ETV Bharat / bharat

లాక్​డౌన్​: కేరళలో పకడ్బందీ.. 'మహా'లో మాత్రం! - ఉత్తర్​ప్రదేశ్​లో లాక్​డౌన్​

దేశంలో రెండోదశ కరోనా విజృంభణతో పలు రాష్ట్రాలు లాక్​డౌన్​లోకి వెళ్లాయి. కఠిన ఆంక్షలతో దాదాపు అన్ని రాష్ట్రాల్లో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. వైరస్​కేసులు అధికంగా ఉండే మహారాష్ట్ర, కర్ణాటకల్లో మాత్రం.. కొవిడ్​ మార్గదర్శకాలకు తూట్లు పొడుస్తూ.. రోడ్లు, మార్కెట్లలో సంచరించారు ప్రజలు.

Lockdown
లాక్​డౌన్​
author img

By

Published : May 9, 2021, 12:43 PM IST

Updated : May 9, 2021, 2:15 PM IST

రెండోదశ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు స్వచ్ఛంద లాక్​డౌన్​ను అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రంజిత్​ సింగ్​ ఫ్లైఓవర్​ వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.

Delhi
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు అధికారి
Delhi
దిల్లీలోని రంజిత్​సింగ్​ ఫ్లైఓవర్​ వద్ద వాహనాల తనిఖీ

కేరళలో ఈ నెల 16 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉండగా.. అక్కడ వాహనాల తనిఖీ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. నిత్యం రద్దీగా ఉండే తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి.

Kerala
కేరళలో లాక్​డౌన్​ పాటిస్తున్నారిలా..
Kerala
కొచ్చి, తిరువనంతపురంలో నిర్మానుష్యంగా మారిన రోడ్లు
Kerala
కేరళలో వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు

గోవాలో ఆదివారం నుంచి ఈ నెల 24 వరకు లాక్​డౌన్​ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. నిత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది. కిరాణా దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే అందుబాటులో ఉండనున్నాయి.

Goa
గోవాలో లాక్​డౌన్​ పాటిస్తున్నారిలా..
Goa
పనాజీలో నిర్మానుష్యంగా మారిన రోడ్లు

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. మొరాదాబాద్​లో కర్ఫ్యూ విధించారు అధికారులు. దీంతో అక్కడి రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.

UP
యూపీలో నిర్మానుష్యంగా మారిన రహదారులు
UP
జనసంచారంలేక వెలవెలబోతున్న రోడ్లు

కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఈ నెల 10 నుంచి 24వరకు(రెండు వారాల పాటు) లాక్​డౌన్​ విధించనున్నట్టు యడియూరప్ప సర్కార్​ తెలిపింది. ఈ నేపథ్యంలో.. హుబ్బళి, శివమొగ్గ ప్రాంతాల వారు ఒక్కసారిగా మార్కెట్​ల వద్ద గుమిగూడారు. కొవిడ్​ మార్గదర్శకాలేవీ పాటించకుండా రోడ్లపై తిరిగారు. వారాంతపు జనతా కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు లెక్కచేయకపోవడం ఆందోళనకర విషయం.

Karnataka
కర్ణాటక మార్కెట్లో కరోనా నిబంధనలు పాటించకుండా..
Karnataka
శివమొగ్గ మార్కెట్లో గుమిగూడిన ప్రజలు
Karnataka
హుబ్బళీ మార్కెట్లో జనాలు తిరుగుతున్నారిలా..

మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఈ నెల 15వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నా.. దాన్ని విస్మరించారు అక్కడి ప్రజలు. మాస్క్​లు, భౌతికదూరం నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. మార్కెట్లు కిటకిటలాడాయి.

