సిక్కిం గవర్నర్ గంగా ప్రసాద్కు మణిపుర్, అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ డా. బీడీ మిశ్రాకు మిజోరాం రాష్ట్రాల అదనపు బాధ్యతలను అప్పగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం మణిపుర్ గవర్నర్గా విధులు నిర్వర్తిస్తున్న డా.నజ్మా హెబ్దుల్లా సెలవుపై వెళ్లడం వల్ల ఆ బాధ్యతలను గంగా ప్రసాద్కు అప్పగించారు. మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు సెలవుపై వెళ్లడం వల్ల డా.బీడీ మిశ్రా మిజోరాం బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
ఇదీ చదవండి : సీఎం కీలక నిర్ణయం- ఇకపై అవన్నీ బంద్