ETV Bharat / bharat

జస్టిస్ కట్జూపై కోర్టు ధిక్కరణ- వైదొలగిన అటార్నీ జనరల్

author img

By

Published : Mar 31, 2021, 6:19 AM IST

Updated : Mar 31, 2021, 9:26 AM IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూపై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించే వ్యవహారం నుంచి వైదొలగుతున్నట్లు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు. జస్టిస్ కట్జూతో తనకు 16 ఏళ్లకు పైగా పరిచయం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Contempt of court against Justice Katju.
జస్టిస్ కట్జూపై కోర్టు ధిక్కరణ

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూపై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించే వ్యవహారం నుంచి తాను వైదొలగుతున్నట్లు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు. అనుమతి విషయాన్ని సొలిసిటర్ జనరల్ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్​ మోదీని భారత్​కు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టులో విచారణ సందర్భంగానూ, ఆ తర్వాతా మనదేశ సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా జస్టిస్ కట్జూ వ్యాఖ్యలు చేశారని, ఇందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అనుమతించాలని కోరుతూ అటార్నీ జనరల్​కు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మార్చి1న పిటిషన్ సమర్పించారు.

కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ ఆమోదం అవసరం. అయితే, జస్టిస్ కట్జూతో తనకు 16 ఏళ్లకు పైగా పరిచయం ఉందని, తరచూ తామిద్దరం అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటామని శ్రీవాస్తవకు రాసిన లేఖలో కె.కె.వేణుగోపాల్ తెలిపారు. అందువల్ల ఈ అనుమతి వ్యవహారం నుంచి తాను వైదొలగుతున్నానని, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 12మంది సిమి సభ్యులకు జీవితఖైదు

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మార్కండేయ కట్జూపై కోర్టు ధిక్కరణ చర్యలకు అనుమతించే వ్యవహారం నుంచి తాను వైదొలగుతున్నట్లు అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ తెలిపారు. అనుమతి విషయాన్ని సొలిసిటర్ జనరల్ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం కేసులో నిందితుడు నీరవ్​ మోదీని భారత్​కు అప్పగించే విషయమై బ్రిటన్ కోర్టులో విచారణ సందర్భంగానూ, ఆ తర్వాతా మనదేశ సర్వోన్నత న్యాయస్థానానికి వ్యతిరేకంగా జస్టిస్ కట్జూ వ్యాఖ్యలు చేశారని, ఇందుకు గాను ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అనుమతించాలని కోరుతూ అటార్నీ జనరల్​కు న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ మార్చి1న పిటిషన్ సమర్పించారు.

కోర్టు ధిక్కరణ కేసు నమోదుకు అటార్నీ జనరల్ లేదా సొలిసిటర్ జనరల్ ఆమోదం అవసరం. అయితే, జస్టిస్ కట్జూతో తనకు 16 ఏళ్లకు పైగా పరిచయం ఉందని, తరచూ తామిద్దరం అనేక విషయాలు చర్చించుకుంటూ ఉంటామని శ్రీవాస్తవకు రాసిన లేఖలో కె.కె.వేణుగోపాల్ తెలిపారు. అందువల్ల ఈ అనుమతి వ్యవహారం నుంచి తాను వైదొలగుతున్నానని, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు దరఖాస్తు చేసుకోవాలని శ్రీవాస్తవకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 12మంది సిమి సభ్యులకు జీవితఖైదు

Last Updated : Mar 31, 2021, 9:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.