Maharashtra
నాగ్​పుర్​లోని ఓ మార్కెట్లో జనాలు
Maharashtra
రోడ్లపై గుమిగూడిన ప్రజలు

ఇదీ చూడండి: కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​

రెండోదశ కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు పలు రాష్ట్రాలు స్వచ్ఛంద లాక్​డౌన్​ను అమలు చేస్తున్నాయి. దేశ రాజధాని దిల్లీలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. రంజిత్​ సింగ్​ ఫ్లైఓవర్​ వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేపట్టారు.

Delhi
వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసు అధికారి
Delhi
దిల్లీలోని రంజిత్​సింగ్​ ఫ్లైఓవర్​ వద్ద వాహనాల తనిఖీ

కేరళలో ఈ నెల 16 వరకు లాక్​డౌన్​ అమల్లో ఉండగా.. అక్కడ వాహనాల తనిఖీ తప్పనిసరి చేసింది అక్కడి ప్రభుత్వం. నిత్యం రద్దీగా ఉండే తిరువనంతపురం, కొచ్చి ప్రాంతాల రహదారులు ఖాళీగా దర్శనమిచ్చాయి.

Kerala
కేరళలో లాక్​డౌన్​ పాటిస్తున్నారిలా..
Kerala
కొచ్చి, తిరువనంతపురంలో నిర్మానుష్యంగా మారిన రోడ్లు
Kerala
కేరళలో వాహన తనిఖీ చేస్తున్న పోలీసులు

గోవాలో ఆదివారం నుంచి ఈ నెల 24 వరకు లాక్​డౌన్​ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. నిత్యవసర సేవలకు మినహాయింపునిచ్చింది. కిరాణా దుకాణాలు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకే అందుబాటులో ఉండనున్నాయి.

Goa
గోవాలో లాక్​డౌన్​ పాటిస్తున్నారిలా..
Goa
పనాజీలో నిర్మానుష్యంగా మారిన రోడ్లు

ఉత్తర్​ప్రదేశ్​లో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న వేళ.. మొరాదాబాద్​లో కర్ఫ్యూ విధించారు అధికారులు. దీంతో అక్కడి రోడ్లన్నీ ఖాళీగా కనిపించాయి.

UP
యూపీలో నిర్మానుష్యంగా మారిన రహదారులు
UP
జనసంచారంలేక వెలవెలబోతున్న రోడ్లు

కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. ఈ నెల 10 నుంచి 24వరకు(రెండు వారాల పాటు) లాక్​డౌన్​ విధించనున్నట్టు యడియూరప్ప సర్కార్​ తెలిపింది. ఈ నేపథ్యంలో.. హుబ్బళి, శివమొగ్గ ప్రాంతాల వారు ఒక్కసారిగా మార్కెట్​ల వద్ద గుమిగూడారు. కొవిడ్​ మార్గదర్శకాలేవీ పాటించకుండా రోడ్లపై తిరిగారు. వారాంతపు జనతా కర్ఫ్యూ అమల్లో ఉన్నప్పటికీ ప్రజలు లెక్కచేయకపోవడం ఆందోళనకర విషయం.

Karnataka
కర్ణాటక మార్కెట్లో కరోనా నిబంధనలు పాటించకుండా..
Karnataka
శివమొగ్గ మార్కెట్లో గుమిగూడిన ప్రజలు
Karnataka
హుబ్బళీ మార్కెట్లో జనాలు తిరుగుతున్నారిలా..

మహారాష్ట్ర నాగ్​పుర్​లో ఈ నెల 15వరకు కఠిన నిబంధనలు అమల్లో ఉన్నా.. దాన్ని విస్మరించారు అక్కడి ప్రజలు. మాస్క్​లు, భౌతికదూరం నిబంధనలకు తూట్లు పొడుస్తూ.. మార్కెట్లు కిటకిటలాడాయి.

Maharashtra
నాగ్​పుర్​లోని ఓ మార్కెట్లో జనాలు
Maharashtra
రోడ్లపై గుమిగూడిన ప్రజలు

ఇదీ చూడండి: కొవిడ్​ వార్డులో నర్సు స్టెప్పులు.. వీడియో వైరల్​

Last Updated : May 9, 2021, 2:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.