జమ్ము కశ్మీర్లో అధికరణ 370 రద్దయిన తరువాత మొదటిసారి కశ్మీర్లో శుక్రవారం పర్యటించారు భాజపా జాతీయ ప్రతినిధి షాన్వాజ్ హుస్సేన్. కశ్మీర్లో అధికరణ 370 ఎప్పటికీ పునరద్ధరణ కాదని తెలిపారు. జమ్ముకశ్మీర్ ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకునే ఆర్టికల్ 370ను రద్దు చేశామన్నారు. స్థానిక ఎన్సీ, పీడీపీ పార్టీలు తమ కుటుంబాల కోసం పనిచేశాయే కానీ ప్రజలకు పట్టించుకోలేదని దుయ్యబట్టారు.
కశ్మీర్ పర్యటకంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిందని.. ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. వచ్చే డీడీసీ ఎన్నికల్లో కశ్మీర్లో కమలం విరబూస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మరోవైపు కశ్మీర్లో పేరుకుపోయిన అవినీతిని రూపుమాపేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని భాజపా సీనియర్ నేత ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. 'గుప్కార్ కూటమి' కశ్మీర్కు ప్రమాదమన్నారు.