ETV Bharat / bharat

Barnala Policeman Murder : రెస్టారెంట్​ బిల్లు విషయంలో గొడవ.. కారులో కూర్చోమన్న పోలీసుపై దాడి చేసి హత్య.. నిందితుల్లో ఇంటర్నేషనల్​ కబడ్డీ ప్లేయర్స్!​

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2023, 10:32 AM IST

Updated : Oct 23, 2023, 11:38 AM IST

Barnala Policeman Murder : ఓ రెస్టారెంట్​లో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేందుకు అక్కడకు వెళ్లిన ఓ పోలీసు కానిస్టేబుల్​ను హత్య చేశారు దుండగులు. అయితే ఈ దారుణానికి ఒడిగట్టింది అంతర్జాతీయ కబడ్డీ ఆటగాళ్లే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పంజాబ్​లో ఈ దారుణం జరిగింది. మరోవైపు ప్రియుడితో కలిసి పారిపోయిందన్న కారణంతో సొంత కూతుర్నే హత్య చేశాడు ఓ తండ్రి. కర్ణాటకలో జరిగిందీ ఘటన.

Barnala Policeman Murder
Barnala Policeman Murder

Barnala Policeman Murder : గొడవ జరుగుతుందన్న సమాచారంతో రెస్టారెంట్​కు వెళ్లిన ఓ పోలీసు కానిస్టేబుల్​ను అతి దారుణంగా కొట్టి చంపారు దుండగులు. అయితే ఈ హత్య చేసింది అంతర్జాతీయ కబడ్డీ ఆటగాళ్లే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన పంజాబ్​లోని బర్నాలా జిల్లాలో ఆదివారం రాత్రి జరిపింది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు(పోలీసు) దర్శన్ సింగ్ కొన్నేళ్లుగా బర్నాలా జిల్లాలోని ఠాణా నగరంలో పోలీసు కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు ఆదివారం అర్ధరాత్రి కొందరు కబడ్డీ ఆటగాళ్లు వెళ్లారు. అక్కడే పని చేస్తున్న కొంతమంది కార్మికులతో పాటు యజమానితో బిల్లు విషయంలో వారు గొడవకు దిగారు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. కానిస్టేబుల్​ దర్శన్​ సింగ్​తో పాటు మరో పోలీసు​ను రెస్టారెంట్​కు పంపించారు. రెస్టారెంట్​కు చేరుకున్న పోలీసులు ఘర్షణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కబడ్డీ ప్లేయర్స్​ను పోలీసు వాహనంలో కూర్చొవాల్సిందిగా చెప్పారు.

ఈ క్రమంలో దర్శన్​ సింగ్​తో వాగ్వాదానికి దిగిన ఆటగాళ్లు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి హుటాహుటిన కానిస్టేబుల్​ను జిల్లాలోని సివిల్​ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ దర్శన్​ సింగ్​ చికిత్స పొందుతూ మృతి చెందారు. కానిస్టేబుల్​పై దాడి చేసిన అనంతరం రెస్టారెంట్​ను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పరారయ్యారని ప్రత్యక్ష సాక్షి సరబ్‌జిత్ సింగ్​ చెబుతున్నాడు. ఇక వీరంతా ఇంటర్నేషనల్​​ కబడ్డీ ప్లేయర్స్​ అని తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కర్ణాటకలో పరువు హత్య..!
Honor Killing In Karnataka Bangalore : ప్రియుడితో కలిసి పారిపోయినందుకు కన్నకూతుర్నే హత్య చేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో శనివారం జరిగింది.

పోలీసులు కథనం ప్రకారం..
మైసూరులోని హెచ్‌డీకోటేకు చెందిన పల్లవి అనే యువతి ఇంటికి దగ్గర్లోని ఓ కళాశాలలో పీయూసీ చదువుతోంది. ఇదే కాలేజీలో చదువుతున్న ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం పల్లవి తండ్రి గణేశ్​కు తెలిసి ఇద్దరిని పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇటీవలే వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఎట్టకేలకు బంధువుల సాయంతో యువతిని ఇంటికి రప్పించారు గణేశ్​ దంపతులు. చదువు మాన్పించి పరప్పన అగ్రహారంలోని డాక్టర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న బంధువుల ఇంట్లో కుమార్తెను ఉంచాడు గణేశ్. అయినా సరే తీరు మార్చుకొని యువతి ప్రియుడిని మళ్లీ సంప్రదించింది. ఈ నెల 14న మళ్లీ అతడితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి గణేశ్​ సమీప పోలీస్​ స్టేషన్​లో పల్లవిపై మిస్సింగ్​ కేసును పెట్టాడు. వెంటనే ఆపరేషన్​ చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే యువతిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇదిలా ఉంటే అక్టోబర్​ 21 శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్లవిపై దాడి చేశాడు తండ్రి గణేశ్​. అడ్డొచ్చిన తల్లి శారదమ్మ, బంధువులను దూషించాడు. ఈ ఘర్షణలో యువతికి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. వెంటనే నిందితుడు గణేశ్​ పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పల్లవిని కొట్టి చంపింది తానేనని పోలీసులు ముందు అంగీకరించాడు. ఈ ఘటనపై పల్లవి అత్త గీత ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి గణేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

Imprisonment To Retired Officers : 20ఏళ్ల క్రితం​ రూ.170 లంచం!.. ముగ్గురు రిటైర్డ్​ ఉద్యోగులకు 4 ఏళ్లు జైలు శిక్ష

Muslim family Durga Puja in Assam : దుర్గామాతకు ముస్లిం కుటుంబం పూజలు. 300 ఏళ్లుగా ఇదే సంప్రదాయం.. ఎక్కడంటే?

