ETV Bharat / bharat

అయోధ్యలో స్థలం కొన్న అమితాబ్- 10వేల చదరపు అడుగులు ఎన్ని కోట్లంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2024, 7:17 PM IST

Updated : Jan 15, 2024, 8:09 PM IST

Amitabh Bachchan Ayodhya House : 'ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని' అయోధ్యలో ఇల్లు కట్టుకునేందుకు సిద్ధమయ్యారు బిగ్​బీ అమితాబ్ బచ్చన్. ఇందుకోసం ఆ నగరంలో 10వేల చదరపు అడుగుల స్థలం కొన్నారు. ఇందుకోసం ఆయన ఎంత వెచ్చించారంటే?

Amitabh Bachchan Ayodhya House
Amitabh Bachchan Ayodhya House

Amitabh Bachchan Ayodhya House : బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో స్థలం కొన్నారు. 10వేల చదరపు అడుగుల భూమిని దాదాపు రూ.14.5కోట్లకు కొనుగోలు చేశారు. ముంబయికి చెందిన స్థిరాస్తి సంస్థ 'హౌస్​ ఆఫ్​ అభినందన్​ లోధా' అభివృద్ధి చేస్తున్న 'ది సరయు' ప్రాజెక్ట్​లోనే ఈ స్థలం ఉంది. అమితాబ్ బచ్చన్​ ప్లాట్ కొన్న విషయాన్ని ఆ సంస్థ ధ్రువీకరించింది. అయితే ఇందుకోసం ఆయన చెల్లిస్తున్నారనే సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు.

"అయోధ్యలోని 'ది సరయు' ప్రాజెక్ట్​ కోసం 'ది హౌస్​ ఆఫ్​ అభినందన్ లోధా' గ్రూప్​తో నా ప్రయాణం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నాను. అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో ఇల్లు కట్టునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని అమితాబ్ బచ్చన్​ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే విషయమై ది హౌస్ ఆఫ్​ అభినందన్ లోధా సంస్థ ఛైర్మన్ అభినందన్ లోధా ఓ ప్రకటన విడుదల చేశారు. అయోధ్య నగర ఆర్థిక భవిత, ఆధ్యాత్మిక వారసత్వంపై ఉన్న విశ్వాసాన్ని అమితాబ్ బచ్చన్​ పెట్టుబడి ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ప్రాణప్రతిష్ఠ రోజే ప్రాజెక్ట్ లాంఛ్
45 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన సదుపాయాలతో ది సరయు ప్రాజెక్ట్​ను చేపట్టింది హౌస్​ ఆఫ్ అభినందన్ లోధా గ్రూప్. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా సరయు నది ఒడ్డున ఓ హోటల్ కూడా ఉంటుంది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22నే ది సరయు ప్రాజెక్ట్​ను లాంఛ్ చేయాలని భావిస్తోంది ఆ సంస్థ.

అయోధ్యలో అధునాతన ప్యాలెస్ హోటల్​ నిర్మించేందుకు 'ది లీలా ప్యాలెసెస్, హోటల్స్ అండ్ రిసార్ట్స్​' సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం- ఎంఓయూ కుదుర్చుకుంది అభినందన్ లోధా గ్రూప్. ఉత్తర్​ప్రదేశ్​లో ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్​ల అభివృద్ధి కోసం రూ.3వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు గతేడాది జనవరిలో ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో రూ.వెయ్యి కోట్లు అయోధ్యకే కేటాయించినట్లు తెలిపింది. లోధా వెంచర్స్ నేతృత్వంలోని అభినందన్ లోధా గ్రూప్ అయోధ్య, వారణాసి, గోరఖ్​పుర్​లోనూ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనుంది.

అయోధ్యలో రియల్ భూమ్
అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్న వేళ ఆ నగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. రామనగరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రహదారులకు దగ్గర్లో నివాస, వాణిజ్య స్థలాలను కొనేందుకు పోటీపడుతున్నారు. ఇతర నగరాలకు చెందిన వారు కూడా అయోధ్యలో నివసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరిగి ఉత్తర్​ప్రదేశ్ ​ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో ఆదాయం వస్తోంది. ఆ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్లు దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

అయోధ్య రామాలయ గర్భగుడిలో ఇద్దరు బాల రాముళ్లు- కొత్త విగ్రహం తయారు చేసింది ఆయనే!

