ETV Bharat / bharat

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణలో ఆ ఎంపీపై కేసు

author img

By

Published : Jul 29, 2021, 4:09 PM IST

Updated : Jul 29, 2021, 4:46 PM IST

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణకు సంబంధించిన వ్యవహారంలో మిజోరం రాజ్య సభ ఎంపీ వన్లాల్వేనాపై కేసు నమోదు చేశారు అసోం పోలీసులు. పోలీసుల హత్య కుట్రలో కీలక పాత్ర పోషించారనే అభియోగాన్ని ఆయన ఎదుర్కొంటున్నారు.

K Vanlalvena
కే వన్లల్​వేనాపై కేసు

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణకు సంబంధించి మిజోరం రాజ్యసభ ఎంపీ వన్లాల్వేనాపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల హత్య కుట్రలో ఈ ఎంపీ కీలక పాత్ర పోషించినట్లు ఆయన అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో వన్లాల్వేనా దాడికి సంబంధించిన సంకేతాలిచ్చారని వెల్లడించారు. ఈయనపై చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి పోలీసులు, సీఐడీ అధికారులు దిల్లీకి బయలుదేరనున్నట్లు స్పష్టం చేశారు. మిజోరం పోలీసులు, పౌరులు అసోం పోలీసులపై జరిపిన దాడికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దాడి జరిపిన వారి సమాచారం తెలిపిన వాళ్లకు రూ.5 లక్షల రివార్డ్​ను సైతం ప్రకటించారు.

అసోం మిజోరాం సరిహద్దులోని లైలాపూర్ వద్ద ఘర్షణ జరిగింది. మిజోరాం వైపు నుంచి కొంతమంది అసోం పరిధిలోని ప్రాంతాలను ఆక్రమించేందుకు వచ్చినవారిని అసోం పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో కర్రలు, రాళ్లు, అధునాతన ఆయుధాలను చేతబట్టిన మిజోరం బృందం.. అసోం పోలీసులపై దాడి చేసింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. మిజోరం వైపు నుంచి జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు. 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణకు సంబంధించి మిజోరం రాజ్యసభ ఎంపీ వన్లాల్వేనాపై అసోం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల హత్య కుట్రలో ఈ ఎంపీ కీలక పాత్ర పోషించినట్లు ఆయన అభియోగాన్ని ఎదుర్కొంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో వన్లాల్వేనా దాడికి సంబంధించిన సంకేతాలిచ్చారని వెల్లడించారు. ఈయనపై చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి పోలీసులు, సీఐడీ అధికారులు దిల్లీకి బయలుదేరనున్నట్లు స్పష్టం చేశారు. మిజోరం పోలీసులు, పౌరులు అసోం పోలీసులపై జరిపిన దాడికి సంబంధించిన ఫొటో గ్యాలరీని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దాడి జరిపిన వారి సమాచారం తెలిపిన వాళ్లకు రూ.5 లక్షల రివార్డ్​ను సైతం ప్రకటించారు.

అసోం మిజోరాం సరిహద్దులోని లైలాపూర్ వద్ద ఘర్షణ జరిగింది. మిజోరాం వైపు నుంచి కొంతమంది అసోం పరిధిలోని ప్రాంతాలను ఆక్రమించేందుకు వచ్చినవారిని అసోం పోలీసులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో కర్రలు, రాళ్లు, అధునాతన ఆయుధాలను చేతబట్టిన మిజోరం బృందం.. అసోం పోలీసులపై దాడి చేసింది. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి, బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. మిజోరం వైపు నుంచి జరిగిన కాల్పుల్లో ఆరుగురు అసోం పోలీసులు మరణించారు. 70 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.

ఇదీ చదవండి:సాధారణ దుస్తులు.. అసాధారణ ఆయుధాలు.. ఇంతకీ వారెవరు?

అసోం-మిజోరం సరిహద్దు ఘర్షణలో ఆరుగురు పోలీసులు మృతి

Last Updated : Jul 29, 2021, 4:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.