జమ్ముకశ్మీర్ కుప్వారాలోని కరల్పురాలో ప్రసవ వేదనతో ఇబ్బంది పడుతున్న నిండు గర్భిణీకి సాయం చేసేందుకు సైనికులు ముందుకొచ్చారు. గర్భిణిని ఓ మంచంపై మోసుకెళ్లి 2 కిమీ దూరంలో ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. జననరి 5న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మోకాళ్ల లోతు మంచులో గర్భిణీని సైనికులు తీసుకెళ్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిమపాతంలోనూ మహిళ ప్రాణాన్ని కాపాడేందుకు సైనికులు చూపించిన ధైర్యసాహసాలను ప్రతిఒక్కరూ ప్రశంసిస్తున్నారు.
- ఇదీ చూడండి: భక్తులకు శుభవార్త- 'శబరిమల రైలు'కు ఓకే