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

Amitabh Bachchan Ayodhya House : బాలీవుడ్ దిగ్గజ నటుడు బిగ్​బీ అమితాబ్ బచ్చన్​ ఉత్తర్​ప్రదేశ్​లోని అయోధ్యలో స్థలం కొన్నారు. 10వేల చదరపు అడుగుల భూమిని దాదాపు రూ.14.5కోట్లకు కొనుగోలు చేశారు. ముంబయికి చెందిన స్థిరాస్తి సంస్థ 'హౌస్​ ఆఫ్​ అభినందన్​ లోధా' అభివృద్ధి చేస్తున్న 'ది సరయు' ప్రాజెక్ట్​లోనే ఈ స్థలం ఉంది. అమితాబ్ బచ్చన్​ ప్లాట్ కొన్న విషయాన్ని ఆ సంస్థ ధ్రువీకరించింది. అయితే ఇందుకోసం ఆయన చెల్లిస్తున్నారనే సమాచారాన్ని మాత్రం ఇవ్వలేదు.

"అయోధ్యలోని 'ది సరయు' ప్రాజెక్ట్​ కోసం 'ది హౌస్​ ఆఫ్​ అభినందన్ లోధా' గ్రూప్​తో నా ప్రయాణం ప్రారంభించేందుకు ఎదురు చూస్తున్నాను. అయోధ్యకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచ ఆధ్యాత్మిక రాజధానిలో ఇల్లు కట్టునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను" అని అమితాబ్ బచ్చన్​ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదే విషయమై ది హౌస్ ఆఫ్​ అభినందన్ లోధా సంస్థ ఛైర్మన్ అభినందన్ లోధా ఓ ప్రకటన విడుదల చేశారు. అయోధ్య నగర ఆర్థిక భవిత, ఆధ్యాత్మిక వారసత్వంపై ఉన్న విశ్వాసాన్ని అమితాబ్ బచ్చన్​ పెట్టుబడి ప్రతిబింబిస్తుందని తెలిపారు.

ప్రాణప్రతిష్ఠ రోజే ప్రాజెక్ట్ లాంఛ్
45 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమైన సదుపాయాలతో ది సరయు ప్రాజెక్ట్​ను చేపట్టింది హౌస్​ ఆఫ్ అభినందన్ లోధా గ్రూప్. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా సరయు నది ఒడ్డున ఓ హోటల్ కూడా ఉంటుంది. అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠ జరిగే జనవరి 22నే ది సరయు ప్రాజెక్ట్​ను లాంఛ్ చేయాలని భావిస్తోంది ఆ సంస్థ.

అయోధ్యలో అధునాతన ప్యాలెస్ హోటల్​ నిర్మించేందుకు 'ది లీలా ప్యాలెసెస్, హోటల్స్ అండ్ రిసార్ట్స్​' సంస్థతో ఇప్పటికే అవగాహన ఒప్పందం- ఎంఓయూ కుదుర్చుకుంది అభినందన్ లోధా గ్రూప్. ఉత్తర్​ప్రదేశ్​లో ఇంటిగ్రేటెడ్ టౌన్​షిప్​ల అభివృద్ధి కోసం రూ.3వేల కోట్లు పెట్టుబడి పెట్టాలని భావిస్తున్నట్లు గతేడాది జనవరిలో ఆ సంస్థ ప్రకటించింది. ఇందులో రూ.వెయ్యి కోట్లు అయోధ్యకే కేటాయించినట్లు తెలిపింది. లోధా వెంచర్స్ నేతృత్వంలోని అభినందన్ లోధా గ్రూప్ అయోధ్య, వారణాసి, గోరఖ్​పుర్​లోనూ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టనుంది.

అయోధ్యలో రియల్ భూమ్
అయోధ్య రామాలయం ప్రాణప్రతిష్ఠకు సిద్ధమవుతున్న వేళ ఆ నగరంలో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. రామనగరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాలు, రహదారులకు దగ్గర్లో నివాస, వాణిజ్య స్థలాలను కొనేందుకు పోటీపడుతున్నారు. ఇతర నగరాలకు చెందిన వారు కూడా అయోధ్యలో నివసించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఫలితంగా రిజిస్ట్రేషన్లు పెరిగి ఉత్తర్​ప్రదేశ్ ​ప్రభుత్వ ఖజానాకు భారీ స్థాయిలో ఆదాయం వస్తోంది. ఆ రాష్ట్ర స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ గణాంకాల ప్రకారం భూమి రిజిస్ట్రేషన్లు దాదాపు ఒకటిన్నర రెట్లు పెరిగాయి. పూర్తి వివరాల కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

అయోధ్య రామాలయ గర్భగుడిలో ఇద్దరు బాల రాముళ్లు- కొత్త విగ్రహం తయారు చేసింది ఆయనే!

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

Last Updated : Jan 15, 2024, 8:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.