ETV Bharat / bharat

నాగ్​పుర్ సెంట్రల్ జైలులో 132 మంది ఖైదీలకు కరోనా

మహారాష్ట్రలోని నాగ్​పుర్​ కేంద్ర కారాగారంలో 132 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. కరోనా బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

author img

By

Published : Jul 10, 2020, 8:48 AM IST

132 inmates of Nagpur jail test positive for coronavirus
నాగ్​పూర్ సెంట్రల్ జైలులో 132 మంది ఖైదీలకు కరోనా

కరోనా మహమ్మారి మహారాష్ట్రలోని నాగ్​పుర్ కేంద్ర కారాగారాన్ని గడగడలాడిస్తోంది. తాజాగా అక్కడ 132 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీనితో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయిన ఖైదీల సంఖ్య 219కి చేరింది.

"యాంటిజెన్ పరీక్షల్లో 132 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వారిని కొవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం."

- అనూప్ కుమ్రే, జైలు సూపరింటెండెంట్​

'జైలులో మొత్తం 219 మంది కరోనా సోకింది. వారిలో 42 మందికి స్వాబ్​ శాంపుల్​ టెస్ట్​లు, మిగతావారికి యాంటిజెన్ టెస్టుల ద్వారా కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది' అని పోలీసులు తెలిపారు.

నాగ్​పుర్ సెంట్రల్ జైలులో 1800 మంది ఖైదీలు ఉండగా.. 265 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్​- చైనా మధ్య మరోసారి దౌత్య చర్చలు

కరోనా మహమ్మారి మహారాష్ట్రలోని నాగ్​పుర్ కేంద్ర కారాగారాన్ని గడగడలాడిస్తోంది. తాజాగా అక్కడ 132 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. దీనితో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయిన ఖైదీల సంఖ్య 219కి చేరింది.

"యాంటిజెన్ పరీక్షల్లో 132 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. ప్రస్తుతం వారిని కొవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాం."

- అనూప్ కుమ్రే, జైలు సూపరింటెండెంట్​

'జైలులో మొత్తం 219 మంది కరోనా సోకింది. వారిలో 42 మందికి స్వాబ్​ శాంపుల్​ టెస్ట్​లు, మిగతావారికి యాంటిజెన్ టెస్టుల ద్వారా కొవిడ్​ పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది' అని పోలీసులు తెలిపారు.

నాగ్​పుర్ సెంట్రల్ జైలులో 1800 మంది ఖైదీలు ఉండగా.. 265 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.

ఇదీ చూడండి: భారత్​- చైనా మధ్య మరోసారి దౌత్య చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.