ETV Bharat / bharat

ట్రాక్టర్ ర్యాలీ హింసలో దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్

author img

By

Published : Jan 28, 2021, 5:04 AM IST

ట్రాక్టర్ ర్యాలీ హింస ఘటనలో నటుడు దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు దిల్లీ పోలీసులు. ఆయనతో పాటు మాజీ గ్యాంగ్​స్టర్ లఖా సిధానా, సామాజికవేత్త మేధా పాట్కర్, 37 మంది రైతు నేతలపై ఎఫ్ఐర్ దాఖలు చేశారు.

actor-activist-deep-sidhu-named-in-case-on-tractor-rally-violence
ట్రాక్టర్ ర్యాలీ హింసలో దీప్ సిద్ధూపై ఎఫ్ఐఆర్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో జరిగిన హింసపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎర్రకోట ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూ సహా సామాజిక కార్యకర్తగా మారిన గ్యాంగ్​స్టర్​ లఖా సిధానా, సామాజికవేత్త మేధా పాట్కర్‌, రైతు నాయకులు రాకేశ్‌ టికైత్, యోగేంద్ర యాదవ్, దర్శన్‌పాల్‌పై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్ఐఆర్​లో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

మంగళవారం ఎర్రకోట ప్రాంగణంలో హింసకు పాల్పడిన వ్యక్తులను గుర్తిస్తున్నట్లు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ఆయన.. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న 50 మందిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ సమయంలో సత్నాం సింగ్‌ పన్ను, దర్శన్‌ పాల్‌, బుట్టా సింగ్‌ వంటి రైతు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

హింసను ప్రొత్సహించిన ఏ ఒక్క కుట్రదారుడు చట్టం నుంచి తప్పించుకోలేరని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతులు నిర్వహించిన ట్రాక్టర్‌ ర్యాలీలో జరిగిన హింసపై దిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎర్రకోట ఘటనకు బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న నటుడు దీప్ సిద్ధూ సహా సామాజిక కార్యకర్తగా మారిన గ్యాంగ్​స్టర్​ లఖా సిధానా, సామాజికవేత్త మేధా పాట్కర్‌, రైతు నాయకులు రాకేశ్‌ టికైత్, యోగేంద్ర యాదవ్, దర్శన్‌పాల్‌పై ఎఫ్​ఐఆర్ నమోదు చేశారు. మొత్తం 37 మంది రైతు నేతల పేర్లను ఎఫ్ఐఆర్​లో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు.

మంగళవారం ఎర్రకోట ప్రాంగణంలో హింసకు పాల్పడిన వ్యక్తులను గుర్తిస్తున్నట్లు దిల్లీ పోలీస్‌ కమిషనర్‌ శ్రీవాస్తవ తెలిపారు. ఇప్పటివరకు 19 మందిని అరెస్ట్‌ చేసినట్లు తెలిపిన ఆయన.. ఈ ఘటనతో సంబంధం ఉందని అనుమానిస్తున్న 50 మందిని ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ర్యాలీ సమయంలో సత్నాం సింగ్‌ పన్ను, దర్శన్‌ పాల్‌, బుట్టా సింగ్‌ వంటి రైతు నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లు తెలిపారు.

హింసను ప్రొత్సహించిన ఏ ఒక్క కుట్రదారుడు చట్టం నుంచి తప్పించుకోలేరని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.