కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న నేపథ్యంలో కొవిడ్ నెగెటివ్ రిపోర్టు ఉంటేనే కొన్ని దేశాలు, రాష్ట్రాలు ప్రయాణికుల్ని.. అనుమతిస్తున్నాయి. కానీ ఉత్తరాఖండ్, హరిద్వార్కు చెందిన ఓ కాబోయే జంట.. తమ వివాహానికి రావాలంటే బంధువులకు ఆర్టీ- పీసీఆర్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేసింది. వివాహ ఆహ్వాన పత్రికపై ఇది ముద్రించడమే విశేషం. ఈ విషయంపై పలువురు ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్నారు.
హరిద్వార్కు చెందిన వరుడు విజయ్.. రాజస్థాన్లోని జైపుర్కు చెందిన వధువు వైశాలి ఈ నెల 24న ఒక్కటికానున్నారు. ఈ నేపథ్యంలో కరోనా నిబంధనలను పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించేందుకే ఇలా చేశామని చెబుతున్నారు.
''మేం విహహ పత్రికలు పంచడానికి ముందే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా కొత్త నిబంధనలను జారీ చేశాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు వివాహం చేసుకోవాలనుకుంటున్నాం.''
-విజయ్, వరుడు
వివాహ వేడుక-135 మందికి పాజిటివ్
ఛత్తీస్గఢ్లోని జాంజ్గీర్- చంపా జిల్లాలో ఓ వివాహ వేడుక.. కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అయింది. అందులో పాల్గొన్న 135 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. 400 మందికి పైగానే ఆ వేడుకలో పాల్గొన్నారు. పాజిటివ్గా తేలినవారిని గృహ నిర్బంధంలో ఉంచారు అధికారులు.
ఛత్తీస్గఢ్లో రోజూ సగటున 10 వేలకుపైనే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి.
ఇదీ చదవండి: 'కుంభమేళాలో భక్తుల సంఖ్య పరిమితంగా ఉండాలి'
ఇదీ చదవండి: 'రైతు ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాల ఏర్పాటు!'