ETV Bharat / bharat

'బిహార్​ తొలి దశ పోలింగ్​కు 1,090 నామపత్రాల చెల్లుబాటు'

author img

By

Published : Oct 10, 2020, 11:12 PM IST

బిహార్​లో తొలి దశ ఎన్నికలకు ఇటీవలే నామినేషన్​ పత్రాల ప్రక్రియ ముగిసింది. మొత్తం 1,354మంది నామపత్రాలు సమర్పించగా.. 1,090 చెల్లుబాటు అయినట్టు అధికారులు వెల్లడించారు. అయితే సోమవారంతో నామినేషన్​ ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. ఆ తర్వాతే అభ్యర్థుల జాబితాను ఖరారు చేయగలమని పేర్కొన్నారు.

1,090 nomination papers found valid for 1st phase of Bihar Assembly polls
బిహార్​ తొలి దశ పోలింగ్​కు 1,090 నామపత్రాల చెల్లుబాటు

బిహార్​ ఎన్నికల్లో భాగంగా.. ఈ నెల 28న 71 స్థానాలకు తొలి దఫా పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం నామినేషన్​ ప్రక్రియ ఇటీవలే ముగిసింది. తాజాగా.. 1,090 అభ్యర్థుల నామినేషన్​ పత్రాలు చెల్లుబాటు అవుతాయని అధికారులు వెల్లడించారు.

అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం గడువు ఉంది. అందువల్ల ఆ తర్వాతే అభ్యర్థుల సంఖ్యను ఖరారు చేయగలుగుతామని అదనపు ముఖ్య ఎన్నికల అధికరి సంజయ్​ కుమర్​ సింగ్​ తెలిపారు.

మొత్తం 1,354మంది నామపత్రాలు దాఖలు చేయగా.. వీటిలో 264 చెల్లవని సంజయ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- బిహార్​ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్​ అగ్రనేతలు

కరోనా సంక్షోభం నేపథ్యంలో.. తొలిసారిగా ఆన్​లైన్​లో నామపత్రాలను సమర్పించేందుకు అనుమతినిచ్చింది ఈసీ. అయితే కేవలం 10మంది ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నారు.

రెండో దఫా పోలింగ్​లో భాగంగా.. ఈ నెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామపత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్​ పత్రాలను ఉపసంహరించుకునేందుకు చివరి గడువు అక్టోబర్​ 19. నవంబర్​ 3న 94 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

మిగిలిన స్థానాలకు నవంబర్​ 7న ఎన్నికలు జరగనున్నాయి. 10న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

భారీగా ఆయుధాలు స్వాధీనం...

ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,022 అక్రమ ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15,335 లైసెన్సులున్న ఆయుధాలను డిపాజిట్​ చేశారు. మరో 1,862 ఆయుధాల లైసెన్సును వివిధ కారణాలతో రద్దు చేశారు.

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,90,792 లీటర్ల మద్యాన్ని జప్తు చేశారు. బిహార్​లో మద్యంపై నిషేధం ఉండటం గమనార్హం. వివిధ చెక్​పోస్టుల్లో వాహనాల తనిఖీల రూపంలో రూ. 14.63 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:- కరోనా కారణంగా బిహార్​ ఎన్నికల రూల్స్​లో మార్పు

బిహార్​ ఎన్నికల్లో భాగంగా.. ఈ నెల 28న 71 స్థానాలకు తొలి దఫా పోలింగ్​ జరగనుంది. ఇందుకోసం నామినేషన్​ ప్రక్రియ ఇటీవలే ముగిసింది. తాజాగా.. 1,090 అభ్యర్థుల నామినేషన్​ పత్రాలు చెల్లుబాటు అవుతాయని అధికారులు వెల్లడించారు.

అయితే.. నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం గడువు ఉంది. అందువల్ల ఆ తర్వాతే అభ్యర్థుల సంఖ్యను ఖరారు చేయగలుగుతామని అదనపు ముఖ్య ఎన్నికల అధికరి సంజయ్​ కుమర్​ సింగ్​ తెలిపారు.

మొత్తం 1,354మంది నామపత్రాలు దాఖలు చేయగా.. వీటిలో 264 చెల్లవని సంజయ్​ పేర్కొన్నారు.

ఇదీ చూడండి:- బిహార్​ ఎన్నికల ప్రచారాల్లో కాంగ్రెస్​ అగ్రనేతలు

కరోనా సంక్షోభం నేపథ్యంలో.. తొలిసారిగా ఆన్​లైన్​లో నామపత్రాలను సమర్పించేందుకు అనుమతినిచ్చింది ఈసీ. అయితే కేవలం 10మంది ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకున్నారు.

రెండో దఫా పోలింగ్​లో భాగంగా.. ఈ నెల 16 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. 17న నామపత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్​ పత్రాలను ఉపసంహరించుకునేందుకు చివరి గడువు అక్టోబర్​ 19. నవంబర్​ 3న 94 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి.

మిగిలిన స్థానాలకు నవంబర్​ 7న ఎన్నికలు జరగనున్నాయి. 10న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

భారీగా ఆయుధాలు స్వాధీనం...

ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,022 అక్రమ ఆయుధాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 15,335 లైసెన్సులున్న ఆయుధాలను డిపాజిట్​ చేశారు. మరో 1,862 ఆయుధాల లైసెన్సును వివిధ కారణాలతో రద్దు చేశారు.

ఎన్నికల నేపథ్యంలో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 8,90,792 లీటర్ల మద్యాన్ని జప్తు చేశారు. బిహార్​లో మద్యంపై నిషేధం ఉండటం గమనార్హం. వివిధ చెక్​పోస్టుల్లో వాహనాల తనిఖీల రూపంలో రూ. 14.63 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి:- కరోనా కారణంగా బిహార్​ ఎన్నికల రూల్స్​లో మార్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.