ETV Bharat / bharat

పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

ఒడిశాలో ప్రసిద్ధ పూరీ జగన్నాథ రథయాత్ర నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ్టి నుంచి 9 రోజుల పాటు జరగనున్న వేడుకలకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం.

author img

By

Published : Jul 4, 2019, 5:25 AM IST

Updated : Jul 4, 2019, 8:03 AM IST

పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం
పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశా సర్వం సిద్ధమైంది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

సర్వాంగ సుందరంగా అలంకరించిన మూడు భారీ రథాల్లో శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలు ఊరేగనున్నారు. వారం రోజుల ఆతిథ్యం అనంతరం.. దశమినాడు తిరుగు ప్రయాణమవుతారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని బయటే ఉండిపోతాయి.

మరుసటి ఏకాదశి రోజున దేవతామూర్తులను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి రోజున విగ్రహాలను తిరిగి గర్భగుడిలోని రత్న సింహాసనంపైకి చేర్చితే యాత్ర సమాప్తమవుతుంది.

పటిష్ఠ భద్రత...

సుమారు 10 లక్షల మంది భక్తులు ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ జగన్నాథ రథయాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం.

సుమారు 10 వేల మంది పోలీసులను రథయాత్ర కోసం మోహరించారు. తీర ప్రాంత భద్రతా దళాన్ని అప్రమత్తం చేశారు. పూరీకి వచ్చే వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

పూరీ జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధం

విశ్వవిఖ్యాత పూరీ జగన్నాథ రథయాత్రకు ఒడిశా సర్వం సిద్ధమైంది. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

సర్వాంగ సుందరంగా అలంకరించిన మూడు భారీ రథాల్లో శ్రీకృష్ణ, బలరామ, సుభద్రలు ఊరేగనున్నారు. వారం రోజుల ఆతిథ్యం అనంతరం.. దశమినాడు తిరుగు ప్రయాణమవుతారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ ఆలయానికి చేరుకొని బయటే ఉండిపోతాయి.

మరుసటి ఏకాదశి రోజున దేవతామూర్తులను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. ద్వాదశి రోజున విగ్రహాలను తిరిగి గర్భగుడిలోని రత్న సింహాసనంపైకి చేర్చితే యాత్ర సమాప్తమవుతుంది.

పటిష్ఠ భద్రత...

సుమారు 10 లక్షల మంది భక్తులు ఉత్సవాలకు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. ఈ జగన్నాథ రథయాత్రకు ఉగ్ర ముప్పు పొంచి ఉందని నిఘా సంస్థలు హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది ఒడిశా ప్రభుత్వం.

సుమారు 10 వేల మంది పోలీసులను రథయాత్ర కోసం మోహరించారు. తీర ప్రాంత భద్రతా దళాన్ని అప్రమత్తం చేశారు. పూరీకి వచ్చే వాహనాలు అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు.

AP Video Delivery Log - 1800 GMT Horizons
Wednesday, 3 July, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1650: HZ Syria UNESCO AP Clients Only 4218816
Syria's UNESCO World Heritage remains 'in danger'
AP-APTN-1627: HZ Germany Tech Festival AP Clients Only 4218827
Tech gurus share ideas at Berlin Festival
AP-APTN-1627: HZ Ukraine Heatwave AP Clients Only 4218840
Animals seek respite from summer weather
AP-APTN-0933: HZ World Moon Landing Down to Earth AP Clients Only/ see shotlist 4218758
Astronauts treated to hero's welcome on return to Earth
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Jul 4, 2019, 8:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.