ETV Bharat / bharat

సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్లకు అదనపు బాధ్యతలు

author img

By

Published : Aug 10, 2021, 11:32 PM IST

సిక్కిం, అరుణాచల్​ ప్రదేశ్​ గవర్నర్​లకు రాష్ట్రపతి అదనపు బాధ్యతలు అప్పగించారు. వీరిని మణిపుర్​, అరుణాచల్ ప్రదేశ్​లకు తాత్కాలిక గవర్నర్లుగా నియమించారు. ​

sikkim governor latest news
సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్లకు అదనపు బాధ్యతలు

సిక్కిం గవర్నర్‌ గంగా ప్రసాద్‌కు మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ డా. బీడీ మిశ్రాకు మిజోరాం రాష్ట్రాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం మణిపుర్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.నజ్మా హెబ్దుల్లా సెలవుపై వెళ్లడం వల్ల ఆ బాధ్యతలను గంగా ప్రసాద్‌కు అప్పగించారు. మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సెలవుపై వెళ్లడం వల్ల డా.బీడీ మిశ్రా మిజోరాం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

సిక్కిం గవర్నర్‌ గంగా ప్రసాద్‌కు మణిపుర్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ డా. బీడీ మిశ్రాకు మిజోరాం రాష్ట్రాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ప్రస్తుతం మణిపుర్‌ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న డా.నజ్మా హెబ్దుల్లా సెలవుపై వెళ్లడం వల్ల ఆ బాధ్యతలను గంగా ప్రసాద్‌కు అప్పగించారు. మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు సెలవుపై వెళ్లడం వల్ల డా.బీడీ మిశ్రా మిజోరాం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇదీ చదవండి : సీఎం కీలక నిర్ణయం- ఇకపై అవన్నీ బంద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.