ETV Bharat / bharat

తమిళనాట 'ఉచిత' వరాల జల్లు- నిపుణుల ఆందోళన

author img

By

Published : Mar 17, 2021, 6:56 PM IST

తమిళనాడు ఎన్నికలంటేనే ఉచిత హామీలకు వేదిక అని దేశ రాజకీయాల్లో అధికంగా వినిపిస్తుంది. తమిళనాట ప్రకటించినన్ని ఉచిత హామీలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ కనిపించవంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలు ఇందుకు మినహాయింపు కాదు. ఈ ఉచిత హామీలు రాష్ట్ర ఖజానాకు భారంగా మారుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

aiadmk-and-dmks-shower-of-freebies. experts flag financial implications
తమిళ ఓటర్లపై 'ఉచిత' వరాల జల్లు . ఆర్థిక నిపుణుల ఆందోళన

తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా దేశం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ప్రధాన ప్రత్యర్థులైన అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పోటీ ఓ కారణమైతే.. ఇరు పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు మరో కారణం. రూపాయికి కిలో బియ్యం నుంచి ఉచిత వాషింగ్‌మెషిన్ల వరకు ఎన్నో హామీలను తమిళ ప్రజలు పొందారు. ఉచిత టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సీలు, పాలిచ్చే ఆవులు సహా ఉచిత మంగళ సూత్రం వీటిలో ఉన్నాయి. ఎన్ని అమలయ్యాయి అన్నదాని కన్నా.. వచ్చే ఎన్నికల్లో ఇంకా వేటిని ఉచితంగా ప్రకటిస్తారన్న అంశమే ఆసక్తికరంగా ఉంటుంది. 2006లో కరుణానిధి ప్రకటించిన మేనిఫెస్టో దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ మేనిఫెస్టోలోనే ఉచిత కలర్‌ టీవీలను అందిస్తామని డీఎంకే ప్రకటించింది. అప్పటి నుంచి ఉచిత హామీలు తమిళనాట ఓ ట్రెండ్‌ అయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ ద్రవిడ పార్టీలు ఉచితాల వైపే మొగ్గు చూపాయి. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ ఉచిత హామీలు మరింత పాతాళానికి అణగదొక్కుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!

ఎవరి ప్రత్యేకత వారిదే..

తమిళనాట ఉన్న పార్టీల్లో ఉచిత హామీలు ప్రకటించడంలో వేటికదే ప్రత్యేకం. వరుసగా మూడోసారి అధికారం పొందాలని అన్నాడీఎంకే ఆకాంక్షిస్తుండగా.. దశాబ్దం పాటు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధికారంలోకి రావాలని ఉవ్విళూరుతోంది. ఈ నేపథ్యంలోనే, రెండు పార్టీలు పోటీ పడి మరీ ఉచిత హామీలు గుప్పించాయి. ఉచిత వాషింగ్‌ మెషిన్లు, ఇళ్లు, సోలార్‌ స్టవ్‌లతో పాటు విద్యారుణం మాఫీ, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలను అన్నాడీఎంకే ప్రకటించింది. డీఎంకే కూడా కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు 4 వేల రూపాయల సాయం, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, వివిధ రకాల రుణాల మాఫీని మేనిఫెస్టోలో పొందుపరిచింది. తమిళనాడు ఖజానాను అధికంగా నింపుతున్న మద్యం అమ్మకాలను దశలవారీగా నిషేధిస్తామని ఇరు పార్టీలు హామీ ఇచ్చాయి. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ ఒక అడుగు ముందుకువేసి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. అటు, కరోనా రెండో వేవ్‌ నేపథ్యంలో, అధికారం చేపట్టగానే తమ హామీలను ప్రభుత్వ పథకాలుగా మారుస్తామని రెండు పార్టీలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: 75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. డీఎంకే మేనిఫెస్టో

ఆర్థిక నిపుణుల ఆందోళన

పార్టీలు ప్రకటిస్తున్న హామీల అమలుపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా అప్పుల కుప్పను వారసత్వంగా పొందాలని నిపుణులు అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలను సమతౌల్యం చేయడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిధులు వెతుక్కోవడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నాడీఎంకే ప్రకటించిన ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అనే హామీపై ఓ నిపుణుడు స్పందిస్తూ.. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయనే అంశాన్ని ఆ పార్టీ మేనిఫెస్టో నిర్మాతలు ఆలోచించారా? అని ప్రశ్నించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమిస్తే వారి జీతాలకు ప్రభుత్వ ఖజానా సరిపోతుందా? అని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: సీఏఏపై అన్నాడీఎంకే యూటర్న్​- భాజపా పరేషాన్!

