ETV Bharat / bharat

కరోనా పరీక్ష​ కిట్ల నాణ్యత తేల్చేందుకు 14 సంస్థలకు లైసెన్స్​

author img

By

Published : Mar 20, 2020, 9:47 PM IST

కరోనా పరీక్ష కిట్ల నాణ్యతను అంచనా వేసేందుకు 14 ప్రైవేటు సంస్థలకు లైసెన్స్​లు ఇచ్చింది ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ నిర్ధరణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

COVID-19 tests kits
ప్రైవేటు సంస్థలకు లైసెన్స్​

కరోనా వైరస్​ పరీక్షా​ సామగ్రి నాణ్యతను అంచనా వేసేందుకు ప్రైవేటు కంపెనీలకు కేంద్ర డ్రగ్స్​ కంట్రోలర్​​ జనరల్​ ఆఫ్​ ఇండియా(డీసీజీఐ) లైసెన్స్​లు ఇచ్చింది. తొలిదఫాలో 14 సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు సీడీఎస్​సీఓ అధికారులు వెల్లడించారు. మరికొన్నింటికి లైసెన్స్​లు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

14 ప్రైవేటు కంపెనీల్లో 13 భారత్​కు చెందినవి కాగా మరొకటి స్విస్​ సంస్థ రోచె డయాగ్నోస్టిక్ ఇండియా. భారత్​లోని వాటిలో అహ్మదాబాద్​కు చెందిన కోసారా డయాగ్నోస్టిక్స్, చెన్నైకి చెందిన సీపీసీ డయాగ్నోస్టిక్స్​లు ఉన్నాయి. ఈ సంస్థలు కొవిడ్​-19 పరీక్ష సామగ్రి నాణ్యతను అంచనా వేసి డీసీజీఐకి నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

"మరో ప్రైవేటు డయాగ్నోస్టిక్​ సంస్థ బయోమెరిక్స్​కు లైసెన్స్​​ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నాం. ఈ సంస్థతో పాటు మరో మూడు సంస్థలు అనుమతులు కోరాయి."

- సీడీఎస్​సీఓ అధికారి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రైవేటు ప్రయోగశాలలకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) వెల్లడించింది. అందులో భాగంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది డీసీజీఐ.​

ఇదీ చూడండి: దేశంలో విస్తరిస్తున్న కరోనా కేసులు- ఎక్కడికక్కడ బంద్!

కరోనా వైరస్​ పరీక్షా​ సామగ్రి నాణ్యతను అంచనా వేసేందుకు ప్రైవేటు కంపెనీలకు కేంద్ర డ్రగ్స్​ కంట్రోలర్​​ జనరల్​ ఆఫ్​ ఇండియా(డీసీజీఐ) లైసెన్స్​లు ఇచ్చింది. తొలిదఫాలో 14 సంస్థలకు అనుమతులు ఇచ్చినట్లు సీడీఎస్​సీఓ అధికారులు వెల్లడించారు. మరికొన్నింటికి లైసెన్స్​లు ఇచ్చేందుకు పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

14 ప్రైవేటు కంపెనీల్లో 13 భారత్​కు చెందినవి కాగా మరొకటి స్విస్​ సంస్థ రోచె డయాగ్నోస్టిక్ ఇండియా. భారత్​లోని వాటిలో అహ్మదాబాద్​కు చెందిన కోసారా డయాగ్నోస్టిక్స్, చెన్నైకి చెందిన సీపీసీ డయాగ్నోస్టిక్స్​లు ఉన్నాయి. ఈ సంస్థలు కొవిడ్​-19 పరీక్ష సామగ్రి నాణ్యతను అంచనా వేసి డీసీజీఐకి నివేదిక సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

"మరో ప్రైవేటు డయాగ్నోస్టిక్​ సంస్థ బయోమెరిక్స్​కు లైసెన్స్​​ ఇచ్చేందుకు పరిశీలిస్తున్నాం. ఈ సంస్థతో పాటు మరో మూడు సంస్థలు అనుమతులు కోరాయి."

- సీడీఎస్​సీఓ అధికారి

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్​ పరీక్షల సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రైవేటు ప్రయోగశాలలకు అనుమతులు మంజూరు చేయనున్నట్లు ఇటీవలే భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్​) వెల్లడించింది. అందులో భాగంగానే ఈ మేరకు నిర్ణయం తీసుకుంది డీసీజీఐ.​

ఇదీ చూడండి: దేశంలో విస్తరిస్తున్న కరోనా కేసులు- ఎక్కడికక్కడ బంద్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.