ETV Bharat / bharat

గోశాలలో ఘోరం.. మరో 14 ఆవులు మృతి

author img

By

Published : Nov 23, 2020, 9:11 AM IST

రాజస్థాన్​లోని గోశాలలో మృతిచెందిన ఆవుల సంఖ్య పెరిగింది. ఆదివారం మరో 14 గోవులు మృత్యువాతపడ్డాయి. ఇప్పటివరకు మరణించిన ఆవుల సంఖ్య 94కు పెరిగింది.

14 more cows die at cowshed in Rajasthan's Churu
గోశాలలో ఘోరం.. మృతిచెందిన మరో 14 ఆవులు

రాజస్థాన్​ చురూ జిల్లా బియూబస్​ గ్రామంలోని గోశాలలో మృతిచెందిన ఆవుల సంఖ్య పెరిగింది. ఆదివారం మరో 14 గోవులు మృత్యువాతపడ్డాయి. మొత్తం మృతిచెందిన ఆవుల సంఖ్య 94కు చేరింది. ఆవుల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

" విషపూరిత గ్రాసం తినటం వల్లే ఆవులు మృతిచెందాయా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. పశువులు తిన్న గ్రాసం నమూనాలను పరీక్షించడానికి ప్రయోగశాలకు పంపించాం."

-- కుతేంద్ర కన్వార్​, సర్దార్​శహర్​ తహసీల్దార్​

శనివారం 80 ఆవులు మృతిచెందాయి. విషపూరిత గ్రాసం తినటం వల్లే గోవులు మరణించి ఉంటాయని పశు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో 78 గోవులు మృతి.. కారణమిదే!

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​లో గోవుల సంరక్షణకు 'కౌ క్యాబినెట్​'

రాజస్థాన్​ చురూ జిల్లా బియూబస్​ గ్రామంలోని గోశాలలో మృతిచెందిన ఆవుల సంఖ్య పెరిగింది. ఆదివారం మరో 14 గోవులు మృత్యువాతపడ్డాయి. మొత్తం మృతిచెందిన ఆవుల సంఖ్య 94కు చేరింది. ఆవుల మృతికి గల కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

" విషపూరిత గ్రాసం తినటం వల్లే ఆవులు మృతిచెందాయా లేదా మరేదైనా కారణాలు ఉన్నాయా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. పశువులు తిన్న గ్రాసం నమూనాలను పరీక్షించడానికి ప్రయోగశాలకు పంపించాం."

-- కుతేంద్ర కన్వార్​, సర్దార్​శహర్​ తహసీల్దార్​

శనివారం 80 ఆవులు మృతిచెందాయి. విషపూరిత గ్రాసం తినటం వల్లే గోవులు మరణించి ఉంటాయని పశు వైద్యులు ప్రాథమికంగా నిర్ధరించారు.

ఇదీ చూడండి:ఆ రాష్ట్రంలో 78 గోవులు మృతి.. కారణమిదే!

ఇదీ చూడండి:మధ్యప్రదేశ్​లో గోవుల సంరక్షణకు 'కౌ క్యాబినెట్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.