అలా ఏం జరగదు..

అన్నాడీఎంకే పార్టీ వర్గాలు మాత్రం ఎన్నికల మేనిఫెస్టో వల్ల ఆర్థికభారం పెరుగుతుందన్న విమర్శలను కొట్టిపారేశాయి. దేశ వృద్ధి రేటు మైనస్‌ 7.7 ఉన్న సమయంలో, తమిళనాడు 2.02 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అన్నాడీఎంకే వర్గాలు అంచనా వేశాయి. పళనిస్వామి ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎన్నికల మేనిఫెస్టోలతో వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకే కూడా హామీల అమలుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావని చెబుతోంది. తమ హామీలు అమలు చేసేందుకు వీలు ఉన్నవేనని ఆ పార్టీ స్పష్టం చేసింది.

తమిళనాడుకు ప్రస్తుతం 5 లక్షల 70 వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని, ఇది పళని సర్కారు పనితీరుకు నిదర్శమని డీఎంకే ఆరోపణలు గుప్పించింది. అన్నాడీఎంకే పాలనలో దక్షత కొరవడిందని, అవినీతి ప్రధాన పాత్ర పోషిందని విమర్శించింది. డీఎంకే మేనిఫోస్టోపై విమర్శలు చేసిన భాజపా.. 1967లోనే డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై రూపాయికి కిలోబియ్యం ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత మాటతప్పారని ఎద్దేవా చేసింది. 2006లో భూమి లేని వారికి భూమి ఇస్తామని ప్రకటించి మోసం చేసిందని ఆరోపించింది. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఇరు పార్టీల్లో, ఏ పార్టీ అధికారంలో వచ్చినా హామీలను ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీచూడండి: మహిళలకు డీఎంకే రూ.1000, అన్నాడీఎంకే రూ.1,500

తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా దేశం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ప్రధాన ప్రత్యర్థులైన అన్నాడీఎంకే, డీఎంకేల మధ్య పోటీ ఓ కారణమైతే.. ఇరు పార్టీలు ప్రకటించే ఉచిత హామీలు మరో కారణం. రూపాయికి కిలో బియ్యం నుంచి ఉచిత వాషింగ్‌మెషిన్ల వరకు ఎన్నో హామీలను తమిళ ప్రజలు పొందారు. ఉచిత టీవీలు, ల్యాప్‌టాప్‌లు, మిక్సీలు, పాలిచ్చే ఆవులు సహా ఉచిత మంగళ సూత్రం వీటిలో ఉన్నాయి. ఎన్ని అమలయ్యాయి అన్నదాని కన్నా.. వచ్చే ఎన్నికల్లో ఇంకా వేటిని ఉచితంగా ప్రకటిస్తారన్న అంశమే ఆసక్తికరంగా ఉంటుంది. 2006లో కరుణానిధి ప్రకటించిన మేనిఫెస్టో దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ మేనిఫెస్టోలోనే ఉచిత కలర్‌ టీవీలను అందిస్తామని డీఎంకే ప్రకటించింది. అప్పటి నుంచి ఉచిత హామీలు తమిళనాట ఓ ట్రెండ్‌ అయ్యాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ ద్రవిడ పార్టీలు ఉచితాల వైపే మొగ్గు చూపాయి. ఇప్పటికే అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఈ ఉచిత హామీలు మరింత పాతాళానికి అణగదొక్కుతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చూడండి: తమిళనాట పోటాపోటీగా 'ఉచిత హామీల' వల!

ఎవరి ప్రత్యేకత వారిదే..

