ETV Bharat / bharat

రామ మందిర శకటం.. అత్యుత్తమం - అయోధ్య రామ మందిర శకటం

రిపబ్లిక్ డే పరేడ్​లో పాల్గొన్న శకటాలకు పురస్కారాలు ప్రకటించింది కేంద్రం. అయోధ్య రామ మందిర నమూనాతో రూపొందిన ఉత్తర్​ప్రదేశ్ శకటానికి ప్రథమ అవార్డు దక్కింది. త్రిపుర, ఉత్తరాఖండ్ శకటాలకు ద్వితియ, తృతియ పురస్కారాలు వరించాయి.

ayodhya tableau got first prize among republic day parade tableau's by central govt
రామ మందిర శకటం.. అత్యుత్తమం
author img

By

Published : Jan 29, 2021, 5:33 AM IST

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కవాతులో 32 శకటాలు పాల్గొనగా ఉత్తర్​ప్రదేశ్ శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామ మందిర నమూనాతో పాటు ఆ పవిత్ర నగర సాంస్కృతిక వారసత్వాన్ని, దీపోత్సవ ప్రాముఖ్యతను, రామాయణంలోని కీలక ఘట్టాలను తెలియజెప్పేలా రూపొందించిన ఆ శకటాన్ని ఉత్తమ శకటంగా కేంద్రం ఎంపిక చేసింది.

ఇదీ చదవండి: పరేడ్​లో ప్రత్యేక ఆకర్షణగా 'అయోధ్య' శకటం

త్రిపుర రాష్ట్ర శకటానికి ద్వితీయ పురస్కారం లభించింది. సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆత్మనిర్భర భారత్​ను సాధించేందుకు పర్యావరణ అనుకూల సంప్రదాయాల ఆచరణను ప్రోత్సహించేలా ఈ శకటాన్ని రూపొందించారు. 'దేవతల భూమి' థీమ్ రూపకల్పన చేసిన ఉత్తరాఖండ్ శకటానికి తృతీయ పురస్కారం లభించింది. ఈమేరకు గురువారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పురస్కారాలు అందజేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాల సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కవాతులో 32 శకటాలు పాల్గొనగా ఉత్తర్​ప్రదేశ్ శకటానికి ప్రథమ పురస్కారం లభించింది. అయోధ్య రామ మందిర నమూనాతో పాటు ఆ పవిత్ర నగర సాంస్కృతిక వారసత్వాన్ని, దీపోత్సవ ప్రాముఖ్యతను, రామాయణంలోని కీలక ఘట్టాలను తెలియజెప్పేలా రూపొందించిన ఆ శకటాన్ని ఉత్తమ శకటంగా కేంద్రం ఎంపిక చేసింది.

ఇదీ చదవండి: పరేడ్​లో ప్రత్యేక ఆకర్షణగా 'అయోధ్య' శకటం

త్రిపుర రాష్ట్ర శకటానికి ద్వితీయ పురస్కారం లభించింది. సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆత్మనిర్భర భారత్​ను సాధించేందుకు పర్యావరణ అనుకూల సంప్రదాయాల ఆచరణను ప్రోత్సహించేలా ఈ శకటాన్ని రూపొందించారు. 'దేవతల భూమి' థీమ్ రూపకల్పన చేసిన ఉత్తరాఖండ్ శకటానికి తృతీయ పురస్కారం లభించింది. ఈమేరకు గురువారం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పురస్కారాలు అందజేసినట్లు రక్షణ శాఖ ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.