ETV Bharat / bharat

నిర్బంధంలో 11 మంది కరోనా అనుమానితులు

రాజస్థాన్​ జైపూర్​లో కరోనా సోకిందనే అనుమానంతో 11 మందిని వైద్య నిర్బంధంలో ఉంచారు. వీరిలో నలుగురు విదేశీయులు. వీరంతా వైరస్​ వ్యాప్తి చెందిన దేశాలను సందర్శించినందున ప్రస్తుతం పర్యవేక్షణలో ఉంచినట్లు వైద్య అధికారులు తెలిపారు.

author img

By

Published : Mar 4, 2020, 5:38 AM IST

Updated : Mar 4, 2020, 6:57 AM IST

11 quarantined at Jaipur hospital, samples sent for testing coronavirus infection: Officials
జైపూర్​లో వైద్య నిర్బంధంలో 11మంది.. పరీక్షల నిర్వహణ

చైనాలో మొదలైన కరోనా ఇప్పుడు భారత్​లో ప్రభావం చూపిస్తోంది. దేశంలో నమోదైన కేసులు.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాజస్థాన్​ జైపూర్​లో నలుగురు విదేశీయులు సహా 11 మందిని వైద్య నిర్బంధంలో ఉంచారు అధికారులు. రాజస్థాన్​ వైద్య విశ్వవిద్యాలయంలో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీయుల్లో ఇద్దరు ఇటలీకి చెందినవారు కాగా.. ఇద్దరు హాంకాంగ్​, జపాన్ దేశాలవారు. ​మిగిలిన ఏడుగురు భారతీయులు.

విదేశీయులు వైరస్​ వ్యాప్తి చెందిన జపాన్​, ఆగ్నేయాసియా దేశాలను సందర్శించినట్లు తెలుస్తోంది. అయితే భారత్​కు చెందిన వారి ప్రయాణ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి వారికి వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని.. అయితే వైరస్​ వ్యాప్తి ఉన్న దేశాలను సందర్శించినందున వారిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఓ ఇటాలియన్​ జంటకు కరోనా వైరస్​ పాజిటివ్​ రాగా.. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

హిమాచల్​కు పాకిన వైరస్​

హిమాచల్​ప్రదేశ్​లో వైరస్​ లక్షణాలున్నట్లు అనుమానాలున్న ఓ వ్యక్తికి ఇందిరా గాంధీ అసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 32 ఏళ్ల ఈ వ్యక్తి కొద్దిరోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాను సందర్శించి వచ్చాడు.

చైనాలో మొదలైన కరోనా ఇప్పుడు భారత్​లో ప్రభావం చూపిస్తోంది. దేశంలో నమోదైన కేసులు.. ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తున్నాయి. రాజస్థాన్​ జైపూర్​లో నలుగురు విదేశీయులు సహా 11 మందిని వైద్య నిర్బంధంలో ఉంచారు అధికారులు. రాజస్థాన్​ వైద్య విశ్వవిద్యాలయంలో వారికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. విదేశీయుల్లో ఇద్దరు ఇటలీకి చెందినవారు కాగా.. ఇద్దరు హాంకాంగ్​, జపాన్ దేశాలవారు. ​మిగిలిన ఏడుగురు భారతీయులు.

విదేశీయులు వైరస్​ వ్యాప్తి చెందిన జపాన్​, ఆగ్నేయాసియా దేశాలను సందర్శించినట్లు తెలుస్తోంది. అయితే భారత్​కు చెందిన వారి ప్రయాణ వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి వారికి వైరస్ లక్షణాలేవీ కనిపించలేదని.. అయితే వైరస్​ వ్యాప్తి ఉన్న దేశాలను సందర్శించినందున వారిని వైద్య పర్యవేక్షణలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఓ ఇటాలియన్​ జంటకు కరోనా వైరస్​ పాజిటివ్​ రాగా.. వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు.

హిమాచల్​కు పాకిన వైరస్​

హిమాచల్​ప్రదేశ్​లో వైరస్​ లక్షణాలున్నట్లు అనుమానాలున్న ఓ వ్యక్తికి ఇందిరా గాంధీ అసుపత్రిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 32 ఏళ్ల ఈ వ్యక్తి కొద్దిరోజులుగా గొంతు నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈయన ఫిబ్రవరి 29న దక్షిణ కొరియాను సందర్శించి వచ్చాడు.

Last Updated : Mar 4, 2020, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.