ఉత్తర్ప్రదేశ్ మరో అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భదోహీ జిల్లాలో 19ఏళ్ల యువతిపై స్థానిక కార్పెట్ ఫ్యాక్టరీ ఉద్యోగి అనేకమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత శనివారం.. అస్వస్థతకు గురైన బాధితురాలని ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఈ విషయం బయటకు వచ్చింది. బాధితురాలు మూడు నెలల గర్భవతి అని వైద్యులు నిర్ధరించారు.
అసలు విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 22ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి, జైలుకు తరలించినట్టు భదోహీ జిల్లా ఎస్పీ రామ్ బదన్ సింగ్ వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు వివరించారు.
ఇదీ చదవండి :యూపీలో మరో ఘోరం- బాలికపై 12 మంది...