Barnala Policeman Murder : గొడవ జరుగుతుందన్న సమాచారంతో రెస్టారెంట్​కు వెళ్లిన ఓ పోలీసు కానిస్టేబుల్​ను అతి దారుణంగా కొట్టి చంపారు దుండగులు. అయితే ఈ హత్య చేసింది అంతర్జాతీయ కబడ్డీ ఆటగాళ్లే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ఘటన పంజాబ్​లోని బర్నాలా జిల్లాలో ఆదివారం రాత్రి జరిపింది.

పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం..
మృతుడు(పోలీసు) దర్శన్ సింగ్ కొన్నేళ్లుగా బర్నాలా జిల్లాలోని ఠాణా నగరంలో పోలీసు కానిస్టేబుల్​గా విధులు నిర్వర్తిస్తున్నారు. నగరంలో 25 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు ఆదివారం అర్ధరాత్రి కొందరు కబడ్డీ ఆటగాళ్లు వెళ్లారు. అక్కడే పని చేస్తున్న కొంతమంది కార్మికులతో పాటు యజమానితో బిల్లు విషయంలో వారు గొడవకు దిగారు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. కానిస్టేబుల్​ దర్శన్​ సింగ్​తో పాటు మరో పోలీసు​ను రెస్టారెంట్​కు పంపించారు. రెస్టారెంట్​కు చేరుకున్న పోలీసులు ఘర్షణకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కబడ్డీ ప్లేయర్స్​ను పోలీసు వాహనంలో కూర్చొవాల్సిందిగా చెప్పారు.

ఈ క్రమంలో దర్శన్​ సింగ్​తో వాగ్వాదానికి దిగిన ఆటగాళ్లు అతడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి హుటాహుటిన కానిస్టేబుల్​ను జిల్లాలోని సివిల్​ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ దర్శన్​ సింగ్​ చికిత్స పొందుతూ మృతి చెందారు. కానిస్టేబుల్​పై దాడి చేసిన అనంతరం రెస్టారెంట్​ను కూడా ధ్వంసం చేసి అక్కడి నుంచి ముగ్గురు నిందితులు పరారయ్యారని ప్రత్యక్ష సాక్షి సరబ్‌జిత్ సింగ్​ చెబుతున్నాడు. ఇక వీరంతా ఇంటర్నేషనల్​​ కబడ్డీ ప్లేయర్స్​ అని తెలుస్తోంది. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కర్ణాటకలో పరువు హత్య..!
Honor Killing In Karnataka Bangalore : ప్రియుడితో కలిసి పారిపోయినందుకు కన్నకూతుర్నే హత్య చేశాడు ఓ తండ్రి. ఈ దారుణ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో శనివారం జరిగింది.

పోలీసులు కథనం ప్రకారం..
మైసూరులోని హెచ్‌డీకోటేకు చెందిన పల్లవి అనే యువతి ఇంటికి దగ్గర్లోని ఓ కళాశాలలో పీయూసీ చదువుతోంది. ఇదే కాలేజీలో చదువుతున్న ఓ యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ విషయం పల్లవి తండ్రి గణేశ్​కు తెలిసి ఇద్దరిని పలుమార్లు హెచ్చరించాడు. ఈ క్రమంలో ఇటీవలే వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. ఎట్టకేలకు బంధువుల సాయంతో యువతిని ఇంటికి రప్పించారు గణేశ్​ దంపతులు. చదువు మాన్పించి పరప్పన అగ్రహారంలోని డాక్టర్స్‌ కాలనీలో నివాసం ఉంటున్న బంధువుల ఇంట్లో కుమార్తెను ఉంచాడు గణేశ్. అయినా సరే తీరు మార్చుకొని యువతి ప్రియుడిని మళ్లీ సంప్రదించింది. ఈ నెల 14న మళ్లీ అతడితో కలిసి పారిపోయింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి గణేశ్​ సమీప పోలీస్​ స్టేషన్​లో పల్లవిపై మిస్సింగ్​ కేసును పెట్టాడు. వెంటనే ఆపరేషన్​ చేపట్టిన పోలీసులు రెండు రోజుల్లోనే యువతిని వెతికి తల్లిదండ్రులకు అప్పగించారు.

ఇదిలా ఉంటే అక్టోబర్​ 21 శనివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో పల్లవిపై దాడి చేశాడు తండ్రి గణేశ్​. అడ్డొచ్చిన తల్లి శారదమ్మ, బంధువులను దూషించాడు. ఈ ఘర్షణలో యువతికి తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో ఆమె శనివారం అర్ధరాత్రి మృతి చెందింది. వెంటనే నిందితుడు గణేశ్​ పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పల్లవిని కొట్టి చంపింది తానేనని పోలీసులు ముందు అంగీకరించాడు. ఈ ఘటనపై పల్లవి అత్త గీత ఫిర్యాదు మేరకు హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి గణేశ్​ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

Imprisonment To Retired Officers : 20ఏళ్ల క్రితం​ రూ.170 లంచం!.. ముగ్గురు రిటైర్డ్​ ఉద్యోగులకు 4 ఏళ్లు జైలు శిక్ష

Muslim family Durga Puja in Assam : దుర్గామాతకు ముస్లిం కుటుంబం పూజలు. 300 ఏళ్లుగా ఇదే సంప్రదాయం.. ఎక్కడంటే?

Last Updated : Oct 23, 2023, 11:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.