ETV Bharat / bharat

చొరబాట్లపై ఉక్కుపాదం.. ఇద్దరు ముష్కరులు హతం

author img

By

Published : Jul 29, 2020, 5:11 AM IST

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి దేశంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపుతోంది సైన్యం. తాజాగా రాజౌరీ జిల్లా నౌషహరా సెక్టార్​లో కొంత మంది భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నించగా వారి ప్రయత్నాన్ని భగ్నం చేసింది. భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.

Pakistani terrorists killed
చొరబాట్లపై ఉక్కుపాదం

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది భారత సైన్యం. తాజాగా రాజౌరీ జిల్లాలోని ఎల్​ఓసీ వెంబడి దేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేశాయి బలగాలు. ఇద్దరు ముష్కరులను హతమార్చాయి.

" రాజౌరీ జిల్లా నౌషహరా సెక్టార్​లో కొంత మంది ఉగ్రవాదుల బృందం భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన భారత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులూ కాల్పులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో ఓ పేలుడు సంభవించింది. ల్యాండ్​మైన్​పై అందులో ఒకరు కాలుపెట్టడం వల్ల జరిగి ఉండొచ్చు. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను తీసుకురావాల్సి ఉంది. కొంత మంది వెనక్కి పారిపోయారు."

- అధికారులు.

చొరబాట్ల నేపథ్యంలో ఎల్​ఓసీ వెంబడి తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు అధికారులు.

గత నెల జూన్​ 1న ఇలాగే అక్రమ చొరబాట్ల ప్రయత్నాలను భగ్నం చేశాయి బలగాలు. ఆ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

ఇదీ చూడండి: చొరబాటు భగ్నం- ముగ్గురు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తోన్న ఉగ్రవాదులపై ఉక్కుపాదం మోపుతోంది భారత సైన్యం. తాజాగా రాజౌరీ జిల్లాలోని ఎల్​ఓసీ వెంబడి దేశంలోకి ప్రవేశించేందుకు చేసిన ప్రయత్నాన్ని భగ్నం చేశాయి బలగాలు. ఇద్దరు ముష్కరులను హతమార్చాయి.

" రాజౌరీ జిల్లా నౌషహరా సెక్టార్​లో కొంత మంది ఉగ్రవాదుల బృందం భారత్​లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించిన భారత బలగాలు కాల్పులు జరిపాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులూ కాల్పులకు పాల్పడ్డారు. ఆ ప్రాంతంలో ఓ పేలుడు సంభవించింది. ల్యాండ్​మైన్​పై అందులో ఒకరు కాలుపెట్టడం వల్ల జరిగి ఉండొచ్చు. ఈ ఘటనలో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఘటనాస్థలం నుంచి మృతదేహాలను తీసుకురావాల్సి ఉంది. కొంత మంది వెనక్కి పారిపోయారు."

- అధికారులు.

చొరబాట్ల నేపథ్యంలో ఎల్​ఓసీ వెంబడి తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్పారు అధికారులు.

గత నెల జూన్​ 1న ఇలాగే అక్రమ చొరబాట్ల ప్రయత్నాలను భగ్నం చేశాయి బలగాలు. ఆ ఘటనలో ముగ్గురు ముష్కరులు హతమయ్యారు.

ఇదీ చూడండి: చొరబాటు భగ్నం- ముగ్గురు ఉగ్రవాదులు హతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.