ETV Bharat / bharat

బంగాల్​ మంత్రిపై బాంబు దాడి

author img

By

Published : Feb 17, 2021, 10:59 PM IST

Updated : Feb 18, 2021, 7:52 AM IST

jakir-hossain
బంగాల్​ మంత్రిపై బాంబు దాడి

22:57 February 17

బంగాల్​ మంత్రిపై బాంబు దాడి

  • #WATCH: WB Minister Jakir Hossain injured after unidentified persons hurled a bomb at him at Nimtita railway station, Murshidabad y'day.

    Murshidabad Medical College Superintendent says that he's stable & out of danger, one hand & leg injured.

    (Amateur video, source unconfirmed) pic.twitter.com/ih7DLHAWLq

    — ANI (@ANI) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంగాల్​ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జాకిర్​ హుస్సేన్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ముర్షిదాబాద్​ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు చెప్పారు. కోల్​కతా వెళ్లేందుకు నిమ్​టిటా స్టేషన్​ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనపై బాంబులు వేసినట్లు తెలిపారు.  గాయపడిన మంత్రిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జాంగిపుర్​ సబ్​ డివిజనల్​ ఆసుపత్రికి మార్చారు.  

పార్టీ వర్గాల సమాచారం మేరకు మంత్రి కాలికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జాంగిపుర్​ ఆసుపత్రి నుంచి ముర్షిదాబాద్​ వైద్య కళాశాలకు తరలించినట్లు చెప్పారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు సైతం గాయపడినట్లు తెలిపారు.  

బాంబు దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.  

జాకిర్​పై దాడిని పార్టీ జిల్లా అధ్యక్షుడు అబు తాహెర్​ ఖండించారు. ఆయన రాష్ట్ర మంత్రి మాత్రమే కాదని, జిల్లాలో మంచి పారిశ్రామికవేత్తగా తెలిపారు. అయితే.. ఈ దాడికి పాల్పడింది ఎవరనే తెలియలేదని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

22:57 February 17

బంగాల్​ మంత్రిపై బాంబు దాడి

  • #WATCH: WB Minister Jakir Hossain injured after unidentified persons hurled a bomb at him at Nimtita railway station, Murshidabad y'day.

    Murshidabad Medical College Superintendent says that he's stable & out of danger, one hand & leg injured.

    (Amateur video, source unconfirmed) pic.twitter.com/ih7DLHAWLq

    — ANI (@ANI) February 18, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

బంగాల్​ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి జాకిర్​ హుస్సేన్​పై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో మంత్రికి తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ముర్షిదాబాద్​ జిల్లాలో ఓ కార్యక్రమానికి హాజరై ఇంటికి తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగినట్లు చెప్పారు. కోల్​కతా వెళ్లేందుకు నిమ్​టిటా స్టేషన్​ వైపు నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో ఆయనపై బాంబులు వేసినట్లు తెలిపారు.  గాయపడిన మంత్రిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి జాంగిపుర్​ సబ్​ డివిజనల్​ ఆసుపత్రికి మార్చారు.  

పార్టీ వర్గాల సమాచారం మేరకు మంత్రి కాలికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. జాంగిపుర్​ ఆసుపత్రి నుంచి ముర్షిదాబాద్​ వైద్య కళాశాలకు తరలించినట్లు చెప్పారు. ఆయనతో పాటు పలువురు అనుచరులు సైతం గాయపడినట్లు తెలిపారు.  

బాంబు దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియరాలేదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు.  

జాకిర్​పై దాడిని పార్టీ జిల్లా అధ్యక్షుడు అబు తాహెర్​ ఖండించారు. ఆయన రాష్ట్ర మంత్రి మాత్రమే కాదని, జిల్లాలో మంచి పారిశ్రామికవేత్తగా తెలిపారు. అయితే.. ఈ దాడికి పాల్పడింది ఎవరనే తెలియలేదని, దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

Last Updated : Feb 18, 2021, 7:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.