తమిళనాట ఉన్న పార్టీల్లో ఉచిత హామీలు ప్రకటించడంలో వేటికదే ప్రత్యేకం. వరుసగా మూడోసారి అధికారం పొందాలని అన్నాడీఎంకే ఆకాంక్షిస్తుండగా.. దశాబ్దం పాటు ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే అధికారంలోకి రావాలని ఉవ్విళూరుతోంది. ఈ నేపథ్యంలోనే, రెండు పార్టీలు పోటీ పడి మరీ ఉచిత హామీలు గుప్పించాయి. ఉచిత వాషింగ్‌ మెషిన్లు, ఇళ్లు, సోలార్‌ స్టవ్‌లతో పాటు విద్యారుణం మాఫీ, ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం వంటి హామీలను అన్నాడీఎంకే ప్రకటించింది. డీఎంకే కూడా కరోనాతో నష్టపోయిన బియ్యం కార్డుదారులకు 4 వేల రూపాయల సాయం, స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు, వివిధ రకాల రుణాల మాఫీని మేనిఫెస్టోలో పొందుపరిచింది. తమిళనాడు ఖజానాను అధికంగా నింపుతున్న మద్యం అమ్మకాలను దశలవారీగా నిషేధిస్తామని ఇరు పార్టీలు హామీ ఇచ్చాయి. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ ఒక అడుగు ముందుకువేసి అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ప్రకటించింది. అటు, కరోనా రెండో వేవ్‌ నేపథ్యంలో, అధికారం చేపట్టగానే తమ హామీలను ప్రభుత్వ పథకాలుగా మారుస్తామని రెండు పార్టీలు చెబుతున్నాయి.

ఇదీ చూడండి: 75శాతం ఉద్యోగాలు స్థానికులకే.. డీఎంకే మేనిఫెస్టో

ఆర్థిక నిపుణుల ఆందోళన

పార్టీలు ప్రకటిస్తున్న హామీల అమలుపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి ఏ పార్టీ ప్రభుత్వం వచ్చినా అప్పుల కుప్పను వారసత్వంగా పొందాలని నిపుణులు అంటున్నారు. సంక్షేమ కార్యక్రమాలను సమతౌల్యం చేయడం, ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు నిధులు వెతుక్కోవడం ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అన్నాడీఎంకే ప్రకటించిన ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అనే హామీపై ఓ నిపుణుడు స్పందిస్తూ.. అసలు రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయనే అంశాన్ని ఆ పార్టీ మేనిఫెస్టో నిర్మాతలు ఆలోచించారా? అని ప్రశ్నించారు. ఇంటికో ప్రభుత్వ ఉద్యోగమిస్తే వారి జీతాలకు ప్రభుత్వ ఖజానా సరిపోతుందా? అని వ్యాఖ్యానించారు.

ఇదీ చూడండి: సీఏఏపై అన్నాడీఎంకే యూటర్న్​- భాజపా పరేషాన్!

అలా ఏం జరగదు..

అన్నాడీఎంకే పార్టీ వర్గాలు మాత్రం ఎన్నికల మేనిఫెస్టో వల్ల ఆర్థికభారం పెరుగుతుందన్న విమర్శలను కొట్టిపారేశాయి. దేశ వృద్ధి రేటు మైనస్‌ 7.7 ఉన్న సమయంలో, తమిళనాడు 2.02 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని అన్నాడీఎంకే వర్గాలు అంచనా వేశాయి. పళనిస్వామి ప్రభుత్వం సాధించిన విజయాలు, ఎన్నికల మేనిఫెస్టోలతో వరుసగా మూడో సారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకే కూడా హామీల అమలుకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకావని చెబుతోంది. తమ హామీలు అమలు చేసేందుకు వీలు ఉన్నవేనని ఆ పార్టీ స్పష్టం చేసింది.

తమిళనాడుకు ప్రస్తుతం 5 లక్షల 70 వేల కోట్ల రూపాయలు అప్పు ఉందని, ఇది పళని సర్కారు పనితీరుకు నిదర్శమని డీఎంకే ఆరోపణలు గుప్పించింది. అన్నాడీఎంకే పాలనలో దక్షత కొరవడిందని, అవినీతి ప్రధాన పాత్ర పోషిందని విమర్శించింది. డీఎంకే మేనిఫోస్టోపై విమర్శలు చేసిన భాజపా.. 1967లోనే డీఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై రూపాయికి కిలోబియ్యం ఇస్తామని చెప్పి అధికారంలో వచ్చిన తర్వాత మాటతప్పారని ఎద్దేవా చేసింది. 2006లో భూమి లేని వారికి భూమి ఇస్తామని ప్రకటించి మోసం చేసిందని ఆరోపించింది. ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్న ఇరు పార్టీల్లో, ఏ పార్టీ అధికారంలో వచ్చినా హామీలను ఎలా అమలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

తమిళనాడు అసెంబ్లీకి ఏప్రిల్‌ 6న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీచూడండి: మహిళలకు డీఎంకే రూ.1000, అన్నాడీఎంకే రూ.1,500

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.