ETV Bharat / bharat

దేశంలో 50% పెరిగిన బాల్య వివాహాలు.. కరోనా కాలంలో..

author img

By

Published : Sep 18, 2021, 9:28 PM IST

కొవిడ్, లాక్‌డౌన్లతో సతమతమైన 2020లో బాల్య వివాహాలు(Child Marriage In India) భారీగా జరిగాయని జాతీయ నేర గణాంక సంస్థ(NCRB report 2020) తమ నివేదికలో తెలిపింది. 2019తో పోలిస్తే 2020లో దేశంలో బాల్య వివాహాల కేసులు దాదాపు 50శాతం పెరిగినట్లు చెప్పింది.

child marriages in 2020
2020లో బాల్య వివాహాలు

యావత్‌ దేశం కరోనాతో సతమతం అయిన వేళ మహమ్మారి మాటున 2020లో బాల్య వివాహాలు(Child Marriage In India) భారీగానే జరిగినట్లు తేలింది. 2019తో పోలిస్తే 2020లో దేశంలో బాల్య వివాహాల కేసులు(Child Marriage In India) దాదాపు 50శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్​సీఆర్​బీ)(NCRB report 2020) తమ నివేదికలో తెలిపింది.

బాల్య వివాహాల నిరోధక చట్టం కింద 2019లో 523 కేసులు నమోదు కాగా, 2020లో ఆ సంఖ్య 785కు చేరినట్లు వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 184 నమోదు కాగా.. అసోంలో 138, బంగాల్‌లో 98, తమిళనాడులో 77, తెలంగాణలో 62 కేసులు నమోదైనట్లు ఎన్​సీఆర్​బీ(NCRB report 2020) తెలిపింది. కరోనా సమయంలో ఆర్థిక సమస్యల వల్ల పోషణ భారం తగ్గించుకునేందుకు తల్లితండ్రులు తమ కూతుళ్లకు వివాహాలు చేసేందుకు మొగ్గుచూపినట్లు నిపుణులు తెలిపారు.

అత్యాచారాలు, హత్యలు రాజధానిలోనే ఎక్కువ!

మరోవైపు.. అత్యాచారాలు, హత్యల్లో మెట్రో నగరాల్లో జరుగుతున్న నేరాలను ఎన్​సీఆర్​బీ నివేదిక బయటపెట్టింది. గణాంకాల పరంగా.. దేశ రాజధాని నగరం దిల్లీనే మహిళలకు అంత సురక్షితం కాదనే విషయాన్ని నిగ్గు తేల్చింది. దేశవ్యాప్తంగా 2,533 అత్యాచార(India crime news), 1,849 హత్య ఘటనలు(india crime rate 2020) వెలుగులోకి వచ్చాయి. వాటిలో దాదాపు 40 శాతం అత్యాచార, 25 శాతం హత్య కేసులు(Rape statistics in India) ఒక్క దిల్లీలోనే నమోదయ్యాయి. 20 లక్షల జనాభా కలిగిన 19 మహానగరాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఈ లెక్కలను వెలువరించింది. హత్య కేసుల్లో తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబయి, సూరత్ ఉన్నాయి. అయితే ముందు సంవత్సరంతో పోల్చితే నేరాల రేటు కాస్త తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది.

ఇక దిల్లీలో 967 అత్యాచార ఘటనలు జరగ్గా.. జైపుర్, ముంబయి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యాచార బాధితుల్లో 2,448 మంది 18 ఏళ్లు పైడినవారు కాగా.. మిగిలిన వారు మైనర్లు. మరోపక్క దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 35,331. ముందు సంవత్సరంతో పోల్చితే 21.1 శాతం తగ్గినట్లు ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది. మగువలపై జరిగిన 30 శాతం నేరాలకు భర్త, అయినవాళ్లే కారణమయ్యారని ఎన్​సీఆర్​బీ నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి: ఒక్క ఏడాదిలో 3,031 'ప్రేమ హత్యలు'!

యావత్‌ దేశం కరోనాతో సతమతం అయిన వేళ మహమ్మారి మాటున 2020లో బాల్య వివాహాలు(Child Marriage In India) భారీగానే జరిగినట్లు తేలింది. 2019తో పోలిస్తే 2020లో దేశంలో బాల్య వివాహాల కేసులు(Child Marriage In India) దాదాపు 50శాతం పెరిగినట్లు జాతీయ నేర గణాంక సంస్థ(ఎన్​సీఆర్​బీ)(NCRB report 2020) తమ నివేదికలో తెలిపింది.

బాల్య వివాహాల నిరోధక చట్టం కింద 2019లో 523 కేసులు నమోదు కాగా, 2020లో ఆ సంఖ్య 785కు చేరినట్లు వెల్లడించింది. అత్యధికంగా కర్ణాటకలో 184 నమోదు కాగా.. అసోంలో 138, బంగాల్‌లో 98, తమిళనాడులో 77, తెలంగాణలో 62 కేసులు నమోదైనట్లు ఎన్​సీఆర్​బీ(NCRB report 2020) తెలిపింది. కరోనా సమయంలో ఆర్థిక సమస్యల వల్ల పోషణ భారం తగ్గించుకునేందుకు తల్లితండ్రులు తమ కూతుళ్లకు వివాహాలు చేసేందుకు మొగ్గుచూపినట్లు నిపుణులు తెలిపారు.

అత్యాచారాలు, హత్యలు రాజధానిలోనే ఎక్కువ!

మరోవైపు.. అత్యాచారాలు, హత్యల్లో మెట్రో నగరాల్లో జరుగుతున్న నేరాలను ఎన్​సీఆర్​బీ నివేదిక బయటపెట్టింది. గణాంకాల పరంగా.. దేశ రాజధాని నగరం దిల్లీనే మహిళలకు అంత సురక్షితం కాదనే విషయాన్ని నిగ్గు తేల్చింది. దేశవ్యాప్తంగా 2,533 అత్యాచార(India crime news), 1,849 హత్య ఘటనలు(india crime rate 2020) వెలుగులోకి వచ్చాయి. వాటిలో దాదాపు 40 శాతం అత్యాచార, 25 శాతం హత్య కేసులు(Rape statistics in India) ఒక్క దిల్లీలోనే నమోదయ్యాయి. 20 లక్షల జనాభా కలిగిన 19 మహానగరాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ప్రభుత్వం ఈ లెక్కలను వెలువరించింది. హత్య కేసుల్లో తర్వాతి స్థానాల్లో బెంగళూరు, చెన్నై, ముంబయి, సూరత్ ఉన్నాయి. అయితే ముందు సంవత్సరంతో పోల్చితే నేరాల రేటు కాస్త తగ్గిందని ఆ నివేదిక పేర్కొంది.

ఇక దిల్లీలో 967 అత్యాచార ఘటనలు జరగ్గా.. జైపుర్, ముంబయి తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అత్యాచార బాధితుల్లో 2,448 మంది 18 ఏళ్లు పైడినవారు కాగా.. మిగిలిన వారు మైనర్లు. మరోపక్క దేశవ్యాప్తంగా మహిళలపై జరిగిన నేరాల సంఖ్య 35,331. ముందు సంవత్సరంతో పోల్చితే 21.1 శాతం తగ్గినట్లు ఆ గణాంకాలను బట్టి తెలుస్తోంది. మగువలపై జరిగిన 30 శాతం నేరాలకు భర్త, అయినవాళ్లే కారణమయ్యారని ఎన్​సీఆర్​బీ నివేదిక పేర్కొంది.

ఇదీ చూడండి: ఒక్క ఏడాదిలో 3,031 'ప్రేమ హత్యలు'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.