముగ్గురు ముష్కరులు హతం!

author img

By

Published : Apr 25, 2020, 8:22 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లాలో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు, వారికి సాయం అందించే మరో వ్యక్తిని మట్టుబెట్టాయి భద్రత దళాలు.

terrorists killed in encunter
కశ్మీర్​లో ఎన్​కౌంటర్​ ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా అవంతిపొరలోని గోరిపొర ప్రాంతంలో ఈ తెల్లువారు జామున ఎన్​కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు, ఓ ఉగ్రవాద సానుభూతిపరుడు హతమయ్యాడు.

ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరికొంత మంది తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్​ పుల్వామా జిల్లా అవంతిపొరలోని గోరిపొర ప్రాంతంలో ఈ తెల్లువారు జామున ఎన్​కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు, ఓ ఉగ్రవాద సానుభూతిపరుడు హతమయ్యాడు.

ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందిన వారో గుర్తించాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో మరికొంత మంది తీవ్రవాదులు ఉన్నారనే సమాచారంతో ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: కానిస్టేబుల్ కిడ్నాప్​.. ఇద్దరు ముష్కరులు హతం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.