ETV Bharat / bharat

బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​ కేసులో అరిజ్​ ఖాన్​ దోషి

author img

By

Published : Mar 8, 2021, 5:17 PM IST

Updated : Mar 8, 2021, 5:23 PM IST

దేశంలో 12 ఏళ్ల క్రితం తీవ్ర కలకలం రేపిన బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్ కేసులో ఇండియన్​ ముజాహిదీన్​కు చెందిన వ్యక్తి దోషిగా తేలాడు. ఈ కేసులో ఇన్​స్పెక్టర్​ మోహన్​ చంద్​ శర్మను.. అరిజ్​​ ఖాన్​ హత్య చేసినట్టు సాక్ష్యాధారాలతో రుజువైందని కోర్టు పేర్కొంది.

Delhi court finds Ariz Khan guilty in Batla House encounter case
బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​లో దోషిగా అరిజ్ ఖాన్

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్'​ కేసులో ఇండియన్​ ముజాహిదీన్​ వ్యక్తిని దోషిగా తేల్చింది దిల్లీ కోర్టు. 2008లో జరిగిన ఈ ఘటనలో ఇన్​స్పెక్టర్​ మోహన్​ చంద్​ శర్మ(ఎంసీ శర్మ)ను అరిజ్​ ఖాన్​, అతని సహచరులు హత్యచేసినట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్​ యాదవ్​ తెలిపారు. అయితే.. నిందితుడికి ఏ శిక్ష వేయాలనేదానిపై ఈ నెల 15న విచారణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ కేసు..

2008లో.. దిల్లీలో ఇండియన్​ ముజాహిదీన్​ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. జామియా నగర్​లోని బాట్లా హౌస్​ ప్రాంతంలో దిల్లీ పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడం వల్ల.. ఇన్​స్పెక్టర్​ ఎంసీ శర్మ అమరుడయ్యారు. అనంతరం.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే.. ఈ కేసుతో సంబంధమున్న​ ఉగ్రవాది షాజాద్​ అహ్మద్​కు.. 2013 జులైలో జీవిత ఖైదు విధించింది ట్రయల్​ కోర్టు. ఆ తర్వాత.. 2018లో ప్రధాన నిందితుడు అరిజ్​ఖాన్​ను అరెస్ట్​ చేశారు దిల్లీ పోలీసులు.

ఇదీ చదవండి: 23 ఏళ్ల తర్వాత మళ్లీ యుద్ధనౌకల్లో నారీ శక్తి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 'బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్'​ కేసులో ఇండియన్​ ముజాహిదీన్​ వ్యక్తిని దోషిగా తేల్చింది దిల్లీ కోర్టు. 2008లో జరిగిన ఈ ఘటనలో ఇన్​స్పెక్టర్​ మోహన్​ చంద్​ శర్మ(ఎంసీ శర్మ)ను అరిజ్​ ఖాన్​, అతని సహచరులు హత్యచేసినట్టు సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని అదనపు సెషన్స్ న్యాయమూర్తి సందీప్​ యాదవ్​ తెలిపారు. అయితే.. నిందితుడికి ఏ శిక్ష వేయాలనేదానిపై ఈ నెల 15న విచారణ చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.

ఇదీ కేసు..

2008లో.. దిల్లీలో ఇండియన్​ ముజాహిదీన్​ సంస్థకు చెందిన ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో.. జామియా నగర్​లోని బాట్లా హౌస్​ ప్రాంతంలో దిల్లీ పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులపై ఉగ్రవాదులు ఎదురుకాల్పులకు దిగడం వల్ల.. ఇన్​స్పెక్టర్​ ఎంసీ శర్మ అమరుడయ్యారు. అనంతరం.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.

అయితే.. ఈ కేసుతో సంబంధమున్న​ ఉగ్రవాది షాజాద్​ అహ్మద్​కు.. 2013 జులైలో జీవిత ఖైదు విధించింది ట్రయల్​ కోర్టు. ఆ తర్వాత.. 2018లో ప్రధాన నిందితుడు అరిజ్​ఖాన్​ను అరెస్ట్​ చేశారు దిల్లీ పోలీసులు.

ఇదీ చదవండి: 23 ఏళ్ల తర్వాత మళ్లీ యుద్ధనౌకల్లో నారీ శక్తి

Last Updated : Mar 8, 2021, 5